'సింగరేణిలో కేంద్రం వాటా కొనుగోలుకు యత్నం'
సింగరేణి గనులపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: సింగరేణి గనులపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తిని 65 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలని ఆదేశించారు. విదేశాల్లో బొగ్గు గనులను సింగరేణి లీజుకు తీసుకునే విషయాన్ని అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించనున్నట్టు ప్రకటించారు.
సింగరేణిలో కేంద్రం వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాదికల్లా 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల పూర్తికి కేసీఆర్ ఆదేశించారు. సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్, డిపెండెంట్ ఉద్యోగాలను, డిస్మిస్ అయిన ఉద్యోగులకు తిరిగి ఉద్యోగాలివ్వాలని సమావేశంలో నిర్ణయంలతో నిర్ణయం తీసుకున్నారు.


