తల్లీ కూతుళ్లతో సంబంధం.. కథ సమాప్తం | Sakshi
Sakshi News home page

తల్లీ కూతుళ్లతో సంబంధం.. కథ సమాప్తం

Published Tue, Sep 15 2015 3:25 PM

తల్లీ కూతుళ్లతో సంబంధం.. కథ సమాప్తం - Sakshi

కర్నూలు: ఒకే సమయంలో తల్లీ కూతుళ్లతో వివాహేతర సంబంధాలు నడిపిన వ్యక్తి హతమయ్యాడు. కర్నూలు వెంకటరమణ కాలనీలో ఇటీవల జరిగిన హత్య వెనుక ఉన్న దారుణ కోణం ఇది. మృతుడు నాగశేషుడు(50) స్థానికంగా ఓ మహిళతోపాటు, ఆమె కుమార్తెతోనూ వివాహేతర సంబంధం నడిపాడు. అయితే అది బయటపడడంతో అతడి కథ ముగిసినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశ్‌నగర్‌కు చెందిన నాగశేషుడుకి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే అతడు స్థానికంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెకు తెలియకుండా ఆమె కుమార్తెతోనూ అదే బంధాన్ని పెట్టుకున్నాడు.

అయితే ఇన్నాళ్లూ గుట్టుగా సాగిన ఆ బంధాలు సోమవారం బట్టబయలయ్యాయి. దీంతో ఆ తల్లీ కూతుళ్లిద్దరూ కలిసి నాగశేషుడ్ని సోమవారం రాత్రి హత్య చేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి కిలోమీటరు దూరంలో కంప చెట్లలో పడేసి, కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంగళవారం ఉదయం హత్య సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా ఈశ్వరమ్మ, ఆమె కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రవికృష్ణ పరిశీలించారు.

Advertisement
Advertisement