Top Stories
ప్రధాన వార్తలు
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో శశాంక్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. 262 పరుగుల భారీ లక్ష్య చేధనలో కేకేఆర్ బౌలర్లను శశాంక్ ఊచకోత కోశాడు.జానీ బెయిర్ స్టోతో కలిసి మ్యాచ్ను శశాంక్ మ్యాచ్ను ఫినిష్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన శశాంక్ కేవలం 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 68 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. శశాంక్ సింగ్ ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదెక్కడి విధ్వంసం.. తన లాంటి ఆటగాడు భారత జట్టులో ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంతకుముందు కూడా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ను శశాంక్ గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ 262 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.దీంతో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ బ్యాటర్లలో బెయిర్స్టో( పాటు శశాంక్ సింగ్( 68 నాటౌట్), ప్రభుసిమ్రాన్ సింగ్(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. SHASHANK SINGH, THE FINISHER. 🫡- The consistency of an Indian uncapped player is remarkable. pic.twitter.com/bJpfOj4PsL— Johns. (@CricCrazyJohns) April 26, 2024
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీ20 క్రికెట్లో పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ వరల్డ్ రికార్డు సాధించింది. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 262 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన పంజాబ్.. ఈ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.262 పరుగుల భారీ టార్గెట్ను పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. గతేడాది వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 259 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తాజా మ్యాచ్తో సౌతాఫ్రికా రికార్డును పంజాబ్ కింగ్స్ బ్రేక్ చేసింది. కాగా ఐపీఎల్లో కూడా ఇదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డు రాజస్తాన్ రాయల్స్ పేరిట ఉండేది. 2020 ఐపీఎల్ సీజన్లో పంజాబ్పై 224 పరుగుల టార్గెట్ను ఛేదించింది.ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 48 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో.. 8 ఫోర్లు, 9 సిక్స్లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శశాంక్ సింగ్ (28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్స్లతో 68 పరుగులు), ప్రభుసిమ్రాన్ సింగ్(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోర్ సాధించింది.కేకేఆర్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(75), సునీల్ నరైన్(71) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. వెంకటేశ్ అయ్యర్(39), శ్రేయస్ అయ్యర్(28) పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు, రాహుల్ చాహర్, సామ్ కుర్రాన్ తలా వికెట్ పడగొట్టారు.
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 262 పరుగుల భారీ లక్ష్య చేధనలో బెయిర్ స్టో.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశాడు.ఈ క్రమంలో బెయిర్ స్టో.. కేవలం 45 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఫాస్టెస్ సెంచరీ చేసి బెయిర్ స్టోకు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఇక ఓవరాల్గా ఈ మ్యాచ్లో 48 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో.. 8 ఫోర్లు, 9 సిక్స్లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.కాగా అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా పంజాబ్ 262 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ బ్యాటర్లలో బెయిర్స్టోతో పాటు శశాంక్ సింగ్ (28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్స్లతో 68 పరుగులు), ప్రభుసిమ్రాన్ సింగ్(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
ఈటలా.. నువ్వే గెలుస్తావ్.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కాకరేపుతున్నాయి. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మల్లారెడ్డిలు ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. ఈటలను చూసిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన వద్దకు వెళ్లి నువ్వే గెలుస్తున్నవన్నా అంటూ చేసిన వైరల్గా మారాయి.ఈటలను అలింగనం చేసుకోవడమే కాక, ఫోటో తీయండయ్య అన్న తోటి అంటూ ఉత్సాహంగా ఫొటోలు దిగారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుంచి పట్నం సునితా మహేందర్రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతున్న తరుణంలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి తమ ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటలనే గెలుస్తున్నారంటూ చెప్పడం చర్చాంశనీయంగా మారింది.
లావుకు చుక్కలు చూపిస్తున్నారు!
చంద్రబాబు జిత్తుల గురించి తెలుసుకోకుండా టీడీపీలో చేరినందుకు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇపుడు చుక్కలు కనపడుతున్నాయి. అంతే కాదు కృష్ణదేవరాయాలను నమ్ముకుని టీడీపీలో చేరిన నేతలు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఉస్సూరు మంటున్నారు. టీడీపీలో చేరే ముందు కొన్ని నియోజక వర్గాల అభ్యర్ధులను మార్చేయాలని కూడా కృష్ణ దేవరాయాలు షరతు విధించారట. ఇపుడా అభ్యర్ధులంతా కృష్ణ దేవరాయలు ఎలా గెలుస్తారో తామూ చూస్తాం అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. వాపును చూసి బలుపనుకున్న కృష్ణ దేవరాయలు కూడా ఇపుడు ఆత్మపరిశీలనలో పడ్డట్లు చెబుతున్నారు.2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో నరసరావుపేట ఎంపీగా గెలిచారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆ తర్వాత అయిదేళ్ల పాటు ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణల్లో భాగంగా నరసరావుపేట ఎంపీ స్థానం నుండి బీసీ అభ్యర్ధిని బరిలో దించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆ క్రమంలో లావు కృష్ణ దేవరాయలకు గుంటూరు లోక్ సభ స్థానం ఇస్తామని చెప్పారు. అంతే వెంటనే చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లి కృష్ణ దేవరాయలు నరసరావు పేట లోక్ సభ టికెట్కు బేరం పెట్టారు.తనకు నరసరావుపేట సీటు ఇవ్వడంతో పాటు తాను చెప్పిన వారికి కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని.. తాను చెప్పిన స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను మార్చాలని షరతు పెట్టారట. తాను టీడీపీలోకి వెళ్తూ తనతో పాటు వైఎస్సార్సీపీలోని తన అనుచరులు మక్కెన మల్లికార్జున రావు,జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలో చేర్పించారు. గురజాల అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించి ఆ సీటును జంగాకృష్ణమూర్తికి ఇవ్వాలని లావు డిమాండ్ చేశారు. వినుకొండ అసెంబ్లీ స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును తప్పించి ఆ సీటును తన అనుచరుడు మక్కెన మల్లికార్జునరావుకు ఇవ్వాలని షరతు పెట్టారు. అంతే కాదు జీ.వి.ఆంజనేయులును నరసరావు పేటకు బదలీ చేయాలని సలహా కూడా ఇచ్చారు.నరసరావు పేటలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ ఇవ్వకూడదని పట్టుబట్టారు లావు. అంతే కాదు చిలకలూరి పేట సీటును మాజీ మంత్రి పత్తి పాటి పుల్లారావుకు ఇవ్వద్దని అన్నారట. పెదకూర పాడు సీటును కొమ్మాల పాటి శ్రీధర్ కు కాకుండా వేరే వారికి ఇవ్వాలని సూచించారు. తాను సూచించిన విధంగా అభ్యర్ధులను,నియోజక వర్గాలను మార్చి తన అనుచరులక తాను అడిగిన సీట్లు ఇస్తేనే తాను పార్టీలో చేరతానన్నారట లావు. అన్నీ విన్న చంద్రబాబు నీకెలా కావాలంటే అలాగే చేద్దాం ముందు చేరు అన్నారు. తీరా చేరాక తాను అనుకున్న విధంగా టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. లావు అనుచరులు మక్కెన మల్లికార్జున రావు, జంగా కృష్ణమూర్తిలకు టికెట్లు దక్కలేదు.లావు మార్చమన్న పత్తిపాటి, చదలవాడ అరవింద్,జి.వి.ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాస్లకు టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఇపుడు లావు కృష్ణదేవరాయలు ఎదురీదాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థానాలకే ఎసరు పెట్టాలనుకున్న లావును ఓడించి తీరాలని పత్తిపాటి, చదలవాడ, యరపతినేని, జి.వి.ఆంజనేయులు, కొమ్మాల పాటి శ్రీధర్ శపథాలు చేస్తున్నారు. యరపతినేని అయితే బాహాటంగానే లావు ఎలా గెలుస్తాడో నేనూ చూస్తాను అని సవాల్ చేశారట.ఈ నియోజక వర్గాల్లో లావు ఎన్నికల ప్రచారం చేసినా ఈ నేతలెవరూ ఆయనకు సహకరించడానికి సిద్దంగా లేరు. ఈ ఎన్నికల్లో తమ తమ నియోజక వర్గాల్లో క్రాస్ ఓటింగ్ చేయించి అయినా లావును ఓడిస్తామని వీరు అంటున్నారట. చదలవాడకు టికెట్ ఇవ్వద్దని అనడంతో బీసీ సంఘాల నేతలంతా లావుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారట. మొత్తం మీద వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి అనవసరంగా టీడీపీలోకి వచ్చానని లావు ఇపుడు తన సన్నిహిత వర్గాలతో అంటున్నారట. తాను చెడ్డమే కాకుండా తన అనుచరులు మక్కెన, జంగా కృష్ణమూర్తిల భవిష్యత్తు కూడా నాశనం చేశారని లావుపై జంగా వర్గీయులు మండి పడుతున్నారని సమాచారం. బహుశా ఈ పరిణామాలన్ని చూసేనేమో.. ఆయన ఏపీలో టీడీపీ గెలుపు కష్టమేనంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.
షర్మిల అలవోకగా అబద్దం చెప్పారు: ఏఏజీ పొన్నవోలు
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె మాట్లాడారని విమర్శించారు. ఈ మేరకు తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే వైఎస్సానాడే వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్సార్పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతల ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలిపారు. వైఎస్సార్ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. వైఎస్సార్పై కేసులు పెడుతుంటే చూడలేక..‘మహానుభావుడైన వైఎస్సార్ మీద ఆరోపణలు చేస్తుంటే. అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే అన్యాయమని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబరులో నేను కేసు వేసే నాటికి కనీసం జగన్ను చూడనేలేదు. వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ కేసు పెట్టటం భరించలేక నేను కేసు వేశాను. అప్పటి జీవోలకు, జగన్కు ఏం సంబంధం ఉంది?చదవండి: FactCheck: ఉన్మత్త రాతల రామోజీకి పూనకాలు లోడింగ్!వాస్తవాలు తెలుసుకోవాలి..వైఎస్సార్ను అన్యాయంగా కేసులో ఇరికించారనే బాధతో నేను బయటకు వచ్చాను. ఆయన మీద కేసు పెట్టటం అన్యాయమని నేను వాదించాను. వేరే 14 మందిని బాధ్యలుగా చేయాలని మాత్రమే కేసు వేశాను. ఆ కాపీలను పంపిస్తా, షర్మిల చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఆమె చెప్పినట్టు నేనే వైఎస్సార్ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. సీబీఐ, కాంగ్రెస్ కలిసే వైఎస్ఆర్ను ఇరికించారు. ఇది నేను నిరూపించటానికి సిద్ధం. వైఎస్సార్ను వేధించిన వారికి ఎదురొడ్డి నేను పోరాటం చేశా. అలాంటి నన్ను అభినందించాల్సిందిపోయి నాపై ఆరోపణలు చేయటం ఏంటి?.నాకు ఇచ్చే గౌరవం ఇదేనా..షర్మిల అలవోకగా అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు, భాషనే షర్మిల మాట్లాడారు. మీ రాజకీయాలు ఎలాగైనా చేసుకోండి, కానీ నాపేరు ప్రస్తావించవద్దు. ఈ దుర్మార్గపు క్రీడలో తనను లాగడం దారుణం. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధం కోసం నన్ను లాగడమేంటి?’ అంటూ ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
IPL 2024: ముంబై ఇండియన్స్ ఓపెనర్గా జస్ప్రీత్ బుమ్రా..?
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశమైంది. నెట్స్లో గంటల కొద్దీ బుమ్రా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ గడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఫ్రాంఛైజీ ఎక్స్లో షేర్ చేసింది. బుమ్రా రివర్స్ స్వీప్, పుల్ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నటు ఈ వీడియోలో కన్పించింది. కాగా ఢిల్లీతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మెనెజ్మెంట్ బ్యాటింగ్ ఆర్డర్లో బుమ్రాకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ తరహాలో.. బుమ్రాతో ఓపెనింగ్ చేయంచాలని ముంబై మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదే జరిగితే రోహిత్ శర్మతో కలిసి బుమ్రా ముంబై ఇన్నింగ్స్ను ఆరంభించే ఛాన్స్ ఉంది. కాగా ఈ ఏడాది సీజన్లో బుమ్రా బంతితో అదరగొడుతున్నాడు. 13 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్గా బుమ్రా కొనసాగుతున్నాడు. Aaj batting tera Jassi bhai karega! 😎💥#MumbaiMeriJaan #MumbaiIndians | @Jaspritbumrah93 pic.twitter.com/RO0WWHh7Fz— Mumbai Indians (@mipaltan) April 26, 2024
ఆ పాత్ర కోసం కేజీఎఫ్ హీరో సాహసం.. అదేంటో తెలుసా?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో రణ్బీర్కపూర్, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో కేజీఎఫ్ స్టార్ యశ్ కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా యశ్కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం యశ్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరగనున్నట్లు తాజా సమాచారం. దానికోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. నితీశ్ తివారీ రామాయణంలో యశ్ భారీ పర్సనాలిటీతో కనిపించనున్నారు. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్-3లో యశ్ నటించనున్నారు. ప్రస్తుతం టాక్సిక్ చిత్రంలో నటిస్తోన్న యశ్.. ఆ సినిమా పూర్తయ్యాకే రామాయణం సెట్స్లో అడుగుపెట్టనున్నారు. కాగా.. రామాయణం షూటింగ్ ఏప్రిల్లో ముంబైలో ప్రారంభమైంది. ఈ మూవీ కోసం దర్శకుడు నితీష్ తివారీ ముంబయి నగర శివార్లలో భారీ సెట్ను నిర్మించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుండగా.. హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తారని సమాచారం.
యనమల రాజీనామా.. టీడీపీకి చావుదెబ్బ
యనమల రాజీనామా.. టీడీపీకి చావుదెబ్బ
నామినేషన్ వేసిన టీడీపీ రెబల్ షాక్ లో రఘురామ కృష్ణం రాజు
నామినేషన్ వేసిన టీడీపీ రెబల్ షాక్ లో రఘురామ కృష్ణం రాజు
తాజా వార్తలు
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Telangana Lok Sabha Election 2019
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
సినిమా
పెళ్లి జ్ఞాపకాల్ని అలా మార్చేసిన సమంత.. వీడియో వైరల్
సమంత పేరు చెప్పగానే ఆమె పెళ్లి, విడాకులే చాలామందికి గుర్తొస్తాయి. ఎందుకంటే కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఎన్నాళ్లు బంధాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కారణమేంటో గానీ విడాకులు తీసేసుకుంది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది. పెళ్లి పెటాకులు అయినా.. సామ్ దగ్గర ఆ జ్ఞాపకాల ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు వాటితో ప్రయోగం చేసింది. ఇంతకీ అసలేంటి విషయం?'ఏ మాయ చేశావె'తో హీరోయిన్ అయిపోయిన సమంత.. ఇదే సినిమాలో హీరోగా చేసిన నాగచైతన్యని లవ్ చేసింది. ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాల్లో వీళ్లిద్దరూ జంటగా నటించారు. అలా కొన్నేళ్ల పాటు సాగిన ప్రేమకు 2017లో ఎండ్ కార్డ్ వేశారు. పెద్దల్ని ఒప్పించి చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ నాలుగేళ్లలో అంటే 2021లో విడాకులు తీసుకున్నారు.అయితే పెళ్లిలో సమంత.. వైట్ కలర్ వెడ్డింగ్ గౌన్ ఒకటి అప్పట్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. అయితే పెళ్లి, విడాకులు తర్వాత దాని అవసరం ఉండకపోవచ్చు. కానీ దాన్ని అలానే జాగ్రత్తగా దాచుకున్న సమంత.. ఇప్పుడు ఆ గౌన్కి ఉన్న చిన్న చిన్న పూలని తీసి కొత్త డ్రస్ కోసం ఉపయోగించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామ్ ఇన్ స్టాలోనే ఉంది. పెళ్లి జీవితం సరిగా లేనప్పటికీ.. ఆ జ్ఞాపకాల్ని ఇంకా పదిలంగా అలా ఉంచుకోవడం ఇంట్రెస్టింగ్ విషయమే. View this post on Instagram A post shared by Krésha Bajaj (@kreshabajajofficial)
2 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న గురక సినిమా
మరో డబ్బింగ్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. మొన్నే రిలీజైన ఈ మూవీ.. సరిగ్గా రెండు వారాలు తిరగకుండానే అందుబాటులోకి రానుంది. ఇదే ఇక్కడ షాకింగ్గా అనిపిస్తుంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చూసిన ప్రేక్షకులు.. ఇంత మాత్రం దానికి థియేటర్లలో రిలీజ్ ఎందుకు చేశారని గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ఇదే మూవీ? ఏ ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందనేది చూద్దాం.తమిళంలో గతేడాది రిలీజైన సినిమా 'గుడ్ నైట్'. గురక వల్ల కొత్తగా పెళ్లయిన జంట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాన్ని ఎంటర్టైనింగ్గా చూపించారు. ఓటీటీలో డబ్బింగ్ వెర్షన్ కూడా తెలుగులో హిట్ అయింది. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్తో తీసిన మరో తమిళ సినిమా 'డియర్'.ఏప్రిల్ 11న 'డియర్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. దాదాపుగా 'గుడ్ నైట్' కథతోనే తీశారు. దానికి తోడు కనీసం ఎంటర్టైన్ చేసే సీన్స్ లేకపోవడం పెద్ద మైనస్ అయింది. దీంతో సినిమా ఫట్ అయింది. వారం తిరక్కుండానే థియేటర్ల నుంచి మాయమైంది. మరోవైపు ఏప్రిల్ 28 అంటే ఈ ఆదివారం నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అని ప్రకటించేశారు. దీంతో మరీ 17 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకురావడం ఏంట్రా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.'డియర్' కథ విషయానికొస్తే.. న్యూస్ రీడర్ అవ్వాలనుకునే అర్జున్ (జీవీ ప్రకాశ్).. చిన్న శబ్దాలకు కూడా నిద్రలో నుంచి లేచిపోయే సమస్యతో బాధపడుతుంటాడు. మరోవైపు గురక సమస్యతో బాధపడుతూ ఉంటుంది దీపిక (ఐశ్వర్యా రాజేశ్). ఒకరి సమస్యలు మరొకరికి తెలియకుండా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఏమైంది అనేదే కథ.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పెళ్లికి రెడీ? నిజమేంటి?
మరో తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా? చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఏకంగా వెడ్డింగ్ వైబ్స్ అని కొన్ని ఫొటోలు పోస్ట్ చేయడంతోనే ఈ చర్చంతా తెరపైకి వచ్చింది. గతంలో ఈమె పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? పెళ్లి గురించి వస్తున్న వార్తల సంగతేంటి అనేది ఓసారి చూద్దాం.తమిళ బ్యూటీ మేఘా ఆకాశ్.. 'లై' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. గతేడాది ఓ మూడు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఈమె పెళ్లి గురించి వార్తలొచ్చాయి. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కొడుకుని పెళ్లి చేసుకోనుందని మాట్లాడుకున్నారు. ఎవరూ స్పందిచకపోవడంతో దీని గురించి అందరూ మర్చిపోయారు.తాజాగా మరోసారి కొత్త పెళ్లి కూతురు లుక్లో మేఘా ఆకాశ్ దర్శనమిచ్చింది. వెడ్డింగ్ వైబ్స్ అనే హ్యాష్ ట్యాగ్తో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. దీంతో మరోసారి ఈమె మ్యారేజ్ హాట్ టాపిక్ అయిపోయింది. త్వరలో చేసుకోనుందని అన్నారు. మేఘా పెళ్లి న్యూస్ నిజమే అయినప్పటికీ.. మరికొన్ని రోజుల తర్వాతే అది ఉండొచ్చని తెలుస్తోంది. లేటెస్ట్ పిక్స్ మాత్రం యాడ్ షూట్కి సంబంధించినవి అని తెలుస్తోంది.
ఓటీటీలోకి వచ్చేసిన మూడు సినిమాలు.. ఎందులో చూడొచ్చంటే?
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలా సినిమాలు వచ్చేశాయి. కాకపోతే వాటిలో ఓ మూడు మాత్రమే జనాలకు కాస్త ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటిలో రెండు తెలుగు చిత్రాలు ఉండగా, హిందీ మూవీ కూడా ఒకటుంది. ఇప్పుడు అవన్నీ కూడా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కొందరు ఆల్రెడీ చూసేస్తుండగా, మరికొందరు ఎప్పుడు చూడాలనేది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?'డీజే టిల్లు' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు.. దీని సీక్వెల్గా 'టిల్లు స్క్వేర్' తీశాడు. చాలాసార్లు వాయిదా పడి మార్చి 29న థియేటర్లలోకి వచ్చింది. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. చూసి కడుపుబ్బా నవ్వుకోవడానికి ఈ వీకెండ్ టిల్లు బెస్ట్ ఆప్షన్.విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. గత కొన్నేళ్ల సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్న రౌడీ హీరో.. కనీసం ఈ మూవీతో అయినా సక్సెస్ అందుకుంటాడనుకుంటే నిరాశే ఎదురైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ పాస్ కోసమైతే ఈ వీకెండ్లో మూవీ చూడొచ్చు.ఆమిర్ ఖాన్ నిర్మాతగా, అతడి మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'లా పతా లేడీస్'. కొత్తగా పెళ్లయిన వ్యక్తి, తన భార్య మిస్ కావడంతో మరో అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్తో ఈ మూవీ తీశారు. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది. ఇది కూడా మంచి కామెడీ చిత్రమే. ఈ వీకెండ్ ఎక్స్ట్రా ఎంటర్టైన్ కావాలంటే దీనిపైన కూడా ఓ లుక్కేసేయండి.
ఫొటోలు
బిజినెస్
రైలు ప్రయాణికులకు శుభవార్త.. క్యూలో నిలబడకుండా జనరల్ టికెట్
స్టేషన్లో క్యూలో నిలబడి టికెట్ తీసుకుంటున్న ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆ శాఖకు చెందిన యాప్లను కొత్త ఫీచర్లతో అప్డేట్ చేస్తున్నారు. రైల్వేశాఖ గతంలోనే తీసుకొచ్చిన యూటీఎస్ (అన్రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్) యాప్లో తాజాగా మార్పులు చేసింది.రైలు ప్రయాణం చేయాలనుకున్నపుడు జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. టికెట్కోసం క్యూలో నిలుచున్నా కొన్నిసార్లు ప్లాట్ఫామ్పై ఉన్న రైలు వెళ్లిపోయిన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాఅని ట్రెయిన్ వెళుతుంటే టికెట్ లేకుండా ఎక్కలేం. ప్రధానంగా సెలవులు, పండగలప్పుడు జనరల్ టికెట్ కోసం పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైలుశాఖ యూటీఎస్ (అన్రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్) యాప్ను గతంలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు క్యూలో నిలుచోకుండా ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే స్టేషన్కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. దీంతో ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రైల్వేశాఖ గుర్తించింది.ఇదీ చదవండి: హార్లిక్స్ లేబుల్ తొలగింపు.. కారణం ఇదేనా..తాజాగా రైలు ప్లాట్ఫామ్కు ఎంత దూరంలో ఉన్నా టికెట్ పొందేలా యాప్ను అప్డేట్ చేశారు. దాంతో ఇంట్లో ఉండగానే కంగారుపడకుండా జనరల్ టికెట్ బుక్ చేసుకుని రైలు వచ్చే సమయానికి స్టేషన్కు వస్తే సరిపోతుంది. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. సరిగ్గా రైలు ప్లాట్ఫామ్పైకి రాబోతుందనే సమయానికి అంటే ప్లాట్పామ్కు 50 మీటర్లు దూరంలో ఉన్నపుడు మాత్రం ఈ యాప్ పనిచేయదని గమనించాలి.
ఆర్బీఐ కొట్టిన దెబ్బ.. షేర్లు భారీగా పతనం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొట్టిన దెబ్బతో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాని వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఉదయ్ కోటక్ సంపదకు కూడా భారీగా గండి పడింది.కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.ఆర్బీఐ చర్యల తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం 13 శాతం వరకు పడిపోయాయి. కంపెనీలో దాదాపు 26 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఉదయ్ కోటక్ భారీ నష్టాన్ని చవిచూశారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10 వేల కోట్లు) తగ్గింది. ఏప్రిల్ 24 నాటికి ఉదయ్ కోటక్ నెట్వర్త్ 14.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు).ప్రత్యర్థి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ 2016 సెప్టెంబర్ తర్వాత మొదటిసారి కోటక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించిన తర్వాత యాక్సిస్ షేర్లు పుంజుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా ఉదయ్ కోటక్ తప్పుకొన్న తర్వాత అశోక్ వాస్వానీ ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్నారు.
’జీ’ సుభాష్ చంద్రపై దివాలా చర్యలకు ఎన్సీఎల్టీ ఆదేశాలు
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం, జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) గౌరవ చైర్మన్ సుభాష్ చంద్రపై దివాలా చట్టం కింద ప్రొసీడింగ్స్ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ వివేక్ ఇన్ఫ్రాకాన్ తీసుకున్న రుణాలకు గ్యారంటార్గా ఉన్న చంద్రపై ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్ఎల్) దాఖలు చేసిన పిటీషన్ మీద ఎన్సీఎల్టీ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మరో రెండు సంస్థలు (ఐడీబీఐ ట్రస్టీíÙప్, యాక్సిస్ బ్యాంక్) దాఖలు చేసిన ఇదే తరహా పిటీషన్లను తోసిపుచి్చంది. ఓపెన్ కోర్టులో ఎన్సీఎల్టీ ఈ ఆర్డరులివ్వగా పూర్తి వివరాలతో కూడిన తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. వివరాల్లోకి వెడితే చంద్రా ప్రమోట్ చేస్తున్న ఎస్సెల్ గ్రూప్లో భాగమైన వివేక్ ఇన్ఫ్రాకాన్ సంస్థ 2022లో ఐహెచ్ఎఫ్ఎల్కు రూ. 170 కోట్ల రుణం డిఫాల్ట్ అయ్యింది. దీనిపైనే ఐహెచ్ఎఫ్ఎల్ .. ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. వ్యక్తిగత గ్యారంటార్లు.. దివాలా ప్రొసీడింగ్స్ పరిధిలోకి రారని, తనపై చర్యలు తీసుకునేందుకు ఎన్సీఎల్టీకి ఎలాంటి అధికారాలు ఉండవని చంద్రా వాదనలు వినిపించారు. అయితే, దీన్ని ఎన్సీఎల్టీ తిరస్కరించగా .. చంద్రా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించుకోవడంతో కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, ఆ తర్వాత కూడా బకాయిలను తీర్చకపోవడంతో ఐహెచ్ఎఫ్ఎల్ ఈ ఏడాది ప్రారంభంలో కేసును తిరగదోడింది.
మళ్లీ ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన జొమాటో.. ఎంతంటే..
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్డెలివరీ కంపెనీ జొమాటో తన వినియోగదారులకు ప్లాట్ఫామ్ ఫీజును పెంచినట్లు తెలిసింది. జొమాటో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా చేసే ప్రతి ఆర్డర్పై ఇప్పటికే అమలులో ఉన్న ప్లాట్ఫామ్ ఫీజును రూ.5కు పెంచింది. దాంతో తన యూజర్లపై భారం మోపినట్లయింది.పెంచిన ధరలు తాజాగా అమల్లోకి వచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. జొమాటో తొలిసారి 2023 ఆగస్టులో ప్లాట్ఫాం ఫీజును ప్రవేశపెట్టింది. మొదట ఆర్డర్కు రూ.2 చొప్పున వసూలు చేస్తున్న ఈ ఫీజును అదే ఏడాది అక్టోబర్లో రూ.3కు పెంచింది. 2024 జనవరిలో దాన్ని రూ.4కు మరోసారి పెంచారు. తాజాగా అది రూ.5కు చేరింది. ఫుడ్ డెలివరీ సంస్థలు ఆదాయం పెంచుకోవడానికి ప్లాట్ఫామ్ ఫీజును ప్రవేశపెట్టాయి. జొమాటోకే చెందిన బ్లింకిట్ మాత్రం ఈ ఫీజును రూ.2 చొప్పున వసూలు చేస్తోంది. ఇదీ చదవండి: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.. హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ఒక నగరంలో బాగా వినియోగిస్తున్న ఆహార పదార్థాలను ఇతర నగరాల్లోనూ సరఫరా చేసేందుకు ప్రారంభించిన ‘ఇంటర్సిటీ లెజెండ్స్’ సేవలను కంపెనీ నిలిపేసింది. ఆ సర్వీసుకు వినియోగదారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో దాన్ని నిలిపేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
What’s your opinion
వీడియోలు
మా కార్యకర్త ట్రాక్టర్ ను దగ్ధం చేస్తారా రౌడీ రాజకీయాలు మానుకో..!
కుప్పంలో భారీ మెజారిటీతో భరత్ ను గెలిపించుకుంటాం
రాయలసీమలో 52 స్థానాల్లో YSRCP గెలుపు తథ్యం: మంత్రి పెద్దిరెడ్డి
మీకు తెలిసి కూడా అబద్ధం ఎలా చెబుతున్నారు షర్మిలమ్మ
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు భారీ ఏర్పాట్లు
షర్మిల వ్యాఖ్యలపై పొన్నవోలు కౌంటర్
షర్మిల తీరు పై సంచలన వ్యాఖ్యలు
రైతుల క్షేమం కంటే నా ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు : హరీశ్రవు
మంత్రి బొత్స సత్యనారాయణ Vs కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
పిఠాపురంలో పవన్ అష్టకష్టాలు