చంద్రబాబు, మంత్రులకు పవన్ కృతజ్ఞతలు

చంద్రబాబు, మంత్రులకు పవన్ కృతజ్ఞతలు - Sakshi


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన కృతజ్ఞతా సందేశాన్ని ప్రజలకు అందించారు.



రాజధాని నిర్మాణంలో భూసేకరణ ఆపే దిశగా అడుగులు వేస్తున్నందుకు రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, ఇతర మంత్రివర్గ సభ్యులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా, రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు.


 

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top