ఆ మూడు జిల్లాలకే ప్రాధాన్యతా? | Sakshi
Sakshi News home page

ఆ మూడు జిల్లాలకే ప్రాధాన్యతా?

Published Sun, Jul 13 2014 11:55 AM

ఆ మూడు జిల్లాలకే ప్రాధాన్యతా? - Sakshi

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని, అభివృద్ధి, కేంద్ర సంస్థల ఏర్పాటులో కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లా ప్రయోజనాల గురించి అధికారపక్ష ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదని విమర్శించారు. రాజధాని సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటినీ గుంటూరు, విజయవాడ, విశాఖ ప్రాంతాలకే పరిమితం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు కనిపిస్తోందని చెప్పారు.

Advertisement
Advertisement