వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన చిట్ల సత్తయ్య(55) అనే పొలంలో విద్యుత్షాక్కు గురై మృతి చెందాడు.
విద్యుత్ షాక్తో రైతు మృతి
Aug 5 2016 7:08 PM | Updated on Oct 1 2018 2:44 PM
వేములవాడ రూరల్ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన చిట్ల సత్తయ్య(55) అనే పొలంలో విద్యుత్షాక్కు గురై మృతి చెందాడు. సత్తయ్య తన వ్యవసయ బావి వద్దకు వెళ్లి పొలానికి నీటిని పెట్టేందుకు విద్యుత్మోటర్ను ఆన్చేయగా స్టార్టర్ బాక్స్కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురయ్యాడు. కొంతసేపటికి అటువైపు వెళ్లిన కొందరు రైతులకు సత్తయ్య కిందపడి ఉండడాన్ని గమనించి, వెంటనే అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునే సరికే సత్తయ్య మృతి చెందాడు.
Advertisement
Advertisement