
బాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి
రాజంపేట టౌన్: విద్యార్థులు మహిళలు, రైతులను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీ చేపట్టనున్న వెనునపోటు దినం కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని ఆకేపాటి పిలుపునిచ్చారు. రాజంపేట పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వెన్నుపోటుదినం పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసగించారని ఆరోపించారు. . వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయించడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయని ఆకేపాటి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 2019 ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను ఏడాదిలోపే 99 శాతం అమలు చేశారని, అయితే చంద్రబాబునాయుడు అందుకు భిన్నంగా అరాచక పాలన సాగిస్తున్నారన్నారు.ఇలాగే పాలన సాగిస్తే ప్రజలే బుద్ధిచెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. చంద్రబాబునాయుడు రాజకీయాల్లో వెన్నుపోటుకు ఆద్యుడన్నారు. వెన్నుపోటుదినంతో ఆయన కళ్లు తెరిపిస్తామన్నారు. బాబుకు సంపద సృష్టిచడం తెలియదని...సంపద ఎలా సృష్టించాలో ప్రజలే సలహాలు ఇవ్వాలనే స్థాయికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు.కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి, వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, జెనుగు కృష్ణారావుయాదవ్, వడ్డే రమణ, మిర్యాల సురేఖ, పాపినేని విశ్వనాధ్రెడ్డి, సనిశెట్టి నవీన్, గీతాల నరసింహారెడ్డి, ఖాజా మొహిద్దీన్, రెడ్డిమాసి రమేష్నాయుడు, జీవీ.సుబ్బరాజు, జాహీద్అలీ తదితరులు పాల్గొన్నారు.