
మళ్లీ ప్రారంభమైన గజ దాడులు
సదుం : కొద్ది రోజుల విరామం అనంతరం మండలంలో పంట పొలాలపై ఏనుగుల దాడులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. చెరకువారిపల్లె పంచాయతీ పరిధిలోని పోతం వారిపల్లె, కుమ్మరిపల్లె సమీపంలోని మామిడి చెట్లపై ఏనుగులు దాడి చేశాయి. సుమారు 15 వరకు ఉన్న ఏనుగుల గుంపు గురువారం ఉద యం మామిడి చెట్లను విరిచి వేయడంతో పా టు, డ్రిప్ పరికరాలు, నీటి సరఫరా పైప్లను ధ్వంసం చేసినట్లు బాధిత రైతులు వెంటేష్, కామేశ్వర, సోమశేఖర్, లక్ష్మమ్మ, ఆదిలక్ష్మి, లక్ష్మమ్మ, శ్రీనివాసులు, రమేష్, మునుస్వామి వాపోయారు. అటవీ ప్రాంతాల్లో ఏనుగులు సంచారం మళ్లీ ప్రారంభం కావడంతో సమీప గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
అక్రమ క్వారీలు నిర్వహిస్తే చర్యలు
బంగారుపాళెం : అక్రమ క్వారీలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని మైనింగ్ అధికారులు హెచ్చరించారు. గురువారం మండలంలోని కొత్తపల్లె, జంబువారిపల్లె వద్ద అక్రమ క్వారీలను పలమనేరు మైనింగ్ అధికారులు జియాలజిస్టు కుమారస్వామి, రాయల్టీ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, తహసీల్దార్ బాబురాజేంద్ర ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమాలకు పాల్పడి క్వారీ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. అదే విధంగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టేవారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
పెద్దపంజాణి : మండల పరిధిలోని శంకర్రాయలపేట గ్రామ సమీపంలో ని మామిడి తోట లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించా రు. వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. శంకర్రాయలపేటకు చెందిన జాన్సీ అనే మహిళకు చెందిన మామిడి తోటలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం పురుషుడిదిగా గుర్తించి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసు లు తెలిపారు. మృతుడు నలుపు రంగు బెల్టు, ప్యాంటు ధరించినట్లు పేర్కొన్నారు. నెల రో జుల క్రితం ఓ వ్యక్తికి కొన్ని వస్తువులు లభ్యం కాగా ఆ వస్తువుల్లోని ఫోన్ నంబరు ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు స మాచారం. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మళ్లీ ప్రారంభమైన గజ దాడులు