నిజామాబాద్
వెనువెంటనే అనుమతులు
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు కొత్త పోర్టల్ను
అందుబాటులోకి తెచ్చింది.
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
– 8లో u
ప్రభుత్వ పథకాల అమలు తీరు పరిశీలన
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని బుధవారం కేంద్ర హోంశాఖ బృందం విక్రం సింగ్ గుర్జార్, శిఖా సిన్హా, సుదేష్ కన్సాలన్ సందర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించారుఉ. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఎన్ఆర్ఈజీఎస్, పంట రుణాల మాఫీ పథకాలపై, అమలు గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో బ్రహ్మానందం, డీఎల్పీవో శివకృష్ణ, ఎంపీవో శ్రీనివాస్, ఏవో హరికృష్ణ, ఏపీవో సురేష్, జీపీ కార్యదర్శి హారిక పాల్గొన్నారు.
మాక్లూర్లో..
మాక్లూర్: మండలంలోని అమ్రాద్, ముల్లంగి గ్రామాల్లో బుధవారం ఎంపీడీవో లక్ష్మారెడ్డితో కలిసి కేంద్ర బృందం పర్యటించి,కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరును తెలుసుకున్నారు. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ పనులను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న ప్రతి పథకం ప్రజలకు చేరాలని స్థానిక అధికారులకు సూచించారు.
రూ.1.67 కోట్ల
పంట నష్టపరిహారం
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా నష్టపోయిన రైతులు ప్రభుత్వం పరిహారాన్ని మంజూరు చేసింది. 1,512మంది రైతులకు రూ.1.67కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిధులు త్వరలోనే బాధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొంది.
సాగర్లోకి 581
క్యూసెక్కుల ఇన్ఫ్లో
నిజాంసాగర్(జుక్కల్): రెండు, మూడు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకల్లో వరద నీటి ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి బుధవారం 581 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. 17.8 టీఎంసీలకు గాను 5.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహమ్మద్నగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్లోకి స్వల్ప ఇన్ఫ్లో వస్తోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 416.5 మీటర్లు కాగా.. 408 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది.
ఎస్సారెస్పీలోకి 1794 క్యూసెక్కులు..
బాల్కొండ: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురు స్తుండడంతో శ్రీరాంసాగర్ప్రాజెక్ట్లోకి 1,794 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ నుంచికాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 321 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1061.8(12.32 టీ ఎంసీలు) అడుగులు నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
నిజామాబాద్నాగారం: రోగుల రక్త పరీక్షలు నిర్వహించే టీ హబ్లోని యంత్రం తరచూ మొరాయిస్తోంది. ఓవర్ లోడ్ దీనికి ప్రధాన కారణం. 24గంటల పాటు యంత్రాన్ని ఉపయోగిస్తుండడంతో తరచూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. టీ హబ్లో 136 రకాల పరీక్షలు చేయాల్సి ఉండగా, కేవలం 10 నుంచి 15 లోపు మాత్రమే చేస్తున్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కు ప్రత్యేకంగా ల్యాబ్ లేకపోవడంతో టీ హబ్లోనే రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 37 పీహెచ్సీలు, 12 సీహెచ్సీలు, ఆర్మూర్ ఏరియా ఆస్పత్రి, బోధన్ జిల్లా ఆస్పత్రి, 10 యూపీహెచ్సీలు, వెల్నెస్ సెంటర్ కోసం గత ప్రభుత్వం టీ హబ్ ఏర్పాటు చేసింది. జిల్లా వైద్యారోగ్యశాఖపరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల నుంచి రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించి టీ హబ్లో పరీక్షలు నిర్వహించి రిపోర్టులను అదే రోజున లేదా మరుసటి రోజు సాయంత్రానికి ఫలితాలను పీహెచ్సీలకు మెయిల్ ద్వారా పంపిస్తారు.
జీజీహెచ్ కారణంగానే..!
జీజీహెచ్లో గతంలో 2వేలకు పైగా ఓపీ రాగా, ప్రస్తుతం 1800 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారు. వీరిలో కచ్చితంగా 50శాతానికి పైగా రోగులకు రక్త పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 80 మందికిపైగా రోగులు వివిధ అనారోగ్య కారణాలతో అడ్మిట్ అవుతున్నారు. జీజీహెచ్కు రోగుల తాకిడి అధికంగా ఉండడంతోనే రక్త పరీక్షల సంఖ్య సైతం పెరుగుతోంది. రక్త పరీక్షలు చేసే యంత్రంపై అధిక లోడ్ పడుతుండడంతో తరచూ మొరాయిస్తోంది. జీజీహెచ్కు గతంలో ప్రత్యేక ల్యాబ్ ఉండేది. అప్పుడు వెంటవెంటనే రక్త పరీక్షలకు సంబంధించి రిపోర్టులు వచ్చేవి. టీ హబ్ ఏర్పాటుతో జీజీహెచ్లోని ల్యాబ్ కనుమరుగైంది. ల్యాబ్లో ఉన్న యంత్రాలు ఎక్కడికి వెళ్లాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. జీజీహెచ్ అంతా టీహబ్పైనే ఆధార పడి ఉంది. రక్త పరీక్షలకు సంబంధించి రిపోర్టు రాకుండా జీజీహెచ్కు వచ్చే రోగులకు వైద్యులు మందులు ఎలా రాస్తారో.. ఇక అడ్మిట్ అయిన రోగుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహిస్తేనే దారుణంగా ఉంటుంది. పేదలు వచ్చే జీజీహెచ్కు ప్రత్యేక ల్యాబ్ ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పర్యవేక్షణ అంతంతే..
టీ హబ్ పర్యవేక్షణ అంతంతే అన్నట్లు సాగుతోంది. టీ హబ్ యంత్రాలు ఎందుకు మొరాయిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నాలు సైతం సంబంధిత అధికారులు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తే రోగులు లక్షలు పెట్టి ఎందుకు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తారని.. దీనిపై ఒకసారి ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు.
మే 23 వరకు సేకరించిన శాంపిళ్లు 16232
బ్లడ్ టెస్టులు 29,682
● కుటుంబ కలహాలతో బీఆర్ఎస్
కనుమరుగవుతుంది
● పార్టీ కోసం కష్టపడే వారికే ప్రాధాన్యత
● రూరల్ ఎమెల్యే డాక్టర్ భూపతిరెడ్డి,
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
డిచ్పల్లి/ధర్పల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ యే మన ప్రత్యర్థి అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ బల్లూరి వెంకట్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ కే తిరుపతి అన్నారు. 2017కి ముందు నుంచి కష్టపడి పని చేసిన వారికి పార్టీ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఉంటుందని వారు స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణపై బుధవారం డిచ్పల్లి మండలంలోని అమృతాగార్డెన్స్లో డిచ్పల్లి, మోపాల్, నిజామాబాద్రూరల్, జక్రాన్పల్లి మండలాల కార్యకర్తలకు, ధర్పల్లి మండల కేంద్రంలో ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల కాంగ్రెస్ కార్యకర్తలకు వారు దిశానిర్దేనం చేశారు. వారం లోగా గ్రామ, మండల కమిటీలకు అభ్యర్థుల పేర్లు ఎంపిక చేసి చేసి తమకు అందించాలన్నారు. పార్టీకోసం కష్టపడే వారికి అండగా ఉంటామని అదే సమయంలో పార్టీ కి నష్టం చేసే వారు ఎంతటి వారైన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. అధికారంలో ఉండగానే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, ఎన్నో ఎదురుదెబ్బలు తిని ఇప్పుడు ఎమ్మెల్యేగా మీ ముందున్నానని భూపతిరెడ్డి అన్నారు. కార్యకర్తల కష్టం తనకు తెలుసునని, పార్టీ విధానంలో భాగంగానే కొత్తవారిని చేర్చుకున్నామ న్నారు. పార్టీ కోసం ముందునుంచి ఎవరూ కష్టపడుతున్నా రో తనకు తెలుసునని అన్నారు. కుటుంబ కలహాలతో బీఆర్ఎస్ కనుమరుగు కానుందని సమావేశంలో ఉర్దూ అకా డమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేశ్రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్నాయక్, మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, ఏడు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, సాయారెడ్డి, చిన్నారెడ్డి, ఎల్లయ్య, బాలరాజ్, నవీన్గౌడ్, గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, యాదగిరి, నర్సయ్య, సొసైటీ చైర్మన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
న్యూస్రీల్
మొరాయిస్తున్న యంత్రాలు
జీజీహెచ్కు ప్రత్యేక ల్యాబ్ కరువు
ఇటీవల 20 రోజులపాటు
పనిచేయని యంత్రం
బ్లడ్ టెస్టులు లేక రోగులకు ఇబ్బందులు
వెల్నెస్ సెంటర్పై ఎఫెక్ట్
ఇటీవల టీహబ్లోని యంత్రం మొరాయించడంతో వెల్నెస్ సెంటర్లో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, జర్నలిస్టులకు రక్త పరీక్షలు చేయడం ఆపేశారు. సుమారు పది రోజులపాటు రక్త పరీక్షల కోసం శాంపిళ్లు తీసుకోకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరమ్మతులు చేస్తున్నా అంతే..
టీ హబ్లో యంత్రాలు చెడిపోవడం, తరచూ మొరాయించడంతో మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల యంత్రం మొరాయించడంతో టెక్నిషియన్లు మరమ్మతులు చేపట్టారు. మళ్లీ ఎప్పుడు మొరాయిస్తుందోననే భయభయంగా రక్త పరీక్షలు చేస్తున్నారు.
టీ హబ్పై ఓవర్లోడ్
టీ హబ్పై ఓవర్లోడ్
టీ హబ్పై ఓవర్లోడ్
టీ హబ్పై ఓవర్లోడ్