ఫ్లోర్ లీడర్‌గా వైఎస్‌ జగన్మోహన రెడ్డి | YS Jagan Mohan Reddy as YSRCP Floor leader | Sakshi
Sakshi News home page

ఫ్లోర్ లీడర్‌గా వైఎస్‌ జగన్మోహన రెడ్డి

Jun 18 2014 1:02 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్మోహన రెడ్డి - Sakshi

వైఎస్ జగన్మోహన రెడ్డి

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లెజస్లేచర్ పార్టీ కమిటీ నియామకం జరిగింది. ఫ్లోర్ లీడర్‌గా వైఎస్‌ జగన్మోహన రెడ్డిని ఎంపిక చేశారు.

హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లెజస్లేచర్ పార్టీ  కమిటీ నియామకం జరిగింది.  ఫ్లోర్ లీడర్‌గా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, పి.రాజన్నదొర, ముత్యాల నాయుడులను నియమించారు.  కార్యదర్శులుగా సుజయకృష్ణ రంగారావు, జలీల్‌ఖాన్, నారాయణస్వామి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, రోజాలను ఎంపిక చేశారు. వైఎస్‌ఆర్ సీపీ విప్‌గా అమర్నాథరెడ్డిని,  కోశాధికారులుగా కోన రఘుపతి, చాంద్‌ బాషాలను నియమించారు.

 కార్యనిర్వాహక సభ్యులు:  అనిల్‌ యాదవ్, కంబాల జోగులు, గౌరు చరితారెడ్డి, ముస్తఫా, పోతుల రామారావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, సర్వేశ్వరరావు, కలమట వెంకటరమణ, విశ్వేశ్వరరెడ్డి.

సమన్వయకర్తలు: శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, ఏ.సురేష్లను నియమించారు.

అధికార ప్రతినిధులు: జ్యోతుల నెహ్రూ, జి.శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రోజా

పార్టీ సమన్వయకర్తలు: ఎంవి మైసూరారెడ్డి, డిఏ సోమయాజులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తమ్మినేని సీతారామ్, అంబటి రాంబాబు.

  ప్రతిపాక్ష పాత్ర అంటే వైఎస్ఆర్ సిపి అనేలా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు చెప్పారు. డిప్యూటి స్పీకర్‌ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని ఆయన కోరారు. అయితే ఈ నిర్ణయాన్ని అధికార పార్టీ విజ్ఞతకే వదిలేస్తామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement