దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయిల్లో ముగిశాయి. 51.15 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ అత్యంత కీలకమైన మైలురాయి 10వేలకు చేరువలో 9,966 వద్ద క్లోజైంది.
10వేల మైలురాయికి కాస్తంత దూరమే..
Jul 24 2017 3:55 PM | Updated on Sep 5 2017 4:47 PM
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయిల్లో ముగిశాయి. 51.15 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ అత్యంత కీలకమైన మైలురాయి 10వేలకు చేరువలో 9,966 వద్ద క్లోజైంది. 10వేల మార్కుకు దగ్గరగా వెళ్లిన నిఫ్టీ, ఆ మార్కును మాత్రం చేధించలేకపోయింది. సెన్సెక్స్ సైతం 216.98 పాయింట్లు జంప్ చేసి, రికార్డు స్థాయిలో 32,245 వద్ద స్థిరపడింది. పీఎస్యూ బ్యాంకు, ఐటీ షేర్లు లాభాల జోరు కొనసాగించడంతో నిఫ్టీ 10వేలకు దగ్గర్లోకి పయనించింది. టాప్ గెయినర్గా భారతీ ఎయిర్టెల్ మార్కెట్లో మంచి లాభాలను ఆర్జించింది. భారతీ ఎయిర్టెల్తో పాటు విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు నేటి మార్కెట్లో లాభాలు పండించాయి.
మరోవైపు టాప్ లూజర్లుగా డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంకు, వేదంతా కంపెనీల షేర్లు నష్టాలు గడించాయి. ప్రారంభంలోనే నిఫ్టీ, బ్యాంకు సూచీలు రికార్డు స్థాయిలోకి ఎగిశాయి. అనంతరం ఆ జోరును అలానే కొనసాగిస్తూ వచ్చాయి. నిఫ్టీ సూచీ 62 పాయింట్లు పైగి ఎగిసి సరికొత్త గరిష్ట స్థాయి 9,977.65ను తాకింది. సెన్సెక్స్ కూడా 246 పాయింట్లు జంప్చేసిన 32,274.89 వద్ద ఆల్టైమ్ హైను నమోదుచేసింది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలహీనపడి 64.39గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా 42 రూపాయలు పెరిగి 28,583గా నమోదయ్యాయి.
Advertisement
Advertisement