తెలంగాణకు చంద్రబాబు అన్యాయం చేశాడు
ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
మెదక్: ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు అదే వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు చంద్రబాబు విద్యుత్ రాకుండా అడ్డుకుంటున్నారని హరీష్ రావు అన్నారు.


