నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి

Jun 3 2025 5:41 AM | Updated on Jun 3 2025 5:41 AM

నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి

నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి

మన్ననూర్‌: ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ గౌతమ్‌ అన్నారు. అమ్రాబాద్‌ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికై న తుర్కపల్లి గ్రామంలో చేపట్టిన ఇంటి నిర్మాణాలను సోమవా రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి మాత్రమే బిల్లు లు వస్తాయన్నారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షిస్తూ.. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని అధికారులకు సూచించారు. అర్హులై న పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ఏడాది ఇల్లు మంజూరు కాని పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన వెంట మండల అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement