గడప వద్దకు సేవలు కనుమరుగు
వైఎస్సార్సీపీ పాలనలో ఇంటి ముంగిటకే సేవలు
కూటమి పాలనలో దరి చేరని సంక్షేమ పథకాలు
సూపర్సిక్స్ హామీల అమల్లో ప్రభుత్వం విఫలం
పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సేవలను పట్టించుకోని ప్రభుత్వం
కూటమి పాలనపై మండిపడుతున్న ప్రజలు
అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీలు గుప్పించింది. అమాయక ప్రజలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తా రని నమ్మేశారు. కూటమి ఇచ్చి న కపట హామీలను నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడా ది అవుతున్న సమయంలో ఏ సంక్షేమ పథకం....ప్రభుత్వ సేవలు.... సూపర్ సిక్స్ హామీలు అమలు కాకపోవడంతో విస్మయం చెందుతున్నారు. గత ఐదేళ్ల పాటు ఇంటి ముంగిటకే చేరిన సంక్షేమపాలన, ప్రభుత్వ సేవలను గుర్తు చేసుకుని తప్పు చేశా మని ఆవేదన చెందుతున్నారు. నమ్మి కూటమి టీడీపీకి ఓట్లు వేసిన పాపానికి ప్రస్తుతం సంక్షేమ పథకా లు, ప్రభుత్వ సేవలకు గడప కాదు కదా ఊరు దాటాల్సిన దుస్థితి ఏర్పడిందని మదన పడుతున్నారు.
నాన్ డీబీటీ పథకంలో లబ్ధి ఇలా....
నాన్ డీబీటీ పథకం, లబ్ధి పొందిన వారు, ఖర్చు చేసిన మొత్తం (రూ.కోట్లలో)
జగనన్న గోరుముద్ద, 137898, 140.78
జగనన్న విద్యాకానుక, 141030, 100.16
ఇళ్ల పట్టాలు, 90670, 2266.75
రేషన్కార్డుల పంపిణీ, 78665, -