మహబూబ్నగర్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.
దేవరకద్ర(మహబూబ్నగర్): మహబూబ్నగర్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దేవరకద్ర మండలం చౌదర్పల్లిలో చిరుతపులి సంచరించడాన్ని గుర్తించిన స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలోని కురుమయ్య అనే రైతుకు చెందిన ఆవును ఇటీవల చిరుత చంపేసింది. చిరుత ఇంకా అదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చిరుత బెడద నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.