ఏపీలో ఇసుక మాఫియాపై హైకోర్టు సీరియస్ | high court expresses anger over illegal sand transportation | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇసుక మాఫియాపై హైకోర్టు సీరియస్

Sep 7 2015 12:50 PM | Updated on Aug 31 2018 8:24 PM

ఏపీలో ఇసుక మాఫియాపై హైకోర్టు సీరియస్ - Sakshi

ఏపీలో ఇసుక మాఫియాపై హైకోర్టు సీరియస్

పశ్చిమ గోదావరి జిల్లాలో యథేచ్ఛగా సాగుతోన్న ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైదరాబాద్: తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి ఘటన తర్వాత తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఇసుక మాఫియాపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో యథేచ్ఛగా సాగుతోన్న ఇసుక అక్రమ రవాణాపై ఆ జిల్లా కలెక్టర్ను నిలదీసింది. ఇసుక  అక్రమ తవ్వకాలపై దాఖలైన పిటిషన్ను సోమవారం విచారించిన హైకోర్టు..  సహజ వనరులను భవిష్యత్ తరాలకు మిగల్చాలని సూచించింది.

'ఏ నిబంధనల ప్రకారం ఇసుక క్వారీలకు అనుమతి ఇచ్చారు? ఇబ్బడిముబ్బడిగా తవ్వకాలు చేపడితే ఎలా? భవిష్యత్ తరాలకు ఇసుక అవసరం ఉండదా?' అని ప్రశ్నించింది. ఇష్టానుసారంగా క్వారీలకు అనుమతులు మంజూరు చేయడం తగదని, మాఫియా బారినుంచి ఇసుక సహా ఇతర సహజ వనరులను రక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని గుర్తుచేస్తూ విచారణను వచ్చే సోమవారానికి వాయిదావేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement