సాక్షి, అమరావతి: నేరం చేసిన వాళ్లే.. దొంగా..దొంగా అంటూ అరిచిన చందంగా టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మహిళల కోసం నారీ సంకల్ప దీక్ష అంటూ మహిళాభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్పై విమర్శలకు తెగబడుతోందని మండిపడ్డారు. వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సోమవారం వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెడుతూ శక్తివంతమైన నాయకుడిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారని చెప్పారు.
చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేయలేనిది జగన్ రెండున్నరేళ్ల పాలనలో చేసి చూపించారన్నారు. దీనిని చూసి ఓర్వలేక టీడీపీ, దాని దుష్ట మీడియా దుష్ప్రచారానికి ఒడిగడుతున్నాయని మండిపడ్డారు. ‘విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ జైన్ లైంగిక వేధింపులకు పాల్పడి 14 ఏళ్ల అమ్మాయి జీవితాన్ని బలితీసుకున్నాడు. బాధితులది విద్యాధిక కుటుంబం. ఎవరికీ చెప్పుకోలేక చిన్నారి ఆత్మహత్యకు పాల్పడింది. కారకులు ఎవరో బహిరంగంగా అందరికి తెలిసినా కూడా టీడీపీ మహిళల కోసం నారీ సంకల్ప దీక్షలు అంటూ కొత్త నాటకాలకు తెరదీసింది. లేనివి కల్పించి ప్రత్యేక కథనాలు, డిబేట్లు నిర్వహించే చానల్స్ వారికి మద్దతుగా ఉన్నాయి.
మహిళలపై నేరాల విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనడానికి చాలా ఉదాహరణలున్నాయి. మహిళలపై వేధింపులకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కోటి మందికి పైగా మహిళలు, విద్యార్థినులు దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారంటే ప్రభుత్వంపై వారికి ఉన్న నమ్మకమే కారణం. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని సరైన రీతిలో ఎదుర్కోవాలి. ప్రజలకు వాస్తవాలు తెలపాలి’ అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విద్యా రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు ప్రవేశపెడుతున్నట్టు వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళాభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని, మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ను తప్పనిసరి చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సంధానకర్తగా
వ్యవహరించారు.
టీడీపీ దిగజారుడు రాజకీయం
Published Tue, Feb 1 2022 4:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement