rudra raju padma raju
-
చెప్పింది చేయరు.. చేసింది చెప్పరు: పద్మరాజు
హైదరాబాద్: చంద్రబాబుది ‘చెప్పింది చేయరు, చేసింది చెప్పర’నే మనస్తత్వమని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు దుయ్యబట్టారు. బడుగు, బలహీనవర్గాలపై చంద్రబాబుకు ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి ఎన్నికల్లో ఆయా వర్గాలకు కేటాయించిన సీట్ల సంఖ్యే నిదర్శనమన్నారు. సోమవారం ఇందిరాభవన్లో పద్మరాజు విలేకరులతో మాట్లాడారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు బీసీలకు 40 సీట్లే కేటాయించారని, తెలంగాణలో 72 సీట్లకు పోటీచేయగా.. అందులో 18 స్థానాల్నే బీసీలకు కేటాయించారని పద్మరాజు ధ్వజమెత్తారు. అగ్రవర్ణాలకే పెద్దపీట వేసిన చంద్రబాబు మైనార్టీలకు ఒక్క సీటు మాత్రమే కేటాయించారని విమర్శించారు. -
కేసీఆర్ మూర్ఖుడు: ప్రభుత్వ విప్ పద్మరాజు
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూర్ఖుడని ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు విమర్శించారు. తెలంగాణ ప్రజలే ఆయనపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలంతా దొంగలేనంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘కేసీఆర్ నువ్వో మూర్ఖుడివి. పిచ్చివాడిలా మాట్లాడుతున్నావు. సీమాంధ్రోళ్లంతా దొంగలని తెలుగు ప్రజలను కించపరుస్తావా? ఎదుటి వారి మనసులను గాయపరచడమే రాజకీయమా? మతిస్థిమితం ఉండే మాట్లాడుతున్నావా? తెలంగాణ ప్రజలు నీపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’అని హెచ్చరించారు.