Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Kommineni Srinivasa Rao Strong Counter to ABN Radha Krishna
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!

తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికగా గుర్తింపు పొందిన, ఆ పార్టీ అనధికార ప్రతినిధిగా పేరొందిన ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై గజిబిజి ఉందట. ఆంధ్ర ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో అర్ధం కావడం లేదట. అంటే తెలుగు దేశం గెలవడం లేదన్న సంకేతం అందుతున్నట్లే కదా!అందుకు భిన్నంగా ఉంటే ఈయన ఎగిరి గంతేసి రచ్చ,రచ్చ చేసేవారు కదా! అంతేకాదు. ఆయన జర్నలిస్టులకు సుద్దులు, పత్తిత్తు కబుర్లు కూడా చెప్పారు. కొత్త పలుకు పేరుతో వ్యాసాలు రాసే ఆయన పచ్చి అబద్దాలను ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చారు. తెలుగుదేశం గెలుపు తన గెలుపు అని భావించి , ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి మాదిరిగా వ్యవహరించే ఈయన తాజాగా చెప్పిన నీతులు వింటే ఆశ్చర్యం చెందాల్సిందే. అదే టైమ్ లో ఆయన యధాప్రకారం వైఎస్సార్‌సీపీపైన, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన విషం కక్కారు. అయినా జర్నలిజం గురించి మాట్లాడగలరు. తను తప్ప మిగిలినవారంతా ఎర్నలిస్టులు అని రాయగలరు. అసలు తానేమిటో, తన మూలాలేమిటో మర్చిపోయి, ఒక ఆగర్భ శ్రీమంతుడు మాదిరి, సత్య సంధుడు మాదిరి. హరిశ్చంద్రుని తమ్ముడి మాదిరి ,అత్యంత నీతిమంతుడు మాదిరి ఆయన రాసే పలుకులు చూస్తే ఔరా అనుకోవల్సిందే. ఏపీ ప్రజలలో ఈ శాసనసభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కొందరు వైఎస్సార్‌సీపీకి, మరి కొందరు టీడీపీకి అనుకూలంగా ఆలోచించవచ్చు. కాని చంద్రబాబుకు నమ్మిన బంటు తరహాలో ఉండే ఆంధ్రజ్యోతి యజమానికి టీడీపీ గెలుపుపై ఎందుకు సందేహం వచ్చిందో తెలియదు. అందుకే గెలుపు అంచనాలలో గజిబిజి అని హెడింగ్ పెట్టుకున్నట్లు ఉన్నారు. ఎన్నికల వరకు ఉన్నవి,లేనివి పచ్చి అబద్దాలు రాసి ప్రజలను మోసం చేసే యత్నం చేసిన రాధాకృష్ణ ఇప్పుడు జర్నలిజం ఎలా ఉండాలో నీతులు వల్లెవేస్తున్నారు. దీనిని బట్టే అర్దం అవుతోంది. ఆయనకు టీడీపీ అధికారంలోకి రావడం లేదన్న సమాచారం వచ్చి ఉండాలి. పైకి ఏవో కబుర్లు చెప్పినా, అంతర్లీనంగా చదివితే రాధాకృష్ణ ఎంత భయపడుతున్నది తెలుస్తుంది. వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని అనేవారికి శాపనార్ధాలు పెడుతున్న తీరే ఆయన బలహీనతను తెలియపరుస్తుంది. ప్రతి పత్రికకు సొంత నెట్ వర్క్ ఉంటుంది. ఆంధ్రజ్యోతి కి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో నెట్ వర్క్ ఉంది కదా!. ఆ నెట్ వర్క్ లో పనిచేసే ప్రతినిధులుఉంటారు కదా!వారితో పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే రోజున, అవసరమైతే పోలింగ్ తర్వాత కూడా అభిప్రాయ సేకరణ అనండి, ఎగ్జిట్ పోల్ అనండి..పేరేదైనా పెట్టండి ..ప్రజల నాడి ఎలా ఉందో పసికట్టడానికి ప్రయత్నించి ఉంటారు కదా!. ఒక వేళ అది టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉంటే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలలో కదనాలు ఇచ్చే వారే కదా?. అలా చేయలేకపోగా, గజిబిజి గా పరిస్తితి ఉందని రాసుకున్నారంటే తెలుగుదేశంలో ఉన్న గందరగోళం ఏమిటో తెలుసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి రాసిందంటే టీడీపీ రాసినట్లే కదా!. రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు చూద్దాం. అనుభవం ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాలలో లెక్క తప్పాయని ఆయన అన్నారు. అందులో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. కాని ఎక్కువసార్లు వాస్తవమే అయ్యాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎక్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు పట్టం కట్టారట. ఇది కూడా అసత్యమే. తెలంగాణలో అత్యదిక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. కనీస అవగాహన లేనివారు, జనం నాడి తెలియని వారు అంచనాలు రూపొందించడం ఆశ్చర్యం కలిగించింట. చంద్రబాబుకు, జగన్ కు లేని టెన్షన్ ను ఈ తరహా ఎర్నలిస్టులు ప్రదర్శిస్తుండడం విశేషం అని రాశారు. తాను ఎలా సంపాదించి పైకి వచ్చింది. తను రిపోర్టర్ గా పనిచేసిన పత్రికకే తాను ఎలా యజమాని అయింది ఆయనకు తెలియదా! మళ్లీ ప్రత్యేకంగా ఎర్నలిస్టులు అంటూ ఎవరినో అనడం దేనికి?ప్రభుత్వ పని తీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయజాలదని అన్నారు. సోషల్ మీడియా వరకు దేనికి!. మీరు మెయిన్ మీడియా అనుకుంటారుగా?మీరు రాసిన పచ్చి అబద్దాలను జనం నమ్మారనుకుంటున్నారా? నమ్మ లేదని అనుకుంటున్నారా?ఉదాహరణకు లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, ఈ స్టాంప్ రిజిస్ట్రేషన్ గురించి ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడు రాసిన దారుణమైన అబద్దాలను ప్రజలు నమ్మలేదన్న సంగతి మీకు తెలిసిందా? అనే భావన వస్తుంది. పనిలో పని యూట్యూబ్ చానల్స్ గురించి కూడా తెగ వాపోయారు. ముందు మీరు మీ యూట్యూబ్ చానల్ లో నిజాలు చెప్పడం అలవాటు చేసుకుని అప్పుడు ఎదుటివారి గురించి మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ ఐటిడిపి పేరుతో ఎంత నీచమైన ఆరోపణలతో వైఎస్సార్‌సీపీపైన, జగన్ పైన ప్రచారం చేస్తే సమర్దించిన రాధాకృష్ణ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. యూట్యూబ్‌ ఛానెల్స్‌ను రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్నాయట. ఈనాడు, ఆంద్రజ్యోతివంటి ఎల్లో మీడియాను తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిన విషయాన్ని తొలుత రాసి ఆ తర్వాత మిగిలినవారి గురించి మాట్లాడండి. సోషల్ మీడియాలో వ్యూస్ ను బట్టి కూడా ఎవరికి మద్దతు ఉందో చెప్పవచ్చని మళ్లీ ఇదే కొత్త పలుకు లో ఈయన చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ కు అనుకూలంగా ఉండే వార్తలు, కధనాలకు రెండే క్రితం వరకు అధికంగా వ్యూస్ ఉండేవని, రాను,రాను అవి తగ్గిపోయాయని మరో అబద్దం చెప్పారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఇంటర్వ్యూని టీవీ9లోను, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటర్వ్యూని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలోనూ ఒకసారి ప్రసారం చేశారు. చంద్రబాబును ఇదే రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. జగన్ కు 11లక్షల వ్యూస్ వస్తే, చంద్రబాబుకు నాలుగైదు లక్షల వ్యూసే నే ఎందుకు వ్యూస్ వచ్చాయి?లైవ్ జరుగుతున్నప్పుడు కూడా ఎబిఎన్ కంటే టీవీ9 ఎన్నోరెట్ల మంది యుట్యూబ్లో చూసినట్లు లెక్కలు చెబుతున్నాయి కదా!ఈయన ధీరి ప్రకారం చూసుకున్నా జగన్ గెలుస్తున్నట్లే కదా!. తెలంగాణను మించిన నిర్భంధం ఏపీలో ఉందట. నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత అరాచకంగా, జర్నలిజానికి తలవంపులు తెచ్చేరీతిలో వార్తలు,కధనాలు ఇచ్చి ఉండేవారా?. ఎందుకు వీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు!. ఉద్యోగ సంఘాల నేతలు జగన్ కుఅనుకూలమైనా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. పాపం ఉద్యోగులపై అంత ప్రేమ ఉంటే,వారిని పనిపాట లేనివారని, వారికి ఊరికే వందల కోట్ల జీతాలు కూర్చోబెట్టి ఇస్తున్నారన్నట్లుగా మాట్లాడింది రాధాకృష్ణే కదా!. 2019 లో ఎన్నికలలో తాను మళ్లీ అధికారంలోకి వస్తానని ప్రకటించి బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పర్యాయం మాత్రం ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పలేదని ఈయన అంటున్నారు. నిజానికి అప్పుడు చంద్రబాబే కాదు. ఆంధ్రజ్యోతి,ఈనాడు తదతితర ఎల్లో మీడియా అంతా ఇదే మాట ఊదరగొట్టాయి. చంద్రబాబు ఇచ్చిన పసుపు-కుంకుమ తో మహిళలంతా టీడీపీ కి ఓటు వేశారని ఈయన పత్రికలోరాశారో లేదో ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకోమనండి కానీ, 2019లో జగన్ చెప్పినట్లు వైసిపి భారీ మెజార్టీతో గెలుపొందిందన్న ఒక్క సత్యాన్ని ఒప్పుకున్న ఈయన అక్కడ కూడా వక్రీకరించారు. జగన్ అండ్ కో అప్పుడు అసత్య ప్రచారం మీద నమ్మకం పెట్టుకుందని ఈ సత్యసంధుడు రాస్తున్నాడు. చంద్రబాబు అండ్ కో లో భాగస్వామి అయిన రాధాకృష్ణ అబద్దాల సృష్టికర్తలలో ఒకడన్న సంగతి ప్రజలందరికి తెలుసు. 2024 ఎన్నికల ప్రచారంలో జగన్ అసత్యాలు చెప్పారో, చంద్రబాబు అబద్దాలు చె్ప్పారో, ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఒక సర్వే చేయించుకుంటే తెలుస్తుంది. రాధాకృష్ణ ఎంతసేపు ఆత్మ వంచన చేసుకుంటూ ప్రజలను కూడా అలాగే మోసం చేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలలో జగన్ ఆశ్రిత పక్షపాతం, భావోద్వేగాలు ప్రేరేపించడం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి నశింప చేయడం.. వంటివాటివల్ల గెలిచారట.ఎంత అక్కసో చూడండి. జగన్ గెలిస్తే ఆలోచన సరిగా లేనట్లట. చంద్రబాబు గెలిస్తే మేధావితనం అట. ఈయనకు వందల కోట్ల ప్రయోజనం చేకూర్చుతారు కాబట్టి చంద్రబాబు పాలన గొప్పదిగా కనిపించవచ్చు. కాని జగన్ ప్రజలకు లక్షల కోట్ల మేర మేలు చేశారు.కాబట్టి ఆయన తనవల్ల మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పారు. ఆ మాట చంద్రబాబుతో ఎందుకు చెప్పించలేకపోయారు.మళ్లీ జన్మబూమి కమిటీల పాలన తెస్తానని, వలంటీర్లను రద్దు చేస్తానని, గ్రామ,వార్డు సచివాలయాలను ఎత్తివేస్తానని ఎందుకు చెప్పలేకపోయారు.అమ్మ ఒడి ఇస్తుంటే బటన్ నొక్కడం తప్ప జగన్ ఏమి చేస్తున్నారని ఆ రోజుల్లో రాధాకృష్ణ తెగ బాధపడ్డారు. అదే చంద్రబాబు ఇంటిలో ఒకరికికాదు..ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చెబితే ఆయన శరాలు ఎక్కుపెట్టారని రాసిన రాధాకృష్ణ వైఎస్సార్‌సీపీపైన రోధిస్తున్నారు. జగన్ స్కీములతో రాష్ట్రం నాశనం అయితే, వాటన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు ,పవన్ లతో ఎందుకు చెప్పించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి రవి వంటి వారి పేర్లు రాయకుండా సిపిఎం సంబంధాలు కలిగిన వారు జగన్ కు అనుకూలంగా విశ్లేషణలు వదలుతున్నారట.జగన్ కు అనుకూలంగా విశ్లేషణలు ఇస్తున్నవారు వ్యతిరేక ఫలితాలు వస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని అమాయకంగా ప్రశ్నించారు.2019 లో రాధాకృష్ణ ఎక్కడ మొహం పెట్టుకున్నారు?2024లో జగన్ కు అనుకూల ఫలితం వస్తే ఈయన ఎక్కడ మొహం పెట్టుకుంటారు!ప్రశాంత కిషోర్ లో రాధాకృష్ణకు ఇప్పుడు విశ్వసనీయత కనిపిస్తోంది. అంత గొప్ప ప్రశాంత కిషోర్ తెలంగాణలో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ఎలా చెప్పారో, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎలా చెప్పారో కూడా ఈయన వివరించాలి. చంద్రబాబు ఎన్నికల ముందు మహిళలకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చినా ఓడిపోయారని, జగన్ పధకాల పేరుతోడబ్బు పంచితే ఓట్లు వేస్తారా అని రెంటిని సమం చేసే దిక్కుమాలిన ఆలోచన చేశారు. చంద్రబాబు ఎన్నికల కోసం పదివేల రూపాయలు ఇచ్చారు. జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లపాటు స్కీముల ద్వారా లబ్ది చేకూర్చారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా రాధాకృష్ణ వ్యాసాలు రాసిపడేసి, చేతిలోపత్రిక ఉందని అచ్చేసి, టీవీ ఛానెల్‌ ఉంది కదా అని ఊదరగొట్టేస్తే జనం నమ్ముతారా?ఎన్నికలకు ముందు ఆ సర్వే అని,ఈ సర్వే అని తెలుగుదేశంకు డప్పు వాయించిన రాధాకృష్ణ తినబోతూ రుచులు అడగకూడదని అంటున్నారు. ఆయన రాసిన చివరిమాటలోని అంగుళీమాలుడు అనే దొంగ పాత్ర అమరావతి పేరుతో మూడు పంటలు పండే వేలాది ఎకరాలను ధ్వంసం చేసిన చంద్రబాబు అవుతారు లేదా ఆయన సేవలో తరించే రాధాకృష్ణ అవుతారు తప్ప ఇంకొకరు కారు.జగన్ ను దూషించడం తప్ప, ఈయన చెత్తపలుకులో చేసిన విశ్లేషణ ఏముంది? ఏపీ ఫలితాలపై ఈయనకు గజిబిజి ఉందేమో కాని, ప్రజలకు మాత్రం కాదని చెప్పవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Delhi Liquor Case Updates: Delhi HC Hearing Kavitha Bail Plea Today
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్‌ కేసులో కవిత లాయర్‌ వాదనలు

Delhi Liquor Case May 27 Updates👉 కవిత బెయిల్‌ విచారణ రేపటికి వాయిదాలిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదారేపు మధ్యాహ్నాం 12గం. వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్ట్ ఇవాళ బెయిల్‌ పిటిషన్లపై వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ కవిత తరఫున ముగిసిన వాదనలు40 నిమిషాల పాటు వాదనలు వినిపించిన కవిత తరపు న్యాయవాదిరేపు వాదనలు వినిపించనున్న ఈడీ, సీబీఐరేపు వాదనలు పూర్తయ్యాక.. తీర్పు రిజర్వ్ చేస్తానని చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ 👉కేసు గురించి అన్ని విషయాలు తెలుసు: జస్టిస్‌ స్వర్ణ కాంతమహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదుకేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదుఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట కవిత పేరు చెప్పారుబెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి?: జస్టిస్‌ స్వర్ణకాంతకేసు గురించి అన్ని విషయాలు తెలుసు: జస్టిస్‌ స్వర్ణకాంతకవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు.. దాని వల్ల ఈడీకి వచ్చి లాభం ఏమిటి ?: కవిత తరఫు లాయర్‌ కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు పూర్తి👉పూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?కవితను అరెస్ట్‌ చేయమని ఈడీ సుప్రీం కోర్టుకు చెప్పిందిసుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందిరాజకీయ కారణాలతో పక్షపాత ధోరణితో ఈడీ అధికారులు వ్యవహరించారుమా వాదన వినకుండానే సీబీఐ ఇంటరాగేషన్‌కు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చిందిసమాచారం ఇవ్వకుండానే సీబీఐ నన్ను అరెస్టు చేసింది: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితఈ అంశాలపై ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ చేయలేదుపూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?సీబీఐ విచారణ, అరెస్టు లో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదుఈడీ కేసులో ఇప్పటివరకు ఏడు చార్జిషీట్ లు దాఖలు చేసిందిసీబీఐ సమన్లు అన్నింటికీ నేను సహకరించా: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితమహిళను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు మైనర్: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితనేను ఒక రాజకీయ నాయకురాల్ని: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితబెయిల్ కు ఎలాంటి షరతులు పెట్టినా ఓకే: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితకవిత తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి👉కేసు ఫైల్‌ చేసినప్పుడు పేరేది?మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదుకేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదుఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారుబెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని అడిగిన జడ్జికేసు గురించి అన్ని విషయాలు తెలుసన్న జడ్జికవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, దాని వల్ల ఈడి కి వచ్చి లాభం ఏమిటి ? అని కవిత తరపు న్యాయవాది వాదనలునేను గత మార్చి లో వరుసగా మూడు రోజులు విచారణకు వచ్చాసూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారునా మొబైల్ ఫోన్ ను కూడా ఇచ్చానుమహిళ ఫోన్‌లోకి తొంగి చూశారురైట్ టు ప్రైవసికి భంగం కలిగించారుకొత్త మోడల్ ఫోన్ లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చానుఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు.. నాకేం సంబంధం లేదుకస్టడీ లో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడి విచారణ జరపలేదుఎన్నో చార్జిషీట్లు దాఖలు చేసినా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదుమాగుంట శ్రీనివాసులురెడ్డి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారుఆ తర్వాత రూ.50 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారుఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేశారుఅరెస్టు చేయమని సుప్రీం కోర్టు కి చెప్పి ఆ తర్వాత మాట తప్పి, కవితని అరెస్టు చేశారుకవిత తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరిఢిల్లీ హైకోర్టులో విచారణ ప్రారంభంలిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్ట్ లో విచారణ ప్రారంభంకవిత బెయిల్ పిటిషన్ విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మవిచారణకు హాజరైన కవిత భర్త అనిల్👉లిక్కర్‌ స్కామ్‌ కేసు.. కవిత బెయిల్‌ పిటిషన్‌పై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఢిల్లీ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. తద్వారా తాము వాదనలకు సిద్ధమని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అప్పటికే ఈడీ అరెస్ట్‌ చేసిన కవితను.. సీబీఐ కూడా అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. లిక్కర్‌ కేసులో కవితని కింగ్ పిన్ అని పేర్కొంది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్‌ కోర్టు(రౌస్‌ అవెన్యూ కోర్టు) నిరాకరించింది. దీంతో.. ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. మే 24 శుక్రవారం నాటి విచారణ సందర్భంగా.. కవిత తరఫు న్యాయవాది విక్రమ్‌ చౌదరి తన వాదనలు వినిపించగా.. ఇవాళ సైతం వాదనలు కొనసాగించేందుకు ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం ఈడీ, సీబీఐలకు వాదించేందుకు అవకాశం ఇచ్చింది.మరోవైపు ఈడీ కౌంటర్‌ దాఖలు చేసి వాదనలకు సిద్ధమని ప్రకటించింది. అయితే సీబీఐ మాత్రం కౌంటర్‌కు, ఛార్జీషీట్‌ దాఖలుకు గడువు కోరింది. చెప్పినట్లుగానే సీబీఐ ఇవాళ కౌంటర్‌ వేసింది.లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్ట్‌ అయిన కవిత.. మార్చి 26 నుంచి జ్యుడీషియల్‌ రిమాండ్‌ మీద తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీంలో కేజ్రీవాల్‌ పిటిషన్‌ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్‌ కేసులో తన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. PET-CT స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించారని, ఈ నేపథ్యంలో బెయిల్‌ను మరో వారం పొడిగించాలని కేజ్రీవాల్‌ అభ్యర్థించారు. అయితే ఇప్పటికే ఆయనకు మాక్స్‌ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో కోర్టు బెయిల్‌ పొడిగిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్‌ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.హైకోర్టుకే వెళ్లండి.. పిళ్లై బెయిల్‌పై సుప్రీంసుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. అనారోగ్య సమస్యల దృష్ట్యా తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాదనలు వింది. మధ్యంతర బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని పిళ్లైకి సూచించింది. అదే సమయంలో.. గతంలో ఇచ్చిన ఆదేశాల తో సంబంధం లేకుండా మధ్యంతర బెయిల్ పిటిషన్ పరిశీలన చేయాలని ఢిల్లీ హైకోర్టుకు సైతం సుప్రీం సూచించింది.గతంలో తాను కవిత బినామీనేనంటూ అరుణ్‌ పిళ్లై వాంగ్మూలం ఇచ్చి.. ఆ తర్వాత ఆ మాట మార్చాడు పిళ్లై. అయితే ఇండో స్పిరిట్ లో కవిత తరఫున పిళ్లై భాగస్వామిగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది.

Gujarat HC slams state govt Were you asleep over Rajkot game zone fire
ప్రభుత్వం నిద్ర పోతుందా? రాజ్‌కోట్‌ ఘటనపై హైకోర్టు సీరియస్‌

గాంధీనగర్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందారు. మరో 15 మందిపైగా జనం జాడ తెలీడంలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనను సూమోటోగా స్వీకరించిన గుజరాత్‌ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.‘‘అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ నిద్ర పోతున్నారు? మాకు గుజరాత్ ప్రభుత్వంపై మీద ఏ కోశానా కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది. ‘‘ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న రెండు గేమింగ్‌ జోన్లను గత రెండు దశాబ్దాలుగా రాజ్‌కోట్‌లో నిర్వహింస్తున్నారు. వాటి నిర్వహణకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. ఫైర్‌ సేఫ్టీ అనుమతి పత్రాలు కూడా లేవు. అందుకే గుజరాత్‌ ప్రభుత్వం పట్ల కొంచం కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రెండున్నరేళ్ల నుంచి రాజ్‌కోట్‌ గేమింగ్‌ జోన్ నడుస్తోంది. ప్రభుత్వం కళ్లు ముసుకుందని మేము అనుకోవాలా? అసలు అధికారులు ఏం చేస్తున్నారు?’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. గేమింగ్‌ జోన్‌కు సంబంధించిన ఫొటోలను చూపించిన రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై కూడా హైకోర్టు మండిపడింది. ‘‘ఈ అధికారులంతా ఎవరూ? అక్కడికి వారంతా ఆడుకోవడానికి వెళ్లారా?’’ అని కోర్టు విమర్శించింది. ‘‘అంతపెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీకు కంటి చూపు పోయిందా? లేదా నిద్రపోతున్నారా? ఇంత జరిగాక మాకు స్థానిక వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయింది’’ అని హైకో​ర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం​ వ్యక్తం చేసింది.రాజ్‌కోట్‌లోని మనా-మవా ప్రాంతంలో ఉన్న టీఆర్‌పీ గేమింగ్‌ జోన్‌లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ ఘటనలో 33 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గేమింగ్‌ జోన్‌లో వెల్డింగ్‌ పనులు జరగుతున్నాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

Bangalore CCB police Investigation On Rave Party Case
రేవ్‌ పార్టీ కేసు: బెంగళూరు పోలీసులకు హేమ లేఖ.. విచారణకు డుమ్మా

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నేడు నిందితులను బెంగళూరు క్రైమ్‌ బ్యాంచ్‌ పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్‌ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు ఇ‍చ్చారు. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని హేమ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖలో హేమ.. ఈ కేసులో తాను హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. తాను వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే, హేమ లేఖను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్‌ పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్టు బ్లడ్‌ శాంపిల్స్‌లో తేలింది. దీంతో, వారంతా ఈరోజు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో టాలీవుడ్‌ నటి హేమ కూడా ఉన్నారు. అయితే రేవ్‌ పార్టీకి తాను హాజరుకాలేదని వీడియోలు రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. అలాగే, వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్‌ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంక్‌ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసులో వాసు ప్రధాన అనుచరుడు చిత్తూరుకు చెందిన అరుణ్‌ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

AP Elections 2024: May 27th Political Updates In Telugu
May 27th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 26th AP Elections 2024 News Political Updates..2:00 PM, May 27th, 2024పోస్టల్‌ బ్యాలెట్లు కృష్ణా యూనివర్సిటీ తరలింపు..కృష్ణా జిల్లా..మచిలీపట్నం పార్లమెంట్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను కలెక్టరేట్ నుండి కృష్ణా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌కి తరలింపురాజకీయ పార్టీల సభ్యుల సమక్షంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌కి పోస్టల్ బ్యాలెట్లు తరలించిన అధికారులు 1:30 PM, May 27th, 2024ఈసీకి పేర్ని నాని ప్రశ్నలు..ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించిన పేర్ని నాని.పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు?పోలింగ్‌ ఆగినట్టు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ లాగ్‌ బుక్‌లో ఎందుకు లేదు?డీజీపీకి సిట్‌ ఇచ్చిన నివేదికలో కూడా పిన్నెల్లి ప్రస్తావన లేదు? ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.-మాజీ మంత్రి పేర్ని నాని#TDPLosing… pic.twitter.com/VS0ESyDEMz— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 11:20 AM, May 27th, 2024పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై నేడు విచారణ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై హైకోర్టులో నేడు కొనసాగనున్న విచారణపిన్నెల్లిపై అక్రమంగా మూడు కేసులు నమోదుపచ్చ బ్యాచ్‌ సూచనల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. 11:00 AM, May 27th, 2024దాడులపై చోద్యం చూస్తున్న ఈసీ..టీడీపీ దాడులపై ఇంకా చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘం. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పచ్చ మూకల అరాచకాలు. ఈసీ, పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ శ్రేణుల దారుణాలు. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసిన టీడీపీ అనుకూల పోలీసులు. పోలింగ్‌, ఆ తర్వాత మాచర్లలో పచ్చ మూకల అరాచకాలు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హత్యకు కుట్ర పన్నిన పచ్చ మూకలు. దాడులకు పరోక్షంగా వత్తాసు పలికిన పోలీసులు. 10:30 AM, May 27th, 2024ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై నేడు విచారణఇందుకూరి రఘురాజు అనర్హతపై నేడు విచారణపార్టీ ఫిరాయించిన రాఘురాజు వ్యక్తిగత విచారణను రావాలని ఆదేశం.విచారణ అనంతరం అనర్హతపై నిర్ణయం తీసుకోనున్న మండలి చైర్మన్‌నేడు 11 గంటలకు విచారించనున్న మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు.వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన రఘురాజు. 9:30 AM, May 27th, 2024ఎన్నికల దృష్ట్యా పోలీసుల కార్డన్‌ సెర్చ్‌..ఎన్టీఆర్ జిల్లా:గంపలగూడెం మండలం సొబ్బాల గ్రామంలో తిరువూరు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ సెర్చ్..ఎన్నికల ఫలితాల భద్రతా దృష్యా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు..రికార్డులు లేని 11 వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలింపు.. 8:50 AM, May 27th, 2024బరితెగించిన పచ్చ గూండాలు..ఎన్నికల్లో ఓటమి భయంతో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌కారంపూడిలో బరితెగించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలుపోలింగ్‌ జరిగిన మరుసటి రోజే వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తలను టార్గెట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టారు. ఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన @JaiTDP నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైయస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలు.#TDPLosing#TDPGoons pic.twitter.com/BzBkJBOkT1— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 7:45 AM, May 27th, 2024పిన్నెళ్లిపై పోలీసుల అక్రమ కేసులు..తాడేపల్లి..మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై వరుస కేసులుఎమ్మెల్యే అరెస్టే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్న పోలీసులుటీడీపీకి అనుబంధ సంఘాలుగా మారిన ఈసీ, పోలీసు శాఖఈవీఎం కేసులో బెయిల్ రాగానే వెంటనే మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టిన పోలీసులుసీఐ నారాయణస్వామి చౌదరి ఆధ్వర్యంలోనే కుట్ర జరుగుతోందన్న వైఎస్సార్‌సీపీఏదోలా ఎమ్మెల్యే పిన్నెళ్లిని అరెస్టు చేసి హతమార్చేందుకే కుట్రలంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు 7:00 AM, May 27th, 2024ఓటు తెచ్చిన చేటు..కౌలురైతులపై ‘మంగళగిరి’లో ఓ సామాజికవర్గం దుర్మార్గంసాగు కోసం పొలాల వద్దకు రావొద్దని హెచ్చరికలుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీకి చెందిన ఆ వర్గీయుల అల్టిమేటందశాబ్దాలుగా కౌలుకు చేస్తున్న పేదలపై బరితెగింపువ్యవసాయ సీజన్‌ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డ కౌలుదారులునారా లోకేశ్‌కు ఓట్లు వేయకపోవడమే వారు చేసిన నేరంఆ సామాజికవర్గానికి చెందిన సంస్థల్లో పనిచేసే వారికీ ఇదే అనుభవంనీ పేరు లోకేశ్‌ రెడ్‌బుక్‌లోకి ఎక్కిందంటూ బెదిరింపులు‘ఫ్యాను’కు ఓటేసినందుకే అంటూ లబోదిబోమంటున్న బాధితులుఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకపోతున్నారని.. మాకిష్టమైన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ఆవేదనఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు వస్తున్నాయని కూడా ఏడుపు 6:50 AM, May 27th, 2024సీల్‌ లేదని పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరించొద్దుడిక్లరేషన్‌పై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా ఉంటే ఆమోదించండి అనుమానం వస్తే పోస్టల్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోని కౌంటర్‌ ఫాయిల్‌తో సరిచూడండిడిక్లరేషన్‌పై ఓటరు, అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకాలు లేకపోయినా తిరస్కరించండి డిక్లరేషన్‌ ఫారం విడిగా కవర్‌–బీలో లేకపోతే ఓపెన్‌ చేయకుండానే తిరస్కరించొచ్చు బ్యాలెట్‌ పేపర్‌ నెంబరు డిక్లరేషన్‌పైన ఒకలాగా, ఫారం–13బీ పైన మరొకటి వుంటే తిరస్కరించాలి.. బ్యాలెట్‌ పేపర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ఒకరి కంటే ఎక్కువమందికి సంతకాలు చేసినా తిరస్కరించొచ్చు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు 6:40 AM, May 27th, 2024‘పిన్నెల్లి’కి మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండిఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వగానే హత్యాయత్నం కేసులు పెట్టారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే ఈ తప్పుడు కేసులు ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. పరిధి దాటి పనిచేస్తోంది ఆయన్ను అరెస్టు చేసి తీరాలన్న లక్ష్యంతోనే ఇలా చేస్తోంది ఘటనలు జరిగిన పది రోజుల తర్వాత నిందితుడిగా చేర్చారు అంత జాప్యం ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పడం లేదు ఈవీఎంల కేసులో కల్పించిన రక్షణే ఈ కేసుల్లో కూడా కల్పించండి హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి మరోవైపు.. టీడీపీ నేత అస్మిత్‌పై హత్యాయత్నం కేసున్నా బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు 6:30 AM, May 27th, 2024తాపీగా తప్పుడు కేసులుపిన్నెల్లికి బెయిల్‌ రావడంతో మరో మూడు అక్రమ కేసులు.. కారంపూడిలో సీఐ తలకు గాయమైతే వారానికిపైగా ఏం చేస్తున్నట్లు? నరసరావుపేటలో ఇంట్లో బాంబులు దాచిన టీడీపీ నేత అరవిందబాబును వదిలేసి గోపిరెడ్డిపై కేసులా?టీడీపీ గూండాలకు చట్టం చుట్టమా?

Telangana Cine Musicians Association Objects Keeravani Over Telangana State Song
'జయ జయహే తెలంగాణ'.. కీరవాణి వద్దు!

తెలంగాణ రాష్ట‍్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'ని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ పాటని స్వరపరిచే బాధ్యతల్ని టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి తాజాగా అప్పగించారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిని కీరవాణి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ పాట విషయంలో లేనిపోని కాంట్రవర్సీలు చోటుచేసుకుంటున్నాయి.తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తాజాగా ఓ లేఖ విడుదల చేసింది.''జయ జయహే తెలంగాణ' పాటకు కీరవాణిని సంగీతం అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుంది. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, మన ఉద్యోగాలు, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి? అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం' అని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)ఇకపోతే 'జయ జయహే తెలంగాణ' పాటని అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యక్రమాలలో ఆలపించే విధంగా రూపొందించాలని ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంది. అంతలో ఈ పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే తెలుగులో ఎన్నో దశాబ్దాల నుంచి సంగీత దర్శకుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్న కీరవాణి.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' గీతంతో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్ కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బాధ్యతల్ని కీరవాణికి అప్పగించి ఉంటారు. కానీ ఇప్పుడు వస్తున్న విమర్శల దృష్ట్యా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఆమె నా కూతురు కాదంటూ బాంబు పేల్చిన స్టార్‌ హీరోయిన్‌)

'Not Gambhir': KKR Star Credits This Ex Players, Know 3 Unsung Heroes Of KKR's Success
గంభీర్‌ కాదు!.. కేకేఆర్‌ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్‌ చాంపియన్‌గా అవతరించింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో మూడోసారి టైటిల్‌ గెలిచి ట్రోఫీని ముద్దాడింది. పదిహేడో ఎడిషన్‌ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా నిలిచిన శ్రేయస్‌ అయ్యర్‌ సేన.. ఫైనల్లోనూ సత్తా చాటింది.చెన్నై వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఐపీఎల్‌-2024 విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ క్యాంపు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లతో సహా ఫ్రాంఛైజీ యజమానులు షారుఖ్‌ ఖాన్‌, జూహీ చావ్లా కుటుంబాలు ఈ సంతోషంలో పాలుపంచుకున్నాయి.విజయం పరిపూర్ణం.. వారే కారణంఇదిలా ఉంటే.. గతేడాది పేలవంగా ఆడి ఏడో స్థానానికి పరిమితమైన కేకేఆర్‌.. ఈసారి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. సమిష్టి కృషితో టైటిల్‌ సాధించింది. లీగ్‌ దశలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ తొమ్మిది విజయాలు సాధించి టేబుల్‌ టాపర్‌గా నిలిచింది.క్వాలిఫయర్‌-1లో సన్‌రైజర్స్‌ను ఓడించి ఫైనల్‌ చేరిన కేకేఆర్‌.. ఆఖరి మెట్టుపై అదే ప్రత్యర్థిని మరోసారి బోల్తా కొట్టించి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. అయితే, కేకేఆర్‌ సక్సెస్‌ వెనుక మెంటార్‌ గౌతం గంభీర్‌దే కీలక పాత్ర అని ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.గంభీర్‌ను మెంటార్‌గా రప్పించడం ద్వారా ఆటగాళ్ల ఆలోచనా తీరులో మార్పు వచ్చిందని.. గెలుపునకు బాట వేసిందని కొనియాడుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే. అయితే, గంభీర్‌ ఒక్కడే కాదు కేకేఆర్‌ విజయానికి ప్రధాన కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌తో పాటు అసిస్టెంట్‌ కోచ్‌లు అభిషేక్‌ నాయర్, భరత్‌ అరుణ్‌లు‌ కూడా ప్రధాన కారణం.ఆరు రంజీ ట్రోఫీలు.. ఇప్పుడిలా మరో టైటిల్‌దేశవాళీ క్రికెట్‌ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న చంద్రకాంత్‌ పండిట్.. శిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారని పేరు. అనుకున్న ఫలితాలను రాబట్టేందుకు ఆటగాళ్లతో ఎంత హార్డ్‌వర్క్‌ చేయించడానికైనా ఆయన వెనుకాడరని ప్రతీతి.ఇక గంభీర్‌ రూపంలో మరో దిగ్గజం చంద్రకాంత్‌ పండిట్‌కు తోడు కావడంతో ఆయన పని మరింత సులువైంది. మూడు వేర్వేరు జట్లకు కోచ్‌గా వ్యహరించి.. ఆరు రంజీ ట్రోఫీలు గెలిచిన శిక్షకుడిగా పేరొందిన చంద్రకాంత్‌ ఖాతాలో తొలిసారి ఐపీఎల్‌ టైటిల్‌ కూడా చేరింది.వాళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన అభిషేక్‌ నాయర్‌కేకేఆర్‌ గెలుపులో టీమిండియా మాజీ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌‌ అభిషేక్‌ నాయర్‌ది కూడా కీలక పాత్ర. ముఖ్యంగా ఇండియన్‌ కోర్‌కు సంబంధించి అతడే పూర్తి బాధ్యత తీసుకున్నట్లు సమాచారం.అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా అభిషేక్‌ తీర్చిదిద్దాడు. ఫైనల్‌ తర్వాత కేకేఆర్‌ స్టార్లు లీడింగ్‌ వికెట్‌ టేకర్‌ వరుణ్‌ చక్రవర్తి, ఫైనల్‌ టాప్‌ స్కోరర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం.‘‘అభిషేక్‌ నాయర్‌కు కచ్చితంగా క్రెడిట్‌ దక్కాల్సిందే. కొంతమంది పేర్లు పెద్దగా వెలుగులోకి రావు. కానీ.. నా వరకు అభిషేక్‌ విషయంలో అలా జరగకూడదనే కోరుకుంటా. ఈ ప్రపంచంలోని అన్ని రకాల ప్రశంసలకు అతడు అర్హుడు’’ అని వెంకటేశ్‌ అయ్యర్‌ అభిషేక్‌ నాయర్‌పై అభిమానం చాటుకున్నాడు.ఆ శక్తి మరెవరో కాదుఇక కేకేఆర్‌ విజయాల్లో బౌలింగ్‌ విభాగానిదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేదు. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను 113 పరుగులకే ఆలౌట్‌ చేసి సరికొత్త రికార్డులు సృష్టించారు కేకేఆర్‌ బౌలర్లు. స్పిన్నర్లు, పేసర్లు కలిసి ఈ సీజన్‌ ఆద్యంతం అద్భుతంగా రాణించారు. వారి వెనుక ఉన్న శక్తి పేరు భరత్‌ అరుణ్‌.𝙏𝙝𝙚 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 𝙤𝙛 𝙀𝙪𝙥𝙝𝙤𝙧𝙞𝙖 🏆Celebrating @KKRiders' triumph in 𝙎𝙍𝙆 style ⭐️😎#TATAIPL | #KKRvSRH | #Final | #TheFinalCall | @iamsrk pic.twitter.com/OmvXa9GtJx— IndianPremierLeague (@IPL) May 27, 2024చదవండి: BCCI- IPL 2024: వారికి భారీ మొత్తం.. బీసీసీఐ కీలక ప్రకటన

Pune Porsche case: two Doctors Arrested For Manipulating Teen Report
పుణె పోర్షే కేసు: ఇవేం ట్విస్టులు బాబోయ్‌!

గుద్దింది ఎవరు?.. మైనరేనా? డ్రైవరా?పోయింది మాత్రం రెండు ప్రాణాలుప్రమాదానికి కారణం ఆ మైనరే!పైగా మద్యం సేవించి ఉన్నాడుతండ్రి బిల్డర్‌.. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తిఅందుకే కేసును తారుమారు చేసే ప్రయత్నాలుఈ క్రమంలోనే రోజుకొక ట్విస్ట్‌ తెరపైకి పుణె పోర్షే కారు ప్రమాదం.. రోజుకో ట్విస్ట్‌తో థ్రిల్లర్‌ కథను తలపిస్తోంది. తాజాగా నిందితుడైన మైనర్‌ రక్త నమూనాల రిపోర్టులను తారుమారు చేసినందుకు పోలీసులు ఇద్దరు డాక్టర్లను అరెస్ట్‌ చేశారు. సాసూన్‌ ఆస్పత్రిలోని డా. అజయ్‌ తావ్రే, డా. శ్రీహరి హార్నర్‌ పుణె క్రైం బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎందుకంటే..ప్రభుత్వ ఆస్పత్రిలో డా. అజయ్‌ తావ్రే ఫొరెన్సిక్‌ హెడ్‌గా పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటన రోజు నిందిత మైనర్‌ బాలుడు తన స్నేహతులతో మద్యం చేవించినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కన్పించిన విషయం తెలిసిందే. అయితే మైనర్‌ బాలుడి రక్త పరీక్షలో మాత్రం మద్యం సేవించనట్లుగా లేకపోవటం, ఆ రిపోర్టు నెగిటివ్‌ రావటం గమనార్హం. దీంతో రక్త నమూనాలను తారుమారు చేసిన ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.అంతకు ముందు పుణె పోలిసు కమిషనర్ అమితోష్‌ కుమారు మాట్లాడారు. ‘మద్యం మత్తులో కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదం కాదు. మైనర్‌ బాలుడికి తన ప్రవర్తనపై పూర్తి అవగాహన ఉంది. మైనర్‌,అతని స్నేహితులు కలిసి రెండు బార్లలో పార్టీ చేసుకున్నారు. తర్వాత ఇరుకైన వీధిలో నంబర్‌ ప్లేట్‌ లేని కారుతో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశారు. అందుకే మేము దీనిపై దృష్టి పెట్టాము. అతను పూర్తిగా అవగాహనతో ఉన్నాడు. తన చర్యల వల్ల ఎదుటువారి ప్రాణాలు పోతాయని తెలుసు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు వేర్వేరు సమయాల్లో బ్లడ్‌ను పరీక్ష చేయించాము. రెండు ఒకేలా కచ్చితంగా ఉన్నాయి’అని అమితోష్‌ కుమారు తెలిపారు.పోలిసులు వివరాల ప్రకారం.. మొదటి రక్త నమూనాలో మద్యం తాగినట్లు రాలేదు. రెండో నమూనాలో మద్యం సేవించినట్లు పాజిటివ్‌ రావటం గమనార్హం. దీంతో డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించారు. డీఎన్‌ఏ టెస్ట్‌లో సాంపిళ్లు వేరుగా ఉన్నాయి. మైనర్‌ రక్త నమూనా మరోక వ్యక్తి రక్త నమూనాతో తారుమారు అయింది.దీంతో మైనర్‌ రిపోర్టులో నెగటివ్‌ వచ్చింది.ఆదివారం (మే 26): ప్రమాదం జరిగిన సమయంలో తానే కారు నడిపినట్లుగా డ్రైవర్‌ అంగీకరించేందుకు డ్రైవర్‌ కుటుంబానికి.. మైనర్‌ తాత పెద్దమొత్తంలో డబ్బు, బహుమతులు ఆశ చూపించారని పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని అతడిని బెదిరించారని తెలిపారు. బాలుడి తాతపై ఉన్న ఇతర కేసుల వివరాలు కూడా పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బాలుడి తాతకి ఈనెల 28 వరకు రిమాండు విధించింది.శనివారం( మే 25):రోడ్డు ప్రమాదం ఘటనకు కారకుడైన టీనేజర్‌ తాత సురేంద్ర అగర్వాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రైవర్‌ గంగారాంను ఇరికించే ప్రయత్నం సురేంద్ర చేసిందేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. గంగారాంను బెదిరించి.. ప్రమాద సమయంలో కారు తానే నడిపినట్లు పోలీసుల వద్ద చెప్పాలని ఒత్తిడి చేసింది సురేంద్ర అని విచారణలో తేలింది. దీంతో.. కొత్త కేసు నమోదు చేసుకున్న పుణే క్రైమ్‌ బ్రాంచ్‌.. ఇవాళ వేకువ ఝామున 3గం. టైంలో సురేంద్రను ఆయన నివాసంలోనే అరెస్ట్‌ చేసింది. అలా ఈ కేసులో మూడో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది.శుక్రవారం( మే 24): ప్రమాదం గురించి వైర్‌లైస్‌ కంట్రోల్‌రూమ్‌కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌లను సస్పెండ్‌ చేశారు.#PorscheAccident: #Pune Police Obtain CCTV Showing Teenager Frequently Drove Cars#Pune Police have acquired #CCTV footage revealing that a teenager involved in a recent Porsche accident often drove cars. pic.twitter.com/SO2qoALTzA— Punekar News (@punekarnews) May 27, 2024గురువారం( మే 23): పోర్షే కారు ప్రమాద ఘటన జరిగినప్పుడు కారును నడిపింది తమ డ్రైవర్‌ అని మైనర్‌ బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే, కేసు నుంచి మైనర్‌ను తప్పించేందుకే డ్రైవర్‌ను ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.బుధవారం( మే 22): రోడ్డు ప్రమాదానికి ముందు ప్రముఖ బిల్డర్‌ కుమారుడైన మైనర్‌ బాలుడు కేవలం 90 నిమిషాలకు పబ్బులో రూ. 48 వేలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు.మంగళవారం( మే 21): రోడ్డు ప్రమాదం కేసులో పోర్షే కారు నడిపిన మైనర్‌ బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జువైనల్‌ జస్టిస్‌ యాక్టు కింద ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సోమవారం( మే 20): తన ర్యాష్‌ డ్రైవింగ్‌తో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందుతుడైన మైనర్‌కు 15 గంటల్లోనే కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతులు చర్చనీయాంశంగా మారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ‘ట్రాఫిక్‌ పోలీసుతో 15 రోజులు పని చేయాలి. మానసిక పరివర్తనకు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి. ‘రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కార మార్గాలు’అనే టాపిక్‌ మీద 300 పదాలలో వ్యాసం రాయాలి. డి- అడిక్షన్‌ సెంటర్‌లో పునరాసం కోరాలి. ట్రాఫిక్‌ రూల్స్‌ చదవి జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు ప్రజంటేషన్‌ ఇవ్వాలి. రోడ్డు ప్రమాద బాధితులకు భవిష్యత్తులో అండగా ఉండాలి’అని జువైనల్‌ కోర్టు మైనర్‌ బాలుడికి షరతులు విధించింది.ఆదివారం(మే 19): ప్రముఖ బిల్డర్‌ కుమారుడైన మైనర్‌ ఆదివారం ఉదయం కోరేగావ్ పార్క్ వద్ద వేగంగా పోర్షే కారును నడుతూ.. ఓ బైక్‌ను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో అనిస్ దుధియా ,అశ్విని కోస్టా అనే ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Could have Learned This Lesson From Warren Buffett Reveals Bill Gates
బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సింది..

బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నప్పుడు సమయపాలనకు అత్యంత విలువనిచ్చేవారు. ప్రతి సెకనుకూ ఆయన షెడ్యూల్‌ వేసుకునేవారు. అదే విజయానికి మార్గమని నమ్మేవారు. అలాంటి బిల్‌ గేట్స్‌.. అది తప్పని చాలా ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు. వారెన్‌ బఫెట్‌ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సిందని చెబుతున్నారు.."విజయవంతం కావడానికి మీరు మీ షెడ్యూల్‌లోని ప్రతి సెకనును నింపాల్సిన అవసరం లేదు. ఇది గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని గేట్స్ మెటా థ్రెడ్స్ యాప్‌లో పోస్ట్ చేశారు. వారెన్ బఫెట్ రూపొందించుకున్న తేలికపాటి క్యాలెండర్‌ను నిశితంగా పరిశీలించి ఉంటే ఈ పాఠాన్ని ఇంకా చాలా త్వరగా నేర్చుకునేవాడినని రాసుకొచ్చారు.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ సమయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. రోజులోని ప్రతి నిమిషాన్ని షెడ్యూల్ చేస్తూ తన సమయాన్ని మైక్రోమేనేజ్ చేశారు. సిబ్బందికి అర్థరాత్రి వర్క్‌ రిక్వెస్ట్‌లు పంపడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. అయితే 2017లో చార్లీ రోజ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ తో కలిసి గేట్స్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. అలుపెరగని ఈ విధానమే విజయానికి మార్గమని ఆయన గతంలో విశ్వసించారు. అయితే, బఫెట్ తేలికపాటి షెడ్యూల్ చూసిన తరువాత, బిల్ గేట్స్ తన భావను సమీక్షించుకోవడం మొదలుపెట్టారు."వారెన్ తన క్యాలెండర్‌ను చూపించడం నాకు గుర్తుంది. దానిలో ఏమీ లేని రోజులు అతనికి ఉన్నాయి" అని బిల్ గేట్స్ అన్నారు. బఫెట్ షెడ్యూల్ తనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందన్నారు. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. బఫెట్ భావన ఏంటంటే "కష్టపడి కాదు.. తెలివిగా పనిచేయండి". సైన్స్‌ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.'ఈ పాఠం నేర్చుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. మీరు అంతకాలం వేచి ఉండవద్దు' అని ఆయన అన్నారు. "ఇష్టమైనవారితో బంధాలను పెంపొందించుకోవడానికి, సక్సెస్‌ను ఆనందించడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి తగిన సమయాన్ని తీసుకోండి. అవసరమైనప్పుడు విరామం తీసుకోండి" అని బిల్‌ గేట్స్‌ సూచిస్తున్నారు.

Is There Any Impact Of IPL On T20 World Cup 2024
పొట్టి ​ప్రపంచకప్‌పై ఐపీఎల్‌ ప్రభావమెంత..?

రెండు నెలలకు పైగా జరిగిన క్రికెట్‌ పండుగ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిన్నటితో (మే 26) ముగిసింది. ఈ సీజన్‌ ఫైనల్లో కేకేఆర్‌.. సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. ఐపీఎల్‌ ముగిసిన ఐదు రోజుల్లోనే మరో మహా క్రికెట్‌ సంగ్రామం మొదలుకానుంది. యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ దాదాపుగా నెల రోజుల పాటు అభిమానులకు కనువిందు చేయనుంది.పొట్టి ప్రపంచకప్‌ ఐసీసీ ఈవెంట్‌ కావడంతో అభిమానుల్లో అమితాసక్తి నెలకొని ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే టోర్నీ కావడంతో తీవ్ర భావోద్వేగాలు ఉంటాయి. ఈ సారి వరల్ఢ్‌కప్‌లో గతంలో ఎన్నడూ లేనట్లుగా 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్‌కు ఐదు జట్ల చొప్పున మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. భారత్.. చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో కలిసి గ్రూప్‌-ఏలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో భారత్‌, పాక్‌లతో పాటు యూఎస్‌ఏ, ఐర్లాండ్‌, కెనడా దేశాలు ఉన్నాయి. ఐపీఎల్‌ 2024 సీజన్‌ రెండు నెలల సుదీర్ఘ కాలంపాటు సాగిన నేపథ్యంలో ఓ ఆసక్తిర ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు (దాదాపుగా) చెందిన ఆటగాళ్లు ఇన్ని రోజుల పాటు ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో ఈ లీగ్‌ ప్రభావం పొట్టి ప్రపంచకప్‌పై ఏమేరకు పడనుందనే ప్రశ్న తలెత్తుతుంది. ఐపీఎల్‌ ముగిసి వారం రోజులు కూడా గడువక ముందే పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభంకావడం మంచిదేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఐపీఎల్‌ సుదీర్ఘకాలం పాటు సాగడం వల్ల ఆటగాళ్లు అలసిపోయుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌ ప్రభావం ఆటగాళ్లపై నెగిటివ్‌గా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌ కారణంగా ఆటగాళ్లలో సీరియస్‌నెస్‌ కొరవడిందని కొందరంటున్నారు. ఐపీఎల్‌లో ఆడి కొందరు ఆటగాళ్లు గాయాల బారిన పడిన విషయాన్ని ఇంకొందరు ప్రస్తావిస్తున్నారు. ఐపీఎల్‌లో లభించే డబ్బును చూసుకుని కొందరు ఆటగాళ్లు దేశీయ విధులపై ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్‌ ముగిసి వారం కూడా గడవక ముందే మెగా టోర్నీ నిర్వహించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.మరోవైపు ఐపీఎల్‌ వల్ల మంచే జరిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌ వల్ల తమ దేశ ఆటగాళ్లకు మంచే జరిగిందని ఆసీస్‌ అభిమానులు అనుకుంటున్నారు. కిక్కిరిసిన జనాల మధ్య ఐపీఎల్‌ ఆడటం వల్ల తమ దేశ క్రికెటర్లకు ఒత్తిడిని ఎదుర్కోవాలో తెలిసొచ్చి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంతో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ సైతం ఏకీభవించాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ ఆడనీయకుండా తప్పుచేసిందని అతను అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌ ఆడి ఉంటే పొట్టి ప్రపంచకప్‌ ఇంకాస్త ఎక్కువగా సన్నద్దమయ్యేవారని వాన్‌ అన్నాడు.భారత ఆటగాళ్ల విషయానికొస్తే.. ఐపీఎల్‌ ప్రతిభే కొలమానంగా ప్రపంచకప్‌ జట్టు ఎంపిక జరిగింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు మాత్రమే ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కింది. జట్టులో స్థానం విషయంలో సెలెక్టర్లు ఎలాంటి ములాజలకు పోకుండా అర్హులైన వారినే ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు సంబంధించి వ్యూహాలు వేరుగా ఉన్నప్పటికీ.. ఐపీఎల్‌ వల్ల భారత ఆటగాళ్లకు మేలే జరిగిందని చెప్పాలి. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కీలక ఆటగాళ్లెవరు గాయాల బారిన పడలేదు. టీ20 జట్టులో రెగ్యులర్‌ సభ్యులైన ఆటగాళ్లందరూ మాంచి ఫామ్‌లో ఉండటంతో జట్టు ఎంపిక​ కూడా చాలా కష్టమైంది. కొన్ని సమీకరణల కారణంగా కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని చెప్పాలి. ఓవరాల్‌గా చూస్తే పొట్టి ప్రపంచకప్‌పై ఐపీఎల్‌ ప్రభావం అనే అంశంపై ఎవరి అభిప్రాయాలను వారు వినిపిస్తున్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement