Short Stories | Sakshi
1

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీపి కబురు.. చిగురించిన ఆశలు

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. 2026 సంవత్సరం వేతన పెంపు కోసం ఉద్యోగుతల వార్షిక పనితీరు మూల్యాంకన చక్రాన్ని (annual performance review cycle) ప్రారంభించింది. దీంతో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జీతాల పెంపుపై (salary hike) ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అక్టోబర్ 17లోగా స్వీయ అంచనాలను సమర్పించాల్సిందిగా కంపెనీ సిబ్బందిని కోరింది.
Read More
2

రైల్లో వెళ్లి కొంటే వెండి రూ. 14 వేలు ఆదా!

వెండి, బంగారం మాట ఎత్తాలంటేనే బెంబేలెత్తేపరిస్థితి. సామాన్య మానవులే కాదు, ధనవంతులు కూడా గోరెడు బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి. కానీ వెండి ధరలపై ఫుడ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ నళిని ఉనగర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. ఈ నగరాల మధ్య రైల్లో వెళ్లి వెండి కొంటే 14 వేలు ఆదా అవుతాయని పేర్కొంది. దీంతో వైరల్‌ గామారింది.
Read More
3

మొరింగా సాగుతో.. ఏడాదికి రూ. 40 ల‌క్ష‌లు

వ్యవసాయం చేయడం అంటే మాటలుకాదు. చెమటలు చిందించాలి. ఆను పాను తెలియాలి. ఏ పంటకు ఎలాంటి చీడపీడలు వస్తాయి, వాటికి పరిష్కారం ఏమిటి అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. అలా కర్ణాటకకు చెందిన ఒక రైతు అ‍ద్భుతాలు సాదించాడు. ఏడాదికి 40 లక్షల రూపాయల ఆదాయంతో ఔరా అనిపించుకున్నాడు.
Read More
4

ఆ కారణంతోనే ఐశ్వర్యని వెనక్కినెట్టి.. సుస్మితా మిస్‌ ఇండియాగా గెలుపొందింది..!

అందాల పోటీకి సంబంధించి భారత్‌కి.. 1994 అతి ప్రాధాన్యత సంతరించుకున్న ఏడాది. ఎందుకంటే ఆ ఏడాదే ప్రతిష్టాత్మకమైన మిస్‌ యూనివర్స్‌, మిస్‌ వరల్డ్‌ కిరీటాలు రెండూ దక్కాయి. 28 ఏళ్ల తర్వాత రీటా ఫారియా తదనంతరం ఇద్దరు సుందరీమణులు ఈ ఘనతను దక్కించుకున్నారు. ఐశ్వర్య రాయ్‌, సుస్మితా సేన్‌ ఆ ఘన కీర్తిని భారత్‌కు అందించారు. దేశమే గర్వించేలా చేశారు. అయితే వీళ్లిద్దరూ మిస్‌ ఇండియా ఫైనల్లో తలపడ్డాడరు. కానీ కిరీటం సుస
Read More
5

44 కిలోల బరువు తగ్గిన ఫిట్‌నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్‌లాస్‌ పాఠాలు..

ఆరోగ్యకరమైన జీవినశైలి బరువు తగ్గడానికి సంబంధించి..తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్‌ కారణంగానే చాలామంది వెయిట్‌లాస్‌ కాలేకపోతుంటారని చెబుతున్నాడు ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ యష్‌ వర్ధన్‌ స్వామి. కొందరు విఫల ప్రయత్నం చేసి విసిగిపోయినవాళ్లు కూడా ఉన్నారని అంటున్నాడు. తాను ఒకప్పుడు అధిక బరువు ఉండేవాడనని, ఇప్పుడు వెయిట్‌లాస్‌ అయ్యి ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాని కూడా చెప్పారు.
Read More
6

టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గెలవాల్సిన మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. ఆసీస్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజ్‌ల్లో 5 శాతం కోత విధించారు. నిర్దేశిత సమయంలోగా భారత బౌలర్లు ఓ ఓవర్‌ వెనకపడి ఉన్నారు.
Read More
7

తొలి తెలుగు సింగర్‌ బాలసరస్వతి కన్నుమూత

చలనచిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగులో తొలి మహిళా సింగర్‌ రావు బాలసరస్వతి దేవి (97) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం (అక్టోబర్‌ 15) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బాలసరస్వతి.. స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. 1928లో పుట్టిన ఆమె ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టారు. మొదటగా..
Read More
8

ఆ చాటింగ్‌ నాది కాదు: జోగి రమేష్‌

తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్‌రావుతో తనకు సంబంధాలు ఉన్నాయన్న ప్రచారాన్ని మాజీ మంత్రి జోగి రమేష్‌ మరోసారి ఖండించారు. బుధవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంబంధాలున్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని..
Read More
9

గిల్‌.. ఇప్పటికీ అవే వాడుతున్నాడు: సూర్యకుమార్‌

టీమిండియా ప్రస్తుత టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు ‘మూఢనమ్మకం’ ఒకటి ఉందట. భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. ‘‘జట్టులో అందరికంటే భిన్నమైన రంగులో ఉన్న ప్యాడ్లను గిల్‌ ధరిస్తాడు. అతడి ప్యాడ్స్‌ రంగు లేత నీలం రంగులో ఉంటుంది’’ అని సూర్య తెలిపాడు. వాటిని ధరించిన నాటి నుంచి పరుగుల వరద కొనసాగుతోంది కాబట్టే ఇలా చేస్తున్నాడని పేర్కొన్నాడు.
Read More
10

ధన త్రయోదశికి ముందే అంతులేని ధరలు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ​మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. అక్టోబర్‌ 18న ధన త్రయోదశికి ముందు పసిడి ధరల ఇలా భారీగా పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.
Read More
11

చెవిరెడ్డి పిటిషన్‌.. ఏపీ హైకోర్టు తీర్పు కొట్టివేత

ఢిల్లీ: అక్రమ మద్యం కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలేవరకు.. ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించవద్దన్న తీర్పును బుధవారం కొట్టేసింది. బెయిల్ రద్దు, బెయిల్‌ పిటిషన్లను మెరిట్ ఆధారంగా నిర్ణయించాలని ఈ సందర్భంగా హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచింది. అక్రమ మద్యం కేసులోచెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్..
Read More
12

జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం కొనసాగుతున్న సస్పెన్స్‌కు బీజేపీ తెర దించింది. అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి పేరును బుధవారం ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే.. ఈసారి ఈ ఎన్నికను కచ్చితంగా గెలవాల్సిన పోరుగా భావిస్తున్న బీజేపీ..
Read More
13

పీకే సంచలన నిర్ణయం

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి భారీ విజయం దక్కనుందని ఆయన చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇక నుంచి తాను పార్టీలో సంస్థాగత పనులు మాత్రమే చూసుకుంటానని తెలిపారాయన. అంతేకాదు.. తేజస్వి యాదవ్‌పై పోటీ చేయబోతున్నట్లుగా ..
Read More
14

టైమ్‌.. ఇదేం బాగోలేదు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పట్టరాని కోపం వచ్చింది. తను గురించి పొడుగుతూ టైమ్‌ మ్యాగజైన్‌ రాసిన కథనం అందుకు కారణం. అలాగని కథనం బాగోలేదని కాదు. అది కొంత వరకు బాగానే ఉందంటూ ఆయన కాంప్లిమెంట్‌ ఇచ్చాడు కూడా. మరి ఎక్కడ బెడిసి కొట్టింది?. ఆయనకు ‘చెత్త’ అంటూ అంతగా కోప్పడటానికి గల కారణం ఏంటంటే..
Read More
15

‍గంభీర్‌ కరెక్ట్‌: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) చేసిన ‘సిగ్గుచేటు’ వ్యాఖ్యలపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా (Rajeev Shukla) స్పందించాడు. గంభీర్‌ సరిగ్గానే మాట్లాడానని సమర్థించిన అతడు.. యువ ఆటగాడి పట్ల సీనియర్ల ప్రవర్తన సరికాదని పేర్కొన్నాడు.
Read More
16

‘ఆ భయంతోనే చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు’

నకిలీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా బరితెగించి వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పులు మీద తప్పులు చేస్తూ కూడా అడ్డగోలుగా బుకాయిస్తున్నారని విమర్శించారు.
Read More
17

బస్సులో చెలరేగిన మంటలు .. 12మంది సజీవ దహనం?

జస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం (అక్టోబర్‌14)జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న ప్రైవేట్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 10 నుంచి 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
Read More
18

ఒత్తిడిలో ఉన్నపుడు హెల్ప్‌ అడగడం బలహీనత కాదు: సారా అలీఖాన్‌

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ మరోసారి మానసిక ఆరోగ్యం ఒత్తిడి, చికిత్స లాంటి విషయాలను గురించి మాట్లాడింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా సులభం అని చెప్పిన సారా అలీ ఖాన్ మానసికంగా ఒత్తిడిలో ఉన్నపుడు సాయం అడగడంలో తప్పు లేదనీ, అది బలహీనతగా భావించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అంతేకాదు మీరు చేయాల్సిందల్లా ఒక క్షణం ఊపిరి పీల్చుకుని, మీకు మీరు ఏడ్చేస్తే భారం తగ్గుతుందని వెల్లడించింది.
Read More
19

ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..

కొన్ని దేశాల్లో ఉండే ఆచారాలు ఎంతలా వింతగా ఉంటాయంటే..వినడానికి నమ్మశక్యం కానంతగా ఉంటాయి. ఇవేమి పద్ధతులు..ఎందుకిలా అని ఆరా తీసినా..వాటి వివరణ సైతం నోరెళ్లబెట్టేలా ఉంటుంది. అచ్చం అలాంటి విచిత్రమైన సంస్కృతే ఇండోనేషియాలోని ఓ తెగ ఆచరిస్తుంది. ఆ కారణంగానే వార్తల్లో నిలిచింది కూడా. అంతేకాదండోయ్‌ దాన్ని చూసేందుకు పర్యాటకులు సైతం ఎగబడుతున్నారు. పైగా అలాంటి థ్రిల్‌ కావలంటూ.. మరి వస్తున్నారట టూరిస్టులు.
Read More
20

వాట్‌ క్రెడిట్‌ కార్డుతో గిన్నిస్‌ రికార్డు? ఖర్చు మాత్రమే కాదు ఆదాయ కూడా..

సాహసకృత్యాలతోనే కాదు స్మార్ట్‌గా కూడా గిన్నిస్‌ రికార్డులు సృష్టించొచ్చని నిరూపించాడు ఈ వ్యక్తి. అందరూ స్మార్ట్‌ కార్డులు ఖర్చుపెట్టడానికి ఉపయోగిస్తే..ఆయన దాన్ని ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. అది ఎంతలా అంటే..రోజు మొత్తం క్రెడిట్‌ కార్డు లేకుండా పని కాదన్నంత రేంజ్‌లో. అలా ఏకంగా ఎ‍న్ని క్రెడిట్‌ కార్డులు ఉపయోగిస్తున్నాడో తెలిస్తే కంగుతింటారు.
Read More
21

చరిత్ర సృష్టించిన ధ్రువ్‌ జురెల్‌

టీమిండియా యువ క్రికెటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (Dhruv Jurel) అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం నుంచి ఇప్పటికి వరుసగా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్ కుమార్‌ (Bhuvneshwar Kumar) పేరిట ఉండేది. వెస్టిండీస్‌తో రెండో టెస్టు (IND vs WI 2nd Test) సందర్భంగా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు.
Read More
22

ఎన్టీఆర్‌ వార్-2.. ఓటీటీలో క్రేజీ రికార్డ్

యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వార్-2((War2 Movie)). ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీలో హృతిక్ రోషన్‌ కూడా నటించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా మెప్పించింది.
Read More
23

ఈ దీపావళికి లక్ష్మీపూజ ఇలా చేస్తే..ధనమే ధనం

దీపావళి అంటే దివ్యమైన పండుగ. చీకట్లను పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించే జ్యోతికి మొక్కే పండగ. దీపావళి రోజు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రధాన ఆచారంగా పాటిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కష్టాలన్నీ తొలగిపోయి, నిత్యం తమ ఇంట లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుందని విశ్వసిస్తారు.
Read More
24

ఈ ఏడాది స్పెషల్‌ దివాలీ : ఎపుడు? ఎలా జరుపుకోవాలి?

చిన్నా పెద్దా అంతా ఏంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ దీపావళి (Diwali 2025). ఆశ్వీయుజ అమావాస్య నాడు వచ్చే, వెలుగు దివ్వెల పండుగ.ఈసారి గ్రహాల అద్భుతమైన కలయిక అని, చాలా ఏళ్ల తరువాత వచ్చే ఈ కలయికే ఈ దీపావళి ప్రత్యేకత అని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు.
Read More
25

ఎల్లలు దాటిన ప్రేమ.. గ్రామస్తుల సమక్షంలో వైభవంగా

తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని ముత్తు పెట్టి సమీపంలోని కరయంగడు గ్రామానికి చెందిన సోమసుందరం. ఇతని భార్య వాసుకి కుమారుడు యోగాదాస్, ఇండోనేషియాలోని డయానా టీపును ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని తమిళనాడు ఆలయంలో గ్రామస్తుల సమక్షంలో వైభవంగా జరిగింది.
Read More
26

ఓటీటీలోకి 'దృశ్యం' దర్శకుడి కొత్త థ్రిల్లర్ సినిమా

'దృశ్యం' ఫ్రాంచైజీతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జీతూ జోసెఫ్ తీసిన లేటెస్ట్ మలయాళ సినిమా 'మిరాజ్'. ఇప్పుడు దీని ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?
Read More
27

Bihar: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ తొలి జాబితా విడుదల చేసింది. 71 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం(అక్టోబర్‌ 14వ తేదీ) తమ అభ్యర్థుల జాబితా రిలీజ్‌ చేసింది బీజేపీ. ఈ జాబితాలో 9 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది బీజేపీ.
Read More
28

హర్షిత్‌ రాణాపై విమర్శలు.. గంభీర్‌ సీరియస్‌

ఆస్ట్రేలియా టూర్‌కు హ‌ర్షిత్ రాణాను ఎంపిక చేయ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. గంభీర్ స‌పోర్ట్‌తోనే అత‌డికి ఎక్కువ‌గా అవకాశాలు ద‌క్కుతున్నాయ‌ని మాజీ క్రికెట‌ర్లు అశ్విన్‌, కృష్ణమచారి శ్రీకాంత్ ఫైరయ్యారు. వారిద్దరికి గంభీర్ కౌంటరిచ్చాడు. మీ యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం 23 ఏళ్ల యువ క్రికెటర్‌ను టార్గెట్ చేయడం సరికాదని మండిపడ్డాడు. అతడు కష్టపడి ఈ స్ధాయికి వచ్చాడని గౌతీ పేర్కొన్నాడు.
Read More
29

మావోయిస్టులకు బిగ్‌ షాక్‌

గచ్చిరోలి: మావోయిస్టు పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేత మల్లోజుల వేణుగోపాల్‌ రావు అస్త్ర సన్యాసం చేశారు. 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయారు. ఇటీవలె అధినాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన లేఖ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.ఈ తరుణంలో ఆయుధాలను అప్పగించాలంటూ ఆయనకు మావోయిస్టు పార్టీ అల్టిమేటం జారీ చేసింది. ఈలోపే..
Read More
30

ముందుంది మొసళ్ల పండుగ! కేజీ వెండి రూ.2 లక్షలు!

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ​సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. అక్టోబర్‌ 18న దంతేరాస్‌కు ముందు పసిడి ధరల ఇలా భారీగా పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.
Read More
31

ఢిల్లీ టెస్టు.. విండీస్‌పై భారత్‌ ఘన విజయం

ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 121 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి టీమిండియా విజయం సాధించింది. కేఎల్ రాహుల్ 58 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. భారత్ త‌మ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 518 ర‌న్స్ స్కోరు చేసి డిక్లేర్ చేయ‌గా.. విండీస్‌ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులు చేసింది
Read More
32

ఇండియన్‌ సినిమా వైపు బ్రిటిష్‌ టాప్‌ సింగర్‌.. ఫస్ట్‌ సాంగ్‌ ఇదే

ఇండియన్‌ సినిమా ప్రపంచ దేశాలను మెప్పించే స్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే లండన్‌కు చెందిన పాప్ 'సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్' సౌత్‌ ఇండియా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో ఒక మ్యూజిక్‌ ఈవెంట్‌లో ఏఆర్‌ రెహమాన్‌తో 'ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..' అనే పాటతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపిన ఆయన ఇప్పుడు ఏకంగా కోలీవుడ్‌లో ఒక ఆల్బమ్‌లో పాట పాడనున్నారు. ఎవరి సంగీతంలో అంటే..
Read More
33

బీసీ రిజర్వేషన్ల స్టే తొలగించండి

న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. బీసీ 42% శాతం రిజర్వేషన్ల జీవో పై హైకోర్టు స్టే తొలగించాలని అందులో పేర్కొంది. వీలైనంత త్వరగా విచారణకు త్వరగా స్వీకరించాలని కోరే అవకాశం ఉండడంతో విచారణ..
34

భారత్‌-పాక్‌ యుద్ధం ఆపింది ట్రంపే!

కైరో: భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు ఎలా చల్లారాయి?. ఒకవైపు తానే యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించుకుంటూ వస్తున్నారు. భారత్‌ మాత్రం మూడో వ్యక్తి జోక్యం లేదని, పాక్‌ కోరితేనే కాల్పుల విరమణ చేపట్టామని అంటోంది. అయితే పాక్‌ మాత్రం ఇప్పుడు కొత్త స్వరం అందుకుంది. ఎనిమిది యుద్ధాలు ఆపిన ట్రంపే.. అందుకు కారణమంటూ ప్రకటించింది. ఈ క్రమంలో చేసిన భజన.. యావత్‌ ప్రపంచాన్నే నివ్వెర..
Read More
35

హైదరాబాద్‌ బాలానగర్‌లో దారుణం

హైదరాబాద్‌: బాలానగర్‌లోని పద్మారావునగర్‌ ఏరియాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలను చంపి ఓ తల్లి తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఆ చిన్నారులు కవలపిల్లలుగా తెలుస్తోంది. అయితే..
Read More
36

పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్‌

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పంతం నెగ్గించుకుంది. అదే సమయంలో.. అదనంగా చేరిన రెండు మిత్రపక్షాల సీట్‌ షేరింగ్‌పైనా స్పష్టత వచ్చింది. ఇంకోవైపు 50 సీట్లు, డిప్యూటీ సీఎం కావాలన్న వీఐపీ పార్టీ సైతం దిగి వచ్చింది. దీంతో మహాఘట్‌ బంధన్‌లో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లైంది. తాజా సమాచారం ప్రకారం.. కాంగ్రెస్‌ కోరుకున్నట్లే సీట్లను కేటాయించి..
Read More
37

ప్రముఖ ఐఏఎస్‌ఫై అవినీతి దుమారం.. 51 కోట్ల ఫైన్ 4వేలకు తగ్గించారా?

భోపాల్‌: ప్రముఖ ఐఏఎస్‌ అధికారిణి సృష్టి దేశ్‌ముఖ్‌ గౌడ భర్త ఐఏఎస్‌ నాగార్జున బి.గౌడ చుట్టూ అవినీతి అరోపణల ఉచ్చు బిగుస్తోంది. మైనింగ్‌ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఓ కంపెనీకి భారీ మొత్తంలో ప్రభుత్వం జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కోట్ల నుంచి రూ.10వేల లోపుకు తగ్గించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చింది. ఆ అవినీతి ఆరోపణల్ని జిల్లా మేజిస్ట్రేట్ మేజ సిద్ధార్థ్
Read More
38

కాంతార చాప్టర్-1.. జైలర్‌, లియో రికార్డ్స్ బ్రేక్!

రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్‌ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలను రికార్డ్స్ తుడిచిపెట్టిన ఈ మూవీ అరుదైన మార్క్ చేరుకుంది. ఈ సినిమా రిలీజైన 11 రోజుల్లోనే రూ.600 కోట్ల క్లబ్‌లో చేరింది. రెండో వారంలోనూ కలెక్షన్స్ పరంగా తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే కన్నడలో కేజీఎఫ్-2 తర్వాత రెండో స్థానంలో కాంతార చాప్టర్-1 నిలిచింది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం మరింత కలిసి రానుంది.
Read More
39

కాబోయే వాడు హగ్‌ చేసుకున్నాడని రూ. 3.73లక్షల డిమాండ్‌..

ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్‌.. ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లి కుదిరి నిశ్చితార్థం తంతు ముగిస్తే చాలు.. ఇక ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కి ప్లాన్‌ చేసుకుంటున్నారు. పాత కాలంలో అమ్మాయి-అబ్బాయి ఒకరిని ఒకరు చూసుకోవడమే గగనమైతే.. ఇప్పుడు ఆ ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది.
Read More
40

ఏపీ పోలీసులపై మరోసారి హైకోర్టు సీరియస్‌

సాక్షి,విజయవాడ: పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి రికార్డులు సీజ్‌ చేయాలని ఇచ్చిన ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
Read More
41

EPFO శుభవార్త: 100 శాతం పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌(EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తమ పీఎఫ్‌ సొమ్మును (PF) పూర్తిగా విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్‌వో ఆమోదం తెలిపింది. ఈమేరకు నిబంధనలను సరళీకృతం చేసింది. సభ్యులు ఇప్పుడు ఉద్యోగి, యజమాని విరాళాలతో సహా అర్హత కలిగిన బ్యాలెన్స్ లలో 100% వరకు ఉపసంహరించుకోవచ్చు.
Read More
42

‘చంద్రబాబూ.. కృష్ణా జిల్లా నా అడ్డా.. నేను ఇక్కడే ఉంటా

డీపీ నేతల చుట్టూ తిరుగుతున్న నకిలీ మద్యం కేసులో తన పేరును ఆ కేసులో నిందితుడితో చెప్పించడంపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. కస్టడీలో ఉన్న జనార్థన్‌రావుతో తన పేరును చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Read More
43

బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే: కమొడిటీ గురు జిమ్ రోజర్స్‌

బంగారం, వెండి కొనే విషయంలో భారతీయ మహిళలను చూసి నేర్చుకోవాలంటున్నారు ప్రముఖ కమోడిటీ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్. పెట్టుబడి పాఠాలకు సంబంధించి ఆయన రాసిన పుస్తకం ‘స్ట్రీట్ స్మార్ట్స్: అడ్వెంచర్స్ ఆన్ ది రోడ్ అండ్ ఇన్ ది మార్కెట్స్’ చాలా ప్రసిద్ధి చెందింది. ఇటీవల బిజినెస్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బంగారం, బంగారం, వెండిని కలిగి ఉన్నానని, కానీ వాటిని అమ్మే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
Read More
44

ప్రపంచంలోనే ఖరీదైన బ్యాగు.. నీతా అంబానీ సొంతం

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ నీతా అంబానీ మనీష్‌ మల్హోత్రా దివాలీ బాష్‌లో స్టన్నింగ్‌ లుక్‌తో అలరించారు. నీతా ధరించిన చీర, చిన్న బ్యాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రప్రపంచంలోనే ఖరీదైన హెర్మేస్ బిర్కిన్ స్పెషల్ ఎడిషన్ మినీయేచర్ బ్యాగ్‌ నెట్టింట సందడి చేస్తోంది. తీసుకెళ్లారు. 3,025 వజ్రలు, 18 కే గోల్డ్‌తో రూపొందించారు. అలాగే చిన్నకోడలు రాధికా మర్చంట్‌తో కలిసి రావడం మరింత స్పెషల్‌.
Read More
45

ఆ కోటు వేసుకోవాలనేది డ్రీమ్‌..కానీ డబ్బుల్లేక!

డిజిటల్ క్రియేటర్‌, రషికా ఫజాలి తన గ్రాడ్యుయేషన్‌ అనుభవాన్ని పంచుకున్నారు. గ్రాడ్యుయేషన్‌ ఈవెంట్‌లో పాల్తొనాలనే ఆమె డ్రీమ్‌ సాకారం కాలేదు.కేవలం ఆర్థిక సమస్యల కారణంగా దాన్ని మిస్‌ అయ్యానని చెప్పుకొచ్చింది. ఆరోజు కేవలం జనంలో అతిథిగా కూర్చోవాల్సి వచ్చిందంటూ హృదయాన్ని కదిలించే స్టోరీ షేర్‌ చేశారు.
Read More
46

ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్‌ పిక్నిక్‌కి అదే రూటు

న్యూయార్క్‌ నగరంలోని మాన్ హట్టన్ లోని సెంట్రల్‌ పార్క్, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, వనాలకు పేరొందింది. ఇక్కడే ఉన్న సెంట్రల్‌ పార్క్‌ జూ బెథెస్డా టెర్రస్‌ వంటి ప్రత్యేక ఆకర్షణలకు కూడా ఇది చిరునామా. అయితే ఇప్పుడు అది మరికొన్ని వైవిధ్యభరిత రుచులకు కూడా చిరునామాగా మారింది. ముఖ్యంగా భారతీయ రుచుల కోసం వెతుకుతున్న ఆహార ప్రియులకు అది తప్పనిసరి సందర్శనీయ స్థలంగా కూడా అవతరించింది.
47

అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్‌ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్‌..!

కొన్ని సక్సెస్‌ స్టోరీలు ఎంతలా ప్రేరేపిస్తాయంటే.. జీరో నుంచి మిలియనీర్‌గా అవతరించడం ఎలా అనేది నేర్పిస్తాయి. తాతల తండ్రులు కాస్త సంపాదించే పెడితే కదా జీవితం బాగుండేది..మంచి చదువులు చదవగలిగేది అనుకుంటారు చాలామంది. అవన్నీ సాధించడం చేతకాని వాడు చెప్పే చెత్తకబుర్లే అవి పలువురు విజేతలు ప్రూవ్‌ చేశారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ వ్యక్తి.
Read More
48

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే

మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ చిత్రాలు రానుండగా.. ఓటీటీల్లోకి మాత్రం 20కి పైగా కొత్త సినిమాలు,వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తో పాటు పలు డబ్బింగ్ బొమ్మలు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?
Read More
49

వైల్డ్‌ ఫైర్‌ మాధురి.. మొదటిరోజే కంటతడి

బిగ్‌బాస్‌ షోలో కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరు దివ్వెల మాధురి. ఒకరు నాకెదురొచ్చినా వారికే రిస్క్‌.. నేను వారికి ఎదురెళ్లినా వారికే రిస్క్‌ అంటూ హౌస్‌మేట్స్‌కు వార్నింగ్‌ ఇస్తూనే ఇంట్లో అడుగుపెట్టింది. హౌస్‌లో అడుగుపెట్టి ఒక పూటయిందో, లేదో.. అప్పుడే గొడవలు మొదలుపెట్టేసింది. కిచెన్‌లో కల్యాణ్‌, దివ్యతో కయ్యానికి కాలు చాపింది. వాళ్లు తిరిగి అరిచేసరికి..
Read More
50

Nobel Prize 2025: ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం

ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ముగ్గుర్ని వరించింది. జోయెల్‌ మోకిర్‌, ఫీటర్‌ హౌవీట్‌, ఫిలిప్‌ అఘియన్‌లు నోబెల్‌ గెలుచుకున్నారు. ఆర్థికశాస్త్రంలో వీరు చేసిన విశేష కృషికి గాను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది నోబెల్‌ కమిటీ.
Read More