జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు | SSC advanced supplementary examinations on 18th June | Sakshi
Sakshi News home page

జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

May 20 2015 4:31 AM | Updated on Sep 3 2017 2:19 AM

ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 18 నుంచి జూలై 2వ తేదీ వరకు నిర్వహిస్తామని డీఈవో కె.లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

డీఈవో లింగయ్య
కరీంనగర్ ఎడ్యుకేషన్ : ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 18 నుంచి జూలై 2వ తేదీ వరకు నిర్వహిస్తామని డీఈవో కె.లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్ష ఫీజు ఒకటి నుంచి మూడు సబ్జెక్టుల వరకు రూ.110 చొప్పున, 4 నుంచి 6 సబ్జెక్టులకు రూ.125 చొప్పున చలాన్ ద్వారా ఈనెల 30వ తేదీ లోగా ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలన్నారు.

వారు జూన్ ఒకటిన ట్రెజరీ/బ్యాంకుల్లో జమ చేసి జూన్ 3న నామినల్‌రోల్స్‌ను డీఈవో కార్యాలయం, కరీంనగర్‌లో సమర్పించాలని సూచించారు. అపరాధ రుసుం రూ.50తో జూన్ 16 వరకు చెల్లించాలన్నారు.
 
రీ-కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున డీడీ (ఎస్‌బీఐ/ఎస్‌బీహెచ్)లేదా చలాన్ ద్వారా సంచాలకులు, ప్రభుత్వ పరీక్షలు, తెలంగాణ, హైదరాబాద్‌కు పంపించాలన్నారు. రీ-వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.వెరుు్య చలాన్ ద్వారా మాత్రమే చెల్లించి, ప్రధానోపాధ్యాయులు ద్వారా డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. రీ-వెరిఫికేషన్ కోసం నిర్ణీత నమూనా www.bstelangana.org వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement