నేడు జిల్లాకు వైఎస్‌.జగన్‌ రాక

YS Jagan Mohan Reddy Chittoor Tour Today - Sakshi

చిత్తూరు కలెక్టరేట్‌ : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర నిశ్చయ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం తిరుపతికి రానున్నట్లు కలెక్టరేట్‌ అధికారులు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలిసారి జిల్లాకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 6 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాత్రి 7.30 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వస్తుండడంతో కలెక్టర్‌ ప్రద్యుమ్న, జాయింట్‌ కలెక్టర్‌ గిరీష, ఎస్పీ అన్బురాజన్, టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top