సీపీఐ, సీపీఎం స్నేహగీతం | CPI, CPM leaders meet | Sakshi
Sakshi News home page

సీపీఐ, సీపీఎం స్నేహగీతం

Apr 14 2014 6:45 PM | Updated on Aug 13 2018 8:10 PM

సీమాంధ్రలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలసికట్టుగా సాగే దిశగా చర్చలు జరుగుతున్నాయి. సీపీఐ, సీపీఎం నేతలు సోమవారం సమావేశమై ఈ విషయంపై చర్చించారు.

హైదరాబాద్: సీమాంధ్రలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలసికట్టుగా సాగే దిశగా చర్చలు జరుగుతున్నాయి. సీపీఐ, సీపీఎం నేతలు సోమవారం సమావేశమై ఈ విషయంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్లో 9 స్థానాల విషయంలో అభిప్రాయభేదాలున్నాయని చెప్పారు.

సీపీఎం నాయకుడు మధు, సీపీఐ నేత రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా పరస్పర అవగాహనకు రావాలని నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణలో సీపీఐ కాంగ్రెస్తో జతకట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement