నారా లోకేష్
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మీడియాపై రుసరుసలాడారు.
విజయవాడ: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మీడియాపై రుసరుసలాడారు. విలేకరులు రైతుల రుణాల మాఫీ విషయం ప్రస్తావించగా అది తనకు సంబంధం లేదంటూ తప్పుకున్నారు.
ఎన్నికల్లో ప్రచారం చేశారుగదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. రుణమాఫీ ప్రభుత్వం, ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం అని చెప్పారు. రుణమాఫీ విషయం తనను అడగొద్దంటూ లోకేష్ అసహనం వ్యక్తం చేశారు.


