తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరికీ మాటలు తడబడుతున్నాయి. అతి ఆవేశానికి పోయి ఏం చెబుతున్నామో కూడా మర్చిపోతున్నారు. 'సైకిల్ గుర్తుకు ఓటేస్తే.. మనకు మనం ఉరేసుకున్నట్లే' అని స్వయంగా పార్టీ యువ నాయకుడు, అధినేత కుమారుడు నారా లోకేష్ బాబు.. అలియాస్ ట్విట్టర్ బాబు చెప్పాడు. మైకు పట్టుకుని వీరావేశంతో ప్రసంగిస్తూ తెలుగు తమ్ముళ్లందరికీ ఈ విషయాన్ని డప్పుకొట్టి చెప్పాడు. అంతేకాదు, మరో సందర్భంలో ఇదే ట్విట్టర్ బాబు.. ''మతపిచ్చి, కులపిచ్చి, అవినీతి, బంధుప్రీతి.. ఇవన్నీ ఉన్న పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయే. అవునా, కాదా?" అంటూ తిరుపతిలో కార్యకర్తలను అడిగాడు.
కొడుకు ఇలా చెబుతుంటే తాను మాత్రం తక్కువ తిన్నానా అంటూ.. చంద్రబాబు కూడా ఇదే స్థాయిలో గందరగోళానికి గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థి విషయంలో తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. వేదికపై ఉన్నది బీజేపీ అభ్యర్ధా, టీడీపీ అభ్యర్ధా అనే విషయం కూడా తెలియకుండా, వీర్రాజుకు ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాణిక్యాలరావుకు చుక్కలు కనిపించాయి. వెంటనే తేరుకుని చంద్రబాబుకు విషయం తెలియజెప్పారు.
అంతకుముందు లోకేష్కు పిల్లనిచ్చిన మామ, మేనమామ బాలకృష్ణ సైతం ఆవేశంలో వీరిద్దరికీ ఏమాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని ఘంటాపథంగా శ్రీకాకుళంలో వాకృచ్చారు. అది విన్న కార్యకర్తలు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు.. అగ్రనాయకులే ఇలా ఉంటే ఇక నియోజకవర్గ స్థాయి నాయకులు తాము కూడా అలాగే ఉంటామంటున్నారు. తొలుత కాంగ్రెస్ నుంచి జై సమైక్యాంధ్ర పార్టీలోకి వెళ్లి, అక్కడినుంచి టీడీపీలోకి మారిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇటీవల ఏలూరులో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అత్యధిక సంఖ్యలో గెలుచుకుంటుంది అంటూ అందరికీ చెప్పసాగారు. ఇంతలో పక్కవాళ్లు అందించడంతో.. 'కాంగ్రెస్ అనేశానా.. పొరపాటు అయిపోయింది' అంటూ నాలుక కరుచుకున్నారు.
సైకిల్కు ఓటేస్తే.. ఉరేసుకున్నట్లే: లోకేష్
Published Sat, May 3 2014 4:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement