యోగా అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యోగా అలవర్చుకోవాలి

May 31 2025 12:34 AM | Updated on May 31 2025 4:17 PM

యోగా అలవర్చుకోవాలి

యోగా అలవర్చుకోవాలి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : ప్రతి ఒక్కరూ యోగా అలవర్చుకోవాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమా ర్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్స వం ఉత్సవాల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శా ఖ ఆధ్వర్యంలో ప్రీ మెగా యోగా కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక పోలీసు శిక్షణ మైదా నం నందు 4 వేల మందితో నిర్వహించారు. యోగా కార్యక్రమంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జిల్లా అటవీ శాఖ అధికారిణి భరణి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డాక్టర్‌ సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టర్‌ మీడియాతో మాట్లాడారు. జూన్‌ 1 నుంచి 20 వరకు ప్రతి మండలం, గ్రామంలోనూ యోగాపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.మోహన్‌ కు మార్‌, ఆర్డీ ఓ.భవాని, జడ్పీసీఈవో రవి కుమార్‌ నాయుడు, ,ఉద్యాన శాఖ డీడీ .మధుసూదన్‌ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి గౌరి, అగ్నిమాపక అధికారి పెద్దిరెడ్డి పాల్గొన్నారు.

ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు 
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజం

కార్వేటినగరం : చంద్రబాబు ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చేశారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. శుక్రవారం పుత్తూరులోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార దాహంతో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఓట్ల కోసం మేనిఫెస్టోలో చెప్పిన సూపర్‌ సిక్స్‌ హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. కూటమి పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహానాడు వేదికగా చంద్రబాబు అబద్దాలు చెప్పి ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం లేదని, రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. జగనన్న పాలనకు, చంద్రబాబు పాలన మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మద్యం, మనీ, మాఫీయా, మీడియాను గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రంలో దౌర్జన్య కాండ సృష్టిస్తున్నాడని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేడు పింఛన్ల పంపిణీ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 31వ తేదీన పింఛన్లను పంపిణీ చేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్‌ నెలకు సంబంధించి జిల్లాలో 2,63,776 మందికి రూ.112.73 కోట్లతో పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 31న పింఛన్లు పొందలేని లబ్ధిదారులకు జూన్‌ 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పింఛన్లు అందజేయాలని ఆదేశించారు.

నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల బదిలీ వాయిదా

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా విద్యాశాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల బదిలీలు గురువారం పలు కారణాలతో వాయిదా వేశారు.ఈ బదిలీలకు ఉమ్మడి చిత్తూరు పరిధిలోని నాన్‌ టీచింగ్‌ విద్యాశాఖ ఉద్యోగులు శుక్రవారం డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పలు కారణాలతో బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు 1
1/1

ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement