Short Stories | Sakshi
1

ప్రధాని మోదీకి ట్రంప్‌ ఫోన్‌ కాల్‌.. అంతా ఉత్తిదే

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేసినట్లు, ఇక రష్యా చమురు కొనుగోలు చేయమని ట్రంప్‌కు మోదీ హామీ ఇచ్చినట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని భారత కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
Read More
2

వెంకటేశ్, రానాకు కోర్టు షాక్‌!

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోలు వెంకటేశ్‌, రానా, అభిరామ్, సురేశ్‌ బాబు కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14న తప్పనిసరిగా న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది.
Read More
3

బహుశా ఇదే చివరి దీపావళి పండుగ..! సమయం మించిపోతోంది.

దీపావళి పండుగ అంటే చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంజాయ్‌ చేస్తారు. అలాంటి పండుగను ఈ యువకుడు ఇదే తనకు ఆఖరి దీపావళి ఏమో అంటూ భావేద్వేగంగా పోస్టు పెట్టాడు. హృదయాన్ని మెలిపెట్టే అతడి కథ నెట్టింట వైరల్‌గా మారడమే కాదు ప్రతి ఒక్కరిని కదిలించింది. పైగా బ్రో నీకేంకాదు అంటూ..ధైర్యం చెబుతూ పోస్టులు వెల్లువెత్తాయి
Read More
4

'అప్పటికి బంగారం ధరలు భారీగా పడిపోతాయ్‌'

ప్రస్తుతం బంగారం ధరలు(Gold price) రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది పుత్తడి ధరలు పడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2026 ద్వితీయార్థంలో బంగారం ధర గణనీయంగా తగ్గే అవకాశముందని ఏఎన్‌జెడ్‌ (ANZ) బ్యాంక్ అంచనా వేసింది. 2026 జూన్ నాటికి బంగారం ధర ఔన్స్‌కు 4,400 డాలర్లకు చేరే అవకాశం ఉంది. అయితే, ఆ తర్వాత ఈ ఏడాది రెండో భాగంలో ధరలు పడిపోవొచ్చని ఏఎన్‌జెడ్‌ అంచనా వేసింది.
Read More
5

ఆఫీస్‌ బాయ్‌ నుంచి సీఈవో రేంజ్‌కి..! ఏకంగా డిజైన్‌ దిగ్గజం కాన్వాతో..

ఒకప్పుఒకప్పుడూ ఒక ప్రముఖ సాఫ్టవేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ఆఫీస్‌ బాయ్‌గా కంప్యూటర్లను క్లీన్‌ చేసేవాడు. ఆ తర్వాత వాటితో పనిచేసే స్థాయికి చేరుకుని..ప్రోఫెషన్‌ డిజైనర్‌గా మారాడు. ఇంతలో మహమ్మారి తన ఆశలపై చన్నీళ్లు జల్లి గ్రామంలో కూర్చొబెట్టింది. అయినా సరే ..అక్కడ నుంచి వ్యవస్థాపకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి..అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ డిజైన్‌ దిగ్గజంతో పోటీపడే స్థాయికి చేరుకుని శెభాష్‌ అనిపించు
Read More
6

అంబానీ వంటింట్లో ప్రాధాన్యత పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?

పండుగలు, పబ్బాలు అనగానే పూజలు, పిండివంటలు గుర్తుకు వస్తాయి. భారతదేశంలో అత్యంత ధనిక కుటుంబం అనగానే మొదటగా రిలయన్స్‌ అంబానీ ఫ్యామిలీ గుర్తు వస్తుంది. మరి అంబానీ కుటుంబంలో వంటలు ఎవరు చేస్తారు? ఫుడ్‌ మెనూ ఎవరు ప్రిపేర్‌ చేస్తారు. అంబానీ ఇంట కిచెన్‌ల ఎవరి ప్రాముఖ్యత ఎంత?
Read More
7

బొట్టు బిళ్లల వ్యాపారం, ఏడాదికి రూ. 20 లక్షలు

రోజువారీ జీవితంలో భాగమైన బొట్టు బిళ్లలను ఫ్యాషన్ ఆభరణాలుగా మార్చి. తన క్రియేటివిటీతో పలువురి సెలబ్రిటీల ఫ్యావరెట్‌గా మారిపోయారు. మిలిటరీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన మేఘన ఖన్నా ఉద్యోగాన్ని వదిలి ఈ వ్యాపారాన్ని ప్రారంచింది. ‘ది బిండి ప్రాజెక్ట్‌’ తో సక్సెస్‌ను అందుకున్నారు. ఉషా ఉతుప్‌, కరీనా, తమన్నా, సోనమ్‌ లాంటి సెలబ్రిటీల మనసు దోచుకున్నారు.
Read More
8

ఇదే ఆఖరి ఛాన్స్‌

టీమిండియాతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టీమిండియా టాప్‌ ప్లేయర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఆస్ట్రేలియాలోని అభిమానులకు ఇది ఆఖరి అవకాశమని కమిన్స్‌ అన్నాడు. దీంతో మరోసారి రో- కో రిటైర్‌మెంట్‌ హాట్‌టాపిక్‌గా మారింది.
Read More
9

సాక్షి మీడియాపై కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్‌ కుట్రలు

సాక్షి మీడియాపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డికి ఏపీ పోలీసులు వరుసగా నోటీసులు ఇచ్చారు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు.. ఒకే కేసులో వరుసగా నోటీసులు ఇచ్చి బెదిరించేందుకు యత్నిస్తున్నారు.
Read More
10

170 మంది మావోయిస్టుల లొంగుబాటు: అమిత్‌ షా

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భారీ సంఖ్యలో మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెడుతున్నారని హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఈరోజు(గురువారం, అక్టోబర్‌ 16వ తేదీ) చత్తీస్‌గఢ్‌లో 170 మంంది మావోయిస్టులు లొంగిపోయిన విషయాన్ని ఆయన తెలిపారు.
Read More
11

ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న అభిషేక్‌ శర్మ

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సెప్టెంబర్‌ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం కుల్దీప్‌ యాదవ్‌, బ్రియాన్‌ బెన్నెట్‌ కూడా పోటీ పడ్డారు. ఓటింగ్‌ అనంతరం అభిషేక్‌ విజేతగా నిలిచాడు. అభిషేక్‌ సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేశాడు. అభిషేక్‌ ప్రదర్శనల కారణంగా భారత్‌ ఆసియా కప్‌ను సునాయాసంగా గెలుచుకుంది.
Read More
12

మంత్రి కొండా సురేఖకు బిగ్‌ షాక్‌?

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశం ఉంది. దేవాదాయ శాఖ నుంచి కొండా సురేఖను తప్పించే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌తో సురేఖ భేటీ..
Read More
13

టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి ఝలక్‌

కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆయన భర్త శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీనియర్లు లేరు.. తొక్కా లేదన్న శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముస్లిం మైనార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు ఎగురవేశారు. పార్టీకి మొదటి నుంచీ సేవలందించిన వారిని పక్కన పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడపలోని పలువురు...
Read More
14

బిగ్‌బాస్‌ 'ఆయేషా'పై ప్రేమికుడి సంచలన ఆరోపణ తెలుసా?

‌ఆయేషా రెండుసార్లు నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ వివాహ జీవితంలో అడుగుపెట్టలేదు. మొదట హరన్ రెడ్డిని ప్రేమించింది. అతను ఫ్యాషన్‌ ఫోటోగ్రాపర్‌గా సినిమా పరిశ్రమలోనే కొనసాగాడు. కొన్ని ప్రాజెక్ట్‌లకు వారిద్దరూ కలిసి కూడా పనిచేశారు. అయితే, అతను తనను ప్రేమిస్తూనే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న ఆయేషా బ్రేకప్‌ చెప్పింది. ఈ క్రమంలో ఆమె మొదటి ప్రేమికుడు సంచలన ఆరోపణలు ఇలా చేశారు...
Read More
15

రూ.1000 తగ్గిన వెండి, అక్కడ మాత్రం పెరిగిన బంగారం!

అక్టోబర్ ప్రారంభం నుంచి దాదాపు పెరుగుతూ ఉన్న ధరలు ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెండి ధర మాత్రం రూ. 1000 తగ్గింది. దీంతో దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోని గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో పసిడి కొత్త ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.
Read More
16

తెలంగాణ సర్కార్‌కు బిగ్‌ షాక్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్‌ షాక్‌ తగిలింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్ల జీవో నెంబర్-9పై తెలంగాణ హైకోర్టు స్టేను రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎస్టీ ప్రాంతాల్లోనే రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు ఉన్నాయి కదా అని ప్రశ్నించింది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని..
Read More
17

విరాట్‌ కోహ్లి ఆసక్తికర ట్వీట్‌..

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి వ‌న్డే భవిష్య‌త్తుపై సందిగ్ధం కొన‌సాగుతోంది. ఆసీస్‌తో వ‌న్డేల‌కు కోహ్లి ఎంపికైన‌ప్ప‌టికి ప్ర‌పంచ‌క‌ప్‌-2027లో ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. త‌న రిటైర్మెంట్ వార్త‌ల నేప‌థ్యంలో కోహ్లి ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశాడు. "ఎప్పుడైతే మీరు ఓ పనిని మధ్యలోనే వదిలేయాలని నిర్ణయించుకుంటారో.. అప్పుడు మీరు నిజంగా విఫ‌ల‌మైన‌ట్లే" ఎక్స్‌లో కోహ్లి రాసుకొచ్చాడు.
Read More
18

ట్రంప్‌కు కేంద్రం కౌంటర్‌

ఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ నిలిపివేస్తోందని, ఇందుకుగానూ భారత ప్రధాని మోదీ తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన నేపథ్యంలోనే రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కూడా. ఈ దరిమిలా కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. మోదీ ట్రంప్‌కు అలాంటి హమీ ఇచ్చారా? అనే విషయంపై..
Read More
19

బిడ్డ సంచలన ఆరోపణలపై స్పందించిన కొండా మురళి

వరంగల్‌: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓస్డీ(మాజీ) సుమంత్‌ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతను మంత్రి ఇంట్లోనే తలదాచుకుని ఉంటాడని భావించిన పోలీసులు గత రాత్రి సోదాలకు సిద్ధపడ్డారు. అయితే వాళ్లను అడ్డుకుని సురేఖ కూతురు సుస్మిత వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో తమ కుటుంబాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి టార్గెట్‌ చేశారంటూ సంచలన ఆరోఫణలపై దిగింది. అయితే తన బిడ్డ మాట్లాడిందాంట్లో..
Read More
20

నకిలీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం

విజయవాడ: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు జనార్ధన్‌ రావు కుటుంబానికి చెందిన వైన్‌షాప్‌ను అధికారులు సీజ్‌ చేశారు. పూర్ణ చంద్రరావు అనే వ్యక్తి పేరు మీద ఉన్న శ్రీనివాస వైన్స్‌లో నకిలీ మద్యం అమమకాలు జరిగాయని.. జనార్దనే వాటిని సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో..
Read More
21

యూట్యూబ్ డౌన్!.. స్పందించిన కంపెనీ

బుధవారం సాయంత్రం యూట్యూబ్ (Youtube) వినియోగించడంలో అంతరాయం ఏర్పడింది. సుమారు 3,20,000 మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు డౌన్‌డెటెక్టర్ (Downdetector) వెల్లడించింది. దీనిపై సంస్థ స్పందించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More
22

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీపి కబురు.. చిగురించిన ఆశలు

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. 2026 సంవత్సరం వేతన పెంపు కోసం ఉద్యోగుతల వార్షిక పనితీరు మూల్యాంకన చక్రాన్ని (annual performance review cycle) ప్రారంభించింది. దీంతో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జీతాల పెంపుపై (salary hike) ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అక్టోబర్ 17లోగా స్వీయ అంచనాలను సమర్పించాల్సిందిగా కంపెనీ సిబ్బందిని కోరింది.
Read More
23

రైల్లో వెళ్లి కొంటే వెండి రూ. 14 వేలు ఆదా!

వెండి, బంగారం మాట ఎత్తాలంటేనే బెంబేలెత్తేపరిస్థితి. సామాన్య మానవులే కాదు, ధనవంతులు కూడా గోరెడు బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి. కానీ వెండి ధరలపై ఫుడ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ నళిని ఉనగర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. ఈ నగరాల మధ్య రైల్లో వెళ్లి వెండి కొంటే 14 వేలు ఆదా అవుతాయని పేర్కొంది. దీంతో వైరల్‌ గామారింది.
Read More
24

మొరింగా సాగుతో.. ఏడాదికి రూ. 40 ల‌క్ష‌లు

వ్యవసాయం చేయడం అంటే మాటలుకాదు. చెమటలు చిందించాలి. ఆను పాను తెలియాలి. ఏ పంటకు ఎలాంటి చీడపీడలు వస్తాయి, వాటికి పరిష్కారం ఏమిటి అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. అలా కర్ణాటకకు చెందిన ఒక రైతు అ‍ద్భుతాలు సాదించాడు. ఏడాదికి 40 లక్షల రూపాయల ఆదాయంతో ఔరా అనిపించుకున్నాడు.
Read More
25

ఆ కారణంతోనే ఐశ్వర్యని వెనక్కినెట్టి.. సుస్మితా మిస్‌ ఇండియాగా గెలుపొందింది..!

అందాల పోటీకి సంబంధించి భారత్‌కి.. 1994 అతి ప్రాధాన్యత సంతరించుకున్న ఏడాది. ఎందుకంటే ఆ ఏడాదే ప్రతిష్టాత్మకమైన మిస్‌ యూనివర్స్‌, మిస్‌ వరల్డ్‌ కిరీటాలు రెండూ దక్కాయి. 28 ఏళ్ల తర్వాత రీటా ఫారియా తదనంతరం ఇద్దరు సుందరీమణులు ఈ ఘనతను దక్కించుకున్నారు. ఐశ్వర్య రాయ్‌, సుస్మితా సేన్‌ ఆ ఘన కీర్తిని భారత్‌కు అందించారు. దేశమే గర్వించేలా చేశారు. అయితే వీళ్లిద్దరూ మిస్‌ ఇండియా ఫైనల్లో తలపడ్డాడరు. కానీ కిరీటం సుస
Read More
26

44 కిలోల బరువు తగ్గిన ఫిట్‌నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్‌లాస్‌ పాఠాలు..

ఆరోగ్యకరమైన జీవినశైలి బరువు తగ్గడానికి సంబంధించి..తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్‌ కారణంగానే చాలామంది వెయిట్‌లాస్‌ కాలేకపోతుంటారని చెబుతున్నాడు ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ యష్‌ వర్ధన్‌ స్వామి. కొందరు విఫల ప్రయత్నం చేసి విసిగిపోయినవాళ్లు కూడా ఉన్నారని అంటున్నాడు. తాను ఒకప్పుడు అధిక బరువు ఉండేవాడనని, ఇప్పుడు వెయిట్‌లాస్‌ అయ్యి ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాని కూడా చెప్పారు.
Read More
27

టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గెలవాల్సిన మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. ఆసీస్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజ్‌ల్లో 5 శాతం కోత విధించారు. నిర్దేశిత సమయంలోగా భారత బౌలర్లు ఓ ఓవర్‌ వెనకపడి ఉన్నారు.
Read More
28

తొలి తెలుగు సింగర్‌ బాలసరస్వతి కన్నుమూత

చలనచిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగులో తొలి మహిళా సింగర్‌ రావు బాలసరస్వతి దేవి (97) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం (అక్టోబర్‌ 15) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బాలసరస్వతి.. స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. 1928లో పుట్టిన ఆమె ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టారు. మొదటగా..
Read More
29

ఆ చాటింగ్‌ నాది కాదు: జోగి రమేష్‌

తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్‌రావుతో తనకు సంబంధాలు ఉన్నాయన్న ప్రచారాన్ని మాజీ మంత్రి జోగి రమేష్‌ మరోసారి ఖండించారు. బుధవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంబంధాలున్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని..
Read More
30

గిల్‌.. ఇప్పటికీ అవే వాడుతున్నాడు: సూర్యకుమార్‌

టీమిండియా ప్రస్తుత టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు ‘మూఢనమ్మకం’ ఒకటి ఉందట. భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. ‘‘జట్టులో అందరికంటే భిన్నమైన రంగులో ఉన్న ప్యాడ్లను గిల్‌ ధరిస్తాడు. అతడి ప్యాడ్స్‌ రంగు లేత నీలం రంగులో ఉంటుంది’’ అని సూర్య తెలిపాడు. వాటిని ధరించిన నాటి నుంచి పరుగుల వరద కొనసాగుతోంది కాబట్టే ఇలా చేస్తున్నాడని పేర్కొన్నాడు.
Read More
31

ధన త్రయోదశికి ముందే అంతులేని ధరలు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ​మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. అక్టోబర్‌ 18న ధన త్రయోదశికి ముందు పసిడి ధరల ఇలా భారీగా పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.
Read More
32

చెవిరెడ్డి పిటిషన్‌.. ఏపీ హైకోర్టు తీర్పు కొట్టివేత

ఢిల్లీ: అక్రమ మద్యం కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలేవరకు.. ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించవద్దన్న తీర్పును బుధవారం కొట్టేసింది. బెయిల్ రద్దు, బెయిల్‌ పిటిషన్లను మెరిట్ ఆధారంగా నిర్ణయించాలని ఈ సందర్భంగా హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచింది. అక్రమ మద్యం కేసులోచెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్..
Read More
33

జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం కొనసాగుతున్న సస్పెన్స్‌కు బీజేపీ తెర దించింది. అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి పేరును బుధవారం ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే.. ఈసారి ఈ ఎన్నికను కచ్చితంగా గెలవాల్సిన పోరుగా భావిస్తున్న బీజేపీ..
Read More
34

పీకే సంచలన నిర్ణయం

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి భారీ విజయం దక్కనుందని ఆయన చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇక నుంచి తాను పార్టీలో సంస్థాగత పనులు మాత్రమే చూసుకుంటానని తెలిపారాయన. అంతేకాదు.. తేజస్వి యాదవ్‌పై పోటీ చేయబోతున్నట్లుగా ..
Read More
35

టైమ్‌.. ఇదేం బాగోలేదు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పట్టరాని కోపం వచ్చింది. తను గురించి పొడుగుతూ టైమ్‌ మ్యాగజైన్‌ రాసిన కథనం అందుకు కారణం. అలాగని కథనం బాగోలేదని కాదు. అది కొంత వరకు బాగానే ఉందంటూ ఆయన కాంప్లిమెంట్‌ ఇచ్చాడు కూడా. మరి ఎక్కడ బెడిసి కొట్టింది?. ఆయనకు ‘చెత్త’ అంటూ అంతగా కోప్పడటానికి గల కారణం ఏంటంటే..
Read More
36

‍గంభీర్‌ కరెక్ట్‌: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) చేసిన ‘సిగ్గుచేటు’ వ్యాఖ్యలపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా (Rajeev Shukla) స్పందించాడు. గంభీర్‌ సరిగ్గానే మాట్లాడానని సమర్థించిన అతడు.. యువ ఆటగాడి పట్ల సీనియర్ల ప్రవర్తన సరికాదని పేర్కొన్నాడు.
Read More
37

‘ఆ భయంతోనే చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు’

నకిలీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా బరితెగించి వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పులు మీద తప్పులు చేస్తూ కూడా అడ్డగోలుగా బుకాయిస్తున్నారని విమర్శించారు.
Read More
38

బస్సులో చెలరేగిన మంటలు .. 12మంది సజీవ దహనం?

జస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం (అక్టోబర్‌14)జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న ప్రైవేట్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 10 నుంచి 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
Read More
39

ఒత్తిడిలో ఉన్నపుడు హెల్ప్‌ అడగడం బలహీనత కాదు: సారా అలీఖాన్‌

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ మరోసారి మానసిక ఆరోగ్యం ఒత్తిడి, చికిత్స లాంటి విషయాలను గురించి మాట్లాడింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా సులభం అని చెప్పిన సారా అలీ ఖాన్ మానసికంగా ఒత్తిడిలో ఉన్నపుడు సాయం అడగడంలో తప్పు లేదనీ, అది బలహీనతగా భావించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అంతేకాదు మీరు చేయాల్సిందల్లా ఒక క్షణం ఊపిరి పీల్చుకుని, మీకు మీరు ఏడ్చేస్తే భారం తగ్గుతుందని వెల్లడించింది.
Read More
40

ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..

కొన్ని దేశాల్లో ఉండే ఆచారాలు ఎంతలా వింతగా ఉంటాయంటే..వినడానికి నమ్మశక్యం కానంతగా ఉంటాయి. ఇవేమి పద్ధతులు..ఎందుకిలా అని ఆరా తీసినా..వాటి వివరణ సైతం నోరెళ్లబెట్టేలా ఉంటుంది. అచ్చం అలాంటి విచిత్రమైన సంస్కృతే ఇండోనేషియాలోని ఓ తెగ ఆచరిస్తుంది. ఆ కారణంగానే వార్తల్లో నిలిచింది కూడా. అంతేకాదండోయ్‌ దాన్ని చూసేందుకు పర్యాటకులు సైతం ఎగబడుతున్నారు. పైగా అలాంటి థ్రిల్‌ కావలంటూ.. మరి వస్తున్నారట టూరిస్టులు.
Read More
41

వాట్‌ క్రెడిట్‌ కార్డుతో గిన్నిస్‌ రికార్డు? ఖర్చు మాత్రమే కాదు ఆదాయ కూడా..

సాహసకృత్యాలతోనే కాదు స్మార్ట్‌గా కూడా గిన్నిస్‌ రికార్డులు సృష్టించొచ్చని నిరూపించాడు ఈ వ్యక్తి. అందరూ స్మార్ట్‌ కార్డులు ఖర్చుపెట్టడానికి ఉపయోగిస్తే..ఆయన దాన్ని ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. అది ఎంతలా అంటే..రోజు మొత్తం క్రెడిట్‌ కార్డు లేకుండా పని కాదన్నంత రేంజ్‌లో. అలా ఏకంగా ఎ‍న్ని క్రెడిట్‌ కార్డులు ఉపయోగిస్తున్నాడో తెలిస్తే కంగుతింటారు.
Read More
42

చరిత్ర సృష్టించిన ధ్రువ్‌ జురెల్‌

టీమిండియా యువ క్రికెటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (Dhruv Jurel) అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం నుంచి ఇప్పటికి వరుసగా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్ కుమార్‌ (Bhuvneshwar Kumar) పేరిట ఉండేది. వెస్టిండీస్‌తో రెండో టెస్టు (IND vs WI 2nd Test) సందర్భంగా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు.
Read More
43

ఎన్టీఆర్‌ వార్-2.. ఓటీటీలో క్రేజీ రికార్డ్

యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వార్-2((War2 Movie)). ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీలో హృతిక్ రోషన్‌ కూడా నటించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా మెప్పించింది.
Read More
44

ఈ దీపావళికి లక్ష్మీపూజ ఇలా చేస్తే..ధనమే ధనం

దీపావళి అంటే దివ్యమైన పండుగ. చీకట్లను పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించే జ్యోతికి మొక్కే పండగ. దీపావళి రోజు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రధాన ఆచారంగా పాటిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కష్టాలన్నీ తొలగిపోయి, నిత్యం తమ ఇంట లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుందని విశ్వసిస్తారు.
Read More
45

ఈ ఏడాది స్పెషల్‌ దివాలీ : ఎపుడు? ఎలా జరుపుకోవాలి?

చిన్నా పెద్దా అంతా ఏంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ దీపావళి (Diwali 2025). ఆశ్వీయుజ అమావాస్య నాడు వచ్చే, వెలుగు దివ్వెల పండుగ.ఈసారి గ్రహాల అద్భుతమైన కలయిక అని, చాలా ఏళ్ల తరువాత వచ్చే ఈ కలయికే ఈ దీపావళి ప్రత్యేకత అని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు.
Read More
46

ఎల్లలు దాటిన ప్రేమ.. గ్రామస్తుల సమక్షంలో వైభవంగా

తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని ముత్తు పెట్టి సమీపంలోని కరయంగడు గ్రామానికి చెందిన సోమసుందరం. ఇతని భార్య వాసుకి కుమారుడు యోగాదాస్, ఇండోనేషియాలోని డయానా టీపును ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని తమిళనాడు ఆలయంలో గ్రామస్తుల సమక్షంలో వైభవంగా జరిగింది.
Read More
47

ఓటీటీలోకి 'దృశ్యం' దర్శకుడి కొత్త థ్రిల్లర్ సినిమా

'దృశ్యం' ఫ్రాంచైజీతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జీతూ జోసెఫ్ తీసిన లేటెస్ట్ మలయాళ సినిమా 'మిరాజ్'. ఇప్పుడు దీని ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?
Read More
48

Bihar: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ తొలి జాబితా విడుదల చేసింది. 71 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం(అక్టోబర్‌ 14వ తేదీ) తమ అభ్యర్థుల జాబితా రిలీజ్‌ చేసింది బీజేపీ. ఈ జాబితాలో 9 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది బీజేపీ.
Read More
49

హర్షిత్‌ రాణాపై విమర్శలు.. గంభీర్‌ సీరియస్‌

ఆస్ట్రేలియా టూర్‌కు హ‌ర్షిత్ రాణాను ఎంపిక చేయ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. గంభీర్ స‌పోర్ట్‌తోనే అత‌డికి ఎక్కువ‌గా అవకాశాలు ద‌క్కుతున్నాయ‌ని మాజీ క్రికెట‌ర్లు అశ్విన్‌, కృష్ణమచారి శ్రీకాంత్ ఫైరయ్యారు. వారిద్దరికి గంభీర్ కౌంటరిచ్చాడు. మీ యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం 23 ఏళ్ల యువ క్రికెటర్‌ను టార్గెట్ చేయడం సరికాదని మండిపడ్డాడు. అతడు కష్టపడి ఈ స్ధాయికి వచ్చాడని గౌతీ పేర్కొన్నాడు.
Read More
50

మావోయిస్టులకు బిగ్‌ షాక్‌

గచ్చిరోలి: మావోయిస్టు పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేత మల్లోజుల వేణుగోపాల్‌ రావు అస్త్ర సన్యాసం చేశారు. 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయారు. ఇటీవలె అధినాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన లేఖ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.ఈ తరుణంలో ఆయుధాలను అప్పగించాలంటూ ఆయనకు మావోయిస్టు పార్టీ అల్టిమేటం జారీ చేసింది. ఈలోపే..
Read More