వ్యభిచార గృహంపై దాడి, ముగ్గురు రిమాండ్
హైదరాబాద్: ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎల్బీనగర్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... న్యూనాగోలు కాలనీలో ఓ ఇంట్లో సూర్యాపేటకు చెందిన నాగన్న, నిజామాబాద్కు చెందిన సుధారాణిలు వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేయగా రాజమండ్రికి చెందిన ఓ యువతి(22), నిర్వాహకులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మరో యువకుడు పారిపోయాడు.