తెలంగాణ లా ఆఫీసర్స్ అడహక్ కమిటీ ఏర్పాటు | Telangana Law Officers set up adahak | Sakshi
Sakshi News home page

తెలంగాణ లా ఆఫీసర్స్ అడహక్ కమిటీ ఏర్పాటు

May 19 2014 2:17 AM | Updated on Mar 28 2018 10:56 AM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన న్యాయవాదులు (ప్లీడర్లు, ప్రాసిక్యూటర్లు) రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు హక్కుల సాధన కోసం సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

 హైదరాబాద్ : తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన న్యాయవాదులు (ప్లీడర్లు, ప్రాసిక్యూటర్లు) రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు హక్కుల సాధన కోసం సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కొంపల్లిలో జరిగిన సమావేశంలో అడహక్ కమిటీని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రభుత్వ ప్లీడర్  వై.కొండల్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు.

 లా ఆఫీసర్స్ అసోసియేషన్ అడహక్ కమిటీ

 కొండల్‌రెడ్డి (జీపీ), సరళ రెడ్డి (పీపీ)  రంగారెడ్డి జిల్లా, రాజేందర్‌రెడ్డి (జీపీ), సుదర్శన్‌రెడ్డి (పీపీ) మహబూబ్‌నగర్ జిల్లా, నరేష్‌కుమార్ జోషి (జీపీ), బి.ప్రవీణ్‌కుమార్ ( ఏపీఎస్) అదిలాబాద్‌జిల్లా, సత్యనారాయణ (జీపీ), గోపాల్ సింగ్( ఏపీపీ) హైదరాబాద్, కె.జగన్‌మోహన్‌రెడ్డి (ఏజీపీ), హర్జీత్ సింగ్ ( ఏపీపీ) కరీంనగర్ జిల్లా, హన్మంత్‌రెడ్డి (జీపీ), శివాజీ గణేష్ (ఏపీపీ) మెదక్‌జిల్లా, ఆనంద్‌రెడ్డి (జీపీ), పరిపూర్ణారెడ్డి (పీపీ) నిజామాబాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement