చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పోలీసులు తనను అకారణంగా వేధిస్తున్నారని పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లెకు చెందిన భానుప్రకాష్ ఆరోపించారు. బుధవారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 14వ తేదీన గ్రామానికి చెందిన ఫీల్డ్ ఆఫీసర్ ఆదెమ్మ తమ గ్రామంలో బాలకార్మికుల చేత పనిచేయించారని, ఈ విషయాన్ని ఫొటోలతో సహా పీడీకి ఫిర్యాదు చేశానన్నారు. తర్వాత 21వ తేదీ పూతలపట్టు పోలీసులు తనను స్టేషన్కు రమ్మన్నారని చెప్పారు.
తాను స్టేషన్కు వెళ్తే ఏ వివరాలు చెప్పకుండా.... అకారణంగా రెండు రోజులు స్టేషన్లో కూర్చోబెట్టారని చెప్పారు. తనను ఎందుకు స్టేషన్లో కూర్చోబెట్టారని అడిగితే ‘ఫీల్డ్ ఆఫీసర్ పైనే ఫిర్యాదు చేస్తావా’ అంటూ తనను దుర్భాషలాడారని ఆరోపించారు. తనపై ఏ కేసు పెట్టారని ఆర్టీఐ కింద అర్జీ ఇచ్చినా పోలీసులు సరైన సమాధానం ఇవ్వడం లేదని చెప్పారు. ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.
నేటి నుంచి రైతులకు సాంకేతికతపై అవగాహన
రేణిగుంట : వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్లో భాగంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై గురువారం నుంచి అవగాహన కల్పించనున్నట్లు రాస్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 15 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఖరీఫ్లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వినియోగించాల్సిన టెక్నాలజీని వివరించనున్నట్లు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎస్వీయూ ఎగ్జామినేషన్ డీన్గా సురేంద్రబాబు
తిరుపతి సిటీ: ఎస్వీయూ లైబ్రరీ ఇన్చార్జిగా కొనసాగుతున్న ప్రొఫెసర్ కె.సురేంద్రబాబును వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్గా నియమిస్తూ వీసీ అప్పారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేంద్రబాబు వీసీ చాంబర్లో వీసీ, రిజిస్ట్రార్ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. గతంలో డీన్గా ఉన్న ప్రొఫెసర్ ఎస్ కిషోర్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
వృద్ధురాలికి గాయాలు
పాకాల: మండలంలోని ఇరుగురురంగయ్యగారిపల్లె వద్ద బుధవారం రోడ్డు దాటున్న మరియమ్మ అనే వృద్ధురాలిని 104 వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మరియమ్మ కుడి కాలు విరిగింది. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీని పై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

‘పూతలపట్టు పోలీసులు వేధిస్తున్నారు’

‘పూతలపట్టు పోలీసులు వేధిస్తున్నారు’