Sritej
-
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకున్నారు. ఇవాళ బాలుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం బాలుడిని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని.. 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వెల్లడించారు. మనుషుల్ని గుర్తు పట్టట్లేదని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ 4 నెలల 25 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 146 రోజుల తర్వాత డిశ్చార్జ్ అవుతున్నారు. శ్రీ తేజకు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించి ఇంటికి తీసుకెళ్లొచ్చవని వైద్యులు సూచించారు.గతేడాది డిసెంబర్లో ఘటనకాగా.. గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ను చూసేందుకు వెళ్లింది. అయితే విపరీతమైన క్రౌడ్ రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్కు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తాడు: వేణుస్వామి
-
కిమ్స్ ఆస్పత్రికి దిల్ రాజు, అల్లు అరవింద్
-
కోలుకున్న శ్రీతేజ్.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?
'పుష్ప 2' బెన్ఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్.. కోలుకుంటున్నాడు. మొన్నటివరకు సీరియస్ కండీషన్లో ఉన్న ఇతడు.. ప్రస్తుతం కాళ్లు, చేతులు కదిలిస్తున్నాడు. ఈ మేరకు వైద్యులు.. లేటెస్ట్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో)సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్పారు. వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోంది, ఫీటింగ్ తీసుకోగలుగుతున్నాడని.. కాళ్లు-చేతులు కదిలిస్తున్నాడని హెల్త్ బులిటెన్లో వైద్యులు పేర్కొన్నారు.ఇదే సంఘటనలో శ్రీతేజ్ తల్లి ప్రాణాలు కోల్పోయింది. దీంతో పోలీసులు కేసు పెట్టి.. తొలుత సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్ని అరెస్ట్ చేశారు. తర్వాత హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. వీళ్లకు బెయిల్ వచ్చింది. దీంతో కేసు విచారణ ప్రస్తుతం నడుస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్) -
సినీ నటుడు శ్రీ తేజ్ పై చీటింగ్ కేసు
-
'పుష్ప' నటుడు శ్రీ తేజ్పై పోలీసు కేసు
తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీతేజ్పై హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో BNS 69, 115(2),318(2) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు. గతంలోనూ ఇదే పీఎస్లో శ్రీతేజ్పై కేసు నమోదైంది.(ఇదీ చదవండి: యూరప్ వెళ్లనున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..?)'నారప్ప', 'మంగళవారం', 'పుష్ప' తదితర సినిమాల్లో సహాయ నటుడిగా చేసిన శ్రీతేజపై గతంలోనే కేసు నమోదైంది. ఓ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భార్యతో ఇతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి సదరు వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషయమై మాదాపూర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఇలా వరస కేసుల వల్ల శ్రీతేజ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్ హ్యాండ్' లాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత) -
పుష్ప 2 కోసం 8 సినిమాలు వదిలేశా: నటుడు
పుష్ప, ధమాకా, మంగళవారం.. ఇలా విభిన్న సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీతేజ్. ఈయన ప్రధాన పాత్రలో నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతోంది. ఈయన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 లోనూ నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం చేతిదాకా వచ్చిన ఏడెనిమిది ప్రాజెక్టులను పోగొట్టుకున్నాడట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.గడ్డం కోసం సినిమాలు వదిలేశాశ్రీతేజ్ మాట్లాడుతూ.. 'పుష్ప 2 సినిమా కోసం కొన్ని సినిమాలు వదిలేసుకున్నాను. పది నెలల్లో ఎనిమిది ప్రాజెక్టుల దాకా వదిలేశాను. పుష్ప లాంటి పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఏ క్షణాన పిలిచినా చేసేందుకు రెడీగా ఉండాలి. షెడ్యూల్స్ కూడా మారుతూ ఉన్నాయి. గడ్డం తీసేస్తే మళ్లీ ఈ స్థాయిలో పెరగాలంటే కనీసం మూడు నెలలైనా పడుతుంది. కాబట్టి నా లుక్ కోసం కొన్ని ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది' అని పేర్కొన్నాడు.చదవండి: నటికి సర్జరీ? ట్రాన్స్జెండర్లా ఉందంటూ ట్రోల్స్