exporter
-
అపుడు కాలుష్య కాసారం : ఇపుడు ఏడాదికి 600 టన్నుల పళ్లు
లయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అనగానే ఆయిల్ నుంచి టెలికాం దాకా వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలు గుర్తొస్తాయి. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ప్రపంచంలోనే అత్యధికంగా మామిడిపండ్లను ఎగుమతి చేసే సంస్థల్లో ఒకటిగా ఉందని తెలుసా? అంబానీకి ఎన్ని ఎకరాల మామిడి తోట ఉంది? ఎన్ని రకాలు మామిడి పళ్లను పండిస్తారు? అసలు మ్యాంగో ఫామ్ వెనుకున్న రియల్ స్టోరీ ఏంటి? ఆ వివరాలు మీకోసం.గుజరాత్లోని జామ్నగర్లో 600 ఎకరాల మామిడి తోట (Reliance Mango Farm) రిలయన్స్ సొంతం. ఇందులో 1.5 లక్షలకు పైగా వివిధ రకాల మామిడి చెట్లున్నాయి. అల్ఫాన్సో మొదలు టామీ అట్కిన్స్ , 200లకు పైగా దేశీ, విదేశీ రకాల మామిడి చెట్లు ఫలాలనిస్తాయి. వీటిల్లో చాలా వరకు ప్రపంచంలోని అత్యుత్తమ రకాలకు చెందినవి కావడం విశేషం.ఇదీ చదవండి : ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్అయితే రిలయన్స్ మామిడి వ్యాపారంలోకి ప్రవేశించటానికి వెనుక ఒక కథ ఉంది. మ్యాంగో ఫామ్ హౌస్ వెనకాల పెద్ద చరిత్ర ఉంది. 1997లో, జామ్నగర్లోని రిలయన్స్ శుద్ధి కర్మాగారం భారీ కాలుష్యానికి కారణమైంది. గుజరాత్ కాలుష్య నియంత్రణ బోర్డు నుండి పదేపదే నోటీసులిచ్చింది. పర్యావరణాన్ని కాపాడి, ఫ్యాక్టరీని కొనసాగించే లక్ష్యంతో, అనివార్యంగా రిలయన్స్ మామిడి తోటను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది రిలయన్స్. 1998 లో ఈ కర్మాగారం చుట్టూ ఉన్న బంజరు, ఉప్పునీటి భూముల్లో మామిడి చెట్లను నాటించింది. ఇక్కడున్న అనేక ప్రతికూలతలను అధిగమించేందకు కంపెనీ కొత్త టెక్నాలజీని వినియోగించింది. డీశాలినేషన్, బిందు సేద్యం, వర్షపు నీటి సంరక్షణ, పోషక నిర్వహణ పద్దతులను పాటించారు. సముద్రపు నీటిని శుద్ధి చేసేందుకు, డీశాలినేషన్, నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్దతులను ఉపయోగించారు.చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్దాదాపు 7-8 సంవత్సరాల ప్రయత్నాలు ఫలించాయి. ఈ గార్డెన్ పేరే ధీరూభాయ్ అంబానీ లఖిబాగ్ అమ్రాయీ. ప్రపంచంలోనే అతిపెద్దదిగా 600 ఏకాల విస్తీర్ణంలో చుట్టూ పచ్చని చెట్లతో ఏడాది 600 టన్నుల మామిడి పళ్లను అందిస్తుందీ తోట. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఎగుమతిదారుగా అవతరించింది. అలా కాలుష్య కాసార నుంచి పచ్చని ప్రకృతిక్షేత్రంగా ఎదిగింది. దీంతో పాటు రిలయన్స్ ప్రతి సంవత్సరం ఒక లక్ష మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. అలాగే ఆధునిక వ్యవసాయంలో శిక్షణ అందించడం ద్వారా స్థానిక రైతులకు సహాయం చేస్తుంది. ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర? -
ట్రంప్ టారిఫ్ల టెన్షన్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార టారిఫ్ల అమలుకు డెడ్లైన్ అయిన ఏప్రిల్ 2 దగ్గరపడటంతో ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొంది. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై అందరిలోనూ అయోమయం నెలకొంది. వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే దేశాల జాబితాలో భారత్ని కూడా అమెరికా చేర్చడంతో ... టారిఫ్లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని ఆశాభావం నెలకొంది. ఈ నేపథ్యంలో టారిఫ్లు, ఏయే రంగాలపై ప్రభావం పడొచ్చనే అంశాలను ఒకసారి చూస్తే.. – న్యూఢిల్లీఅమెరికా ప్రణాళిక ఏంటంటే..వివిధ దేశాలతో తమకున్న వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు వాటి నుంచి తమకు వచ్చే దిగుమతులపై అమెరికా సుంకాలను విధించడం / పెంచడం వంటి చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన ప్రతిపాదన ఇది. అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన.2021–22 నుంచి 2023–24 మధ్య కాలంలో భారత్కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశంగా ఉంది. భారత్ ఎగుమతుల్లో 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, అన్ని దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతం వాటా అమెరికాది ఉంది. 2023–24లో భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 119.71 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో భారత్ నుంచి 77.51 బిలియన్ డాలర్ల ఎగుమతులు, అమెరికా నుంచి 42.19 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి. దీంతో వాణిజ్య మిగులు భారత్ పక్షాన సుమారు 35.31 బిలియన్ డాలర్లుగా నమోదైంది.భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..ప్రస్తుతానికి టారిఫ్లను ఏ విధంగా విధిస్తారనేది, అంటే ప్రోడక్టు స్థాయిలోనా, లేదా రంగాలవారీగానా, లేదా దేశ స్థాయిలోనా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..అమెరికా నుంచి దిగుమతులపై భారత్ విధించే సుంకాలు, నిజానికి ఆరోపిస్తున్న దానికంటే చాలా తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అమెరికా గానీ సహేతుక వాణిజ్య విధానాన్ని అవలంబిస్తే, పెద్దగా అవాంతరాలు లేకుండా భారత పరిశ్రమలు ఎగుమతులను కొనసాగించవచ్చని, ఇరు దేశాల మధ్య మరింత సమతూకమైన, స్థిరమైన విధంగా వాణిజ్య బంధం బలోపేతం కావచ్చని పేర్కొన్నారు. నాలుగు స్థాయిల్లో టారిఫ్ల ప్రభావాలను జీటీఆర్ఐ అంచనా వేసింది.దేశ స్థాయిలో: భారత్ నుంచి అన్ని ఎగుమతులపై ఒకే రకంగా టారిఫ్లు విధించడం: ఒకవేళ ఈ విధానాన్ని అమలు చేస్తే మన ఎగుమతులపై అదనంగా 4.9 శాతం భారం పడుతుంది. ప్రస్తుతం అమెరికా ఉత్పత్తులపై మన దగ్గర టారిఫ్లు సగటున 7.7 శాతంగా ఉండగా, మన ఎగుమతులపై అక్కడ సగటున 2.8 శాతంగా ఉంటోంది. ఆ విధంగా రెండింటి మధ్య 4.9 శాతం వ్యత్యాసం ఉంది.వ్యవసాయం, పరిశ్రమల స్థాయిలో: ఈ విధానాన్ని అమలు చేస్తే వ్యవసాయోత్పత్తులపై అదనంగా 32.4 శాతం, పారిశ్రామికోత్పత్తులపై 3.3 శాతం భారం పడొచ్చు. ప్రస్తుతం అమెరికాకు భారత వ్యవసాయోత్పత్తులపై 5.3 శాతం సుంకాలు ఉండగా, అక్కడి నుంచి దిగుమతులపై అత్యధికంగా 37.7 శాతంగా (వ్యత్యాసం 32.4 శాతం) ఉంటోంది. మరోవైపు పారిశ్రామికోత్పత్తుల విషయానికొస్తే.. అమెరికా నుంచి దిగుమతులపై సగటున 5.9 శాతం, మన ఎగుమతులపై కేవలం 2.6 శాతం (వ్యత్యాసం 3.3 శాతం) ఉంటోంది.రంగాల స్థాయిలో: వివిధ రంగాల్లో ఇరు దేశాల ఉత్పత్తులపై టారిఫ్ల మధ్య వ్యత్యాసాలు వివిధ రకాలుగా ఉన్నాయి. రసాయనాలు..ఫార్మాలో 8.6 శాతం, ప్లాస్టిక్స్లో 5.6 శాతం, టెక్స్టైల్స్పై 1.4 శాతం, వజ్రాలు.. బంగారం మొదలైన వాటిపై 13.3 శాతం, ఇనుము..ఉక్కుపై 2.5 శాతం, మెషినరీ .. కంప్యూటర్స్పై 5.3 శాతం, ఎలక్ట్రానిక్స్పై 7.2 శాతం, ఆటోమొబైల్స్ .. ఆటో విడిభాగాలపై 23.1 శాతం వ్యత్యాసం ఉంటోంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే, సదరు రంగంపై ప్రభావం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. భారత్ ఎగుమతులు 30 కేటగిరీలుగా ఉంటున్నాయి. ఇందులో వ్యవసాయంలో ఆరు, పరిశ్రమల్లో 24 ఉన్నాయి.వ్యవసాయం⇒ అత్యధికంగా చేపలు, మాంసం, ప్రాసెస్డ్ సీఫుడ్పై ప్రభావం ఉంటుంది. దాదాపు 2.58 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులపై టారిఫ్ల వ్యత్యాసం 27.83 శాతం ఉంటోంది. ⇒1.03 బిలియన్ డాలర్లుగా ఉంటున్న ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులపై ఏకంగా 24.99 శాతం మేర టారిఫ్లు పెరగొచ్చు. దీంతో అమెరికాలో భారతీయ స్నాక్స్ ఖరీదు మరింత పెరగొచ్చు. ⇒ చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలపై వ్యత్యాసం (1.91 బిలియన్ డాలర్ల విలువ) 5.72 శాతంగా ఉంటోంది. బియ్యం మొదలైన ఎగుమతులపై ప్రభావం పడొచ్చు.⇒ 181.49 మిలియన్ డాలర్ల విలువ చేసే డెయిరీ ఉత్పత్తులపై ఏకంగా 38.23 శాతం టారిఫ్ వ్యత్యాసం ఉంటోంది. దీంతో నెయ్యి, వెన్న, పాల పొడిలాంటివి రేట్లు పెరిగి, మన మార్కెట్ వాటా పడిపోవచ్చు.⇒ 199.75 మిలియన్ డాలర్ల విలువ చేసే వంటనూనెల ఎగుమతులపై 10.67 శాతం మేర టారిఫ్ పెరగవచ్చు.⇒ సుమారు 19.20 మిలియన్ డాలర్ల ఎగుమతులే అయినప్పటికీ ఆల్కహాల్, వైన్లపై అత్యధికంగా 122.10 శాతం సుంకాలు విధించవచ్చు.పారిశ్రామిక ఉత్పత్తులు⇒ 12.72 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్న ఫార్మా ఉత్పత్తులకు సంబంధించి టారిఫ్ వ్యత్యాసం 10.90 శాతం మేర ఉంటోంది. ఇది విధిస్తే, జనరిక్ ఔషధాలు, స్పెషాలిటీ డ్రగ్స్ రేట్లు పెరిగిపోతాయి.⇒ 14.39 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎలక్ట్రికల్, టెలికం, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై 7.24 శాతం టారిఫ్లు పడొచ్చు.⇒ మెషినరీ, బాయిలర్, టర్బైన్, కంప్యూటర్ ఎగుమతుల విలువ 7.10 బిలియన్ డాల ర్లుగా ఉంటోంది. వీటిపై 5.29 శాతం టారిఫ్ల పెంపు అవకాశాలతో భారత్ నుంచి ఇంజనీరింగ్ ఎగుమతులపై ప్రభావం ఉండొచ్చు.⇒ 5.71 బిలియన్ డాలర్ల విలువ చేసే రసాయనాల ఎగుమతులపై (ఫార్మాను మినహాయించి) 6.05 శాతం, 1.71 బిలియన్ డాలర్ల సెరామిక్, గ్లాస్, స్టోన్ ఉత్పత్తులపై 8.27 శాతం, 457.66 మిలియన్ డాలర్ల ఫుట్వేర్పై 15.56 శాతం ఉండొచ్చు. టెక్స్టైల్స్, ఫ్యాబ్రిక్స్, కార్పెట్లు మొదలైన వాటి ఎగుమతులు 2.76 బిలియన్ డాలర్లుగా ఉండగా వీటిపై సుమారు 6.59 శాతం; 1.06 బిలియన్ డాలర్లుగా ఉన్న రబ్బర్ ఉత్పత్తులపై (టైర్లు, బెల్టులు సహా) 7.76 శాతం; పేపర్ .. కలప ఉత్పత్తులపై (969.65 మిలియన్ డాలర్లు) 7.87 శాతం మేర టారిఫ్ల ప్రభావం ఉండొచ్చు.పెద్దగా ప్రభావం / అసలు ప్రభావమే ⇒ ఉండని రంగాలు3.33 బిలియన్ డాలర్ల విలువ చేసే ముడి ఖనిజాలు, పెట్రోలియం ఎగుమతులపై టారిఫ్లు మైనస్ స్థాయిలో (మైనస్ 4.36) ఉంటున్నాయి కాబట్టి, కొత్తగా విధించడానికేమీ ఉండకపోవచ్చు.⇒ అలాగే, 4.93 బిలియన్ డాలర్ల గార్మెంట్స్ ఎగుమతులపై, వ్యత్యాసం మైనస్ 4.62 శాతంగా ఉంది కాబట్టి టారిఫ్ల భారం ఉండకపోవచ్చు. -
అనిశ్చితులున్నా ఎగుమతులు మిన్న
ప్రపంచ వాణిజ్యం, టారిఫ్లపై అనిశ్చితులున్నప్పటికీ రానున్న కాలంలో భారత్ నుంచి ఎగుమతులు వృద్ధి పథంలోనే సాగనున్నట్లు విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ సంతోష్ కుమార్ సారంగి పేర్కొన్నారు. అయితే ఇందుకు ఎగుమతిదారులు వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకుని వ్యూహాత్మకంగా విచక్షణతో వ్యవహరించవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వాతావరణం భారత్కు బంగారంలాంటి అవకాశాలను కల్పిస్తుందని తెలియజేశారు.తయారీలో పోటీతత్వాన్ని పెంచుకోవడంతోపాటు.. ఎగుమతులు పుంజుకునేందుకు వైవిధ్యాన్ని చూపవలసి ఉంటుందని దేశీ ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్ఐఈవో) ఏర్పాటు చేసిన సోర్సెక్స్ ఇండియా 2025 షోలో సంతోష్ వివరించారు. చైనా తదితర దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్లకు తెరతీసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2 నుంచి వీటిని భారత్కు సైతం వర్తింపచేయనున్నారు. భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న అమెరికా టారిఫ్ల విధింపు నేపథ్యంలో కొన్ని ఎగుమతి సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. యూఎస్కు ప్రధానంగా ఇంజినీరింగ్, ఫార్మా ఎగుమతులు దెబ్బతినవచ్చని కొన్ని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: భాగ్యనగరంలో రియల్టీ ఎలా ఉందంటే..ప్రస్తుత ఏడాదిలో భారత్ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను దాటనున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. గతేడాది ఇవి 778 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు తెలియజేశారు. ఇటీవల కొద్ది నెలలుగా ఎగుమతుల్లో మందగమనం నెలకొన్నప్పటికీ దీర్ఘకాలంలో పుంజుకోగలవని అభిప్రాయపడ్డారు. ఆర్డర్లపై పెరుగుతున్న విచారణలు సానుకూల అంచనాలకు దారి చూపుతున్నట్లు తెలియజేశారు. వెరసి భవిష్యత్లో ఎగుమతులు వృద్ధి బాటలో సాగగలవని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. -
పునరుత్పాదక ఇంధనంతో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగంలో మరింతగా వృద్ధి చెందడానికి, ప్రపంచానికే సరఫరాదారుగా ఎదగడానికి భారత్కు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. పరికరాల దశ నుండి ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీల వరకూ పునరుత్పాదక ఇంధన సరఫరా వ్యవస్థను ఆసాంతం సమర్ధంగా నిర్వహించుకోగలిగేలా ఉండాలని పరిశ్రమకు ఆయన సూచించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఐఐ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఇంధన రంగానికి అవసరమైన నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందించేందుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) శిక్షణనివ్వాలని, మరింతగా టెక్నాలజీని వినియోగించాలని గోయల్ సూచించారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
40 కేజీల బంగారం.. అధికారులు అవాక్కు
-
ఓ వ్యక్తి వద్ద 40 కేజీల బంగారం పట్టివేత
నోయిడా: ఓ ఎగుమతి దారుడి నుంచి ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 40 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువు దాదాపు పన్నెండు కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో బడా బాబుల వద్ద ఉన్న నల్లధనాన్ని బంగారంగా మార్చే చర్యల్లో భాగంగానే అతడు ఇంత పెద్ద బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. నోయిడాలోని స్పెషల్ ఎకనామిక్ జోన్(ఎన్ఎస్ఈజెడ్) నుంచి ఇతడు దేశీయ మార్కెట్కు బంగారం పంపిణీ దారుడిగా పనిచేస్తున్నాడు. దుబాయి నుంచి ఎన్ఎస్ఈజెడ్ ఆభరణాలు తయారు చేసి విక్రయించేందుకు గాను బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అనంతరం అదే ఆభరణాలను దుబాయ్కు ఎగుమతి చేస్తుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటికే దేశీయ మార్కెట్లోకి దాదాపు రూ.150 కోట్ల విలువైన బంగారం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంగారాన్నంత కొంతమంతి బడా బాబుల వద్ద ఉన్న అక్రమ సంపాదనను తెల్లడబ్బుగా మార్చేందుకు ఉపయోగించినట్లు సమాచారం. బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లి అనంతరం రిమాండ్కు తరలించారు. మరోపక్క, మీరట్లో ఓ ప్రభుత్వ సంస్థలో ఇంజినీర్ గా పనిచేస్తున్న ఆర్కే జైన్ అనే వ్యక్తి వద్ద నుంచి ఐటీ అధికారులు రూ.2.67కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 17 లక్షలు కొత్త కరెన్సీ ఉంది.