
చదువుకు ఊపిరి..అమ్మఒడి
ఒకే ఒక్కడు
గత ఐదేళ్లల్లో అమ్మఒడి అమలు ఇలా..
నియోజకవర్గం లబ్ధిపొందిన విద్యార్థుల ఖర్చు చేసినది
తల్లులు (రూ.కోట్లలో)
చిత్తూరు 1,10,045 165.07
గంగాధరనెల్లూరు 98,758 148.14
కుప్పం 98486 147.73
నగరి 94256 141.38
పలమనేరు 90965 136.45
పుంగనూరు 1,09,036 163.55
పూతలపట్టు 97858 146.79
చిత్తూరు కలెక్టరేట్ : ఆర్థిక పరిస్థితులతో ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకు దూరం కాకుండా...పనికి పంపే తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని బడికి పంపేలా గత వైఎస్సార్సీపీ సర్కారులో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. గత ఐదేళ్ల పాటు జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకంను ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు ప్రభుత్వ యాజమాన్యాల్లో చదువుతున్న విద్యార్థులకు అమలు చేశారు. పాఠశాల విద్య చదివే విద్యార్థులతో ఆగిపోకుండా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు సైతం అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున ఐదు సంవత్సరాలు జమ చేశారు. విద్యారంగం సంస్కరణలో విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేసిన పూర్వపు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకే ఒక్కడుగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఈ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా 6,99,404 మంది విద్యార్థులకు గత ఐదేళ్ల పాటు అమలు చేసి రూ.1049.11 కోట్లను ఖర్చు చేశారు. పథకం లబ్ధిపొందిన లక్షల మంది విద్యార్థులు ప్రయోజకులయ్యారు.