రెండు బస్సులు ఢీ- 30 మందికి గాయాలు | 30 injured in two buses collide | Sakshi
Sakshi News home page

రెండు బస్సులు ఢీ- 30 మందికి గాయాలు

Jun 28 2016 5:42 PM | Updated on Aug 30 2018 4:07 PM

రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి.

-మెదక్ జిల్లాలో ఘటన
రామాయంపేట

 రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన బస్సు బైపాస్‌రోడ్డువద్ద రామాయంపేట వైపు వెళుతుండగా, హైదరాబాద్ వైపు వెళుతున్న నిజామాబాద్ డిపోకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఈప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డవారిలో ఎక్కువ మంది నిజామాబాద్ జిల్లాకు చెందినవారే ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement