సింగరేణిలో ప్రమాదం: ఇద‍్దరు కార్మికుల మృతి | 2 Workers dies in Singareni Coal Mine Accident in bhadradri | Sakshi
Sakshi News home page

సింగరేణిలో ప్రమాదం: ఇద‍్దరు కార్మికుల మృతి

Apr 18 2017 12:57 PM | Updated on Sep 2 2018 4:16 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి ఉపరితల బొగ్గుగని కేంద్రంలో మంగళవారం మధ్యాహ‍్నం బంకర్‌ కూలి ఇద్దరు కార్మికులు మృతిచెందారు.

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి ఉపరితల బొగ్గుగని కేంద్రంలో మంగళవారం మధ్యాహ‍్నం బంకర్‌ కూలి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. లారీలో బొగ్గు నింపుతుండగా.. అక్కడే పనులు చేస్తున్న పవన్‌ (31), రఘుపాల్‌రెడ్డి(32) అనే కార్మికులపై బంకర్‌ కూలింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తోటి కార్మికులు వెంటనే స్పందించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదంలో బొగ్గులోడ్‌ చేసేందుకు వచ్చిన టిప్పర్‌ వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ బంకర్‌ను మూడు నెలల క్రితమే నిర్మించారని.. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని.. కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement