
యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాలో ఇంత వరకు టెస్టు క్రికెట్లో ఏ ఆటగాడికీ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో ఐదో టెస్టులో జైస్వాల్ సాధించిన సెంచరీ (వంద పరుగులు)లో 82 పరుగులు బిహైండ్ స్క్వేర్ పొజిషన్ నుంచి వచ్చినవే. ఇలా ఒక ప్రత్యేకమైన ఏరియా నుంచి ఏకంగా 82 పరుగులు సాధించి... శతకం పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా జైస్వాల్ ప్రపంచ రికార్డు సాధించాడు.
Read More

'కూలీ' తెలుగు ట్రైలర్ రిలీజ్
రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, ఆమిర్ ఖాన్ తదితరులు నటించిన 'కూలీ' మూవీ ట్రైలర్ రిలీజైంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉండగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంపై ఈ ట్రైలర్ అంచనాలు అమాంతం పెంచేసేలా ఉంది.
Read More

ఆసియాకప్-2025కు జస్ప్రీత్ బుమ్రా దూరం
ఆసియాకప్-2025కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ల దృష్ట్యా అతడికి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే బుమ్రా ఎంపికపై చీఫ్ సెలక్టర్ అజిత్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తుది నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Read More

రష్యాతో భారత్ కటీఫ్.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురుపై ట్రంప్ స్పందించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయభారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనబోదని నేను అనుకుంటున్నాను. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, నేను విన్నది సరైందో కాదో నాకు తెలియదు. భారత్ కనుక ఇలా చేస్తే అది మంచి నిర్ణయం. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది మంచి చర్య.
Read More

ట్రంప్కు అంత సీన్ లేదు.. రష్యా కౌంటర్
అమెరికాకు చెందిన రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై రష్యా స్పందిస్తూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు రష్యా వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో అమెరికా జలాంతర్గాముల సంఖ్య కంటే రష్యావి చాలా ఎక్కువే ఉన్నాయి. అమెరికా మోహరించినవి జలాంతర్గాములు సైతం రష్యా జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
Read More

ప్రసిద్ కృష్ణపై జో రూట్ సీరియస్
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ (Joe Root)కు కోపమొచ్చింది. టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడు అంపైర్కు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే..
Read More

పసికూనపై ప్రతాపం చూపించిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ జట్టు పసికూన జింబాబ్వేపై తమ ప్రతాపాన్ని చూపించింది. బులవాయో వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. జింబాబ్వేను రెండు ఇన్నింగ్స్ల్లో 200 పరుగుల లోపే కట్టడి చేశారు. మ్యాట్ హెన్రీ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్ల ప్రదర్శన సహా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీశాడు.
Read More

రజినీకాంత్ కూలీ.. సెన్సార్ పూర్తి
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ విడుదల చేయనున్నారు.
Read More

మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. ఈ రంగంలో ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయని ఎంతోమంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. కృత్రిమ మేధలో ట్యాలెంట్ ఉన్న ఓ కంపెనీ ఉద్యోగులకు.. దిగ్గజ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాయి. కానీ వారు మాత్రం తమ బాస్ను వదిలిపెట్టకుండా.. ఆఫర్లను తృణప్రాయంగా భావించారు.
Read More

రేప్ కేసులో దోషిగా ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: కర్ణాటక మాజీ ఎంపీ, జేడీఎస్ సస్పెండెడ్ నేత ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్ తగిలింది. పని మనిషిపై అత్యాచారం, బెదిరింపుల కేసులో ఆయన్ని దోషిగా తేల్చింది బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం. 26 మంది సాక్షులను విచారించిన కోర్టు.. అరెస్టైన దాదాపు ఏడాది తర్వాత తీర్పు ఇవ్వడం గమనార్హం.
Read More

గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
రక్షాబంధన్కు ముందు ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఊరట కలిగించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను దేశవ్యాప్తంగా రూ .33.50 తగ్గించాయి. కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
Read More

ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ రిలీజ్
న్యూఢిల్లీ: జగ్దీప్ ధన్ఖడ్ అనూహ్య రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఎన్నిక నిర్వహణ జరుగుతుందని ఈసీ శుక్రవారం తెలిపింది. ఈ క్రమంలో.. సెప్టెంబర్ 9వ తేదీన పోలింగ్ జరగనున్నట్లు పూర్తి వివరాలను విడుదల చేసింది. ఆ షెడ్యూల్ను పరిశీలిస్తే..

నారా లోకేష్కు స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్: ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ మంత్రి హరీష్రావు తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తామేమీ అడ్డుకోలేదన్న లోకేష్ వాదనలో ఎలాంటి వాస్తవం లేదని.. ఆ టైంలో చంద్రబాబు 7 లేఖలు కేంద్రానికి రాసినట్లు ఆధారాలు చూపిస్తామని..
Read More

కరుణ్ నాయర్ ఫైటింగ్ హాఫ్ సెంచరీ..
ఓవల్ మైదానం వేదికగా ఇగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ తడబడుతోంది. అయితే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. నాయర్ 3146 రోజుల తర్వాత టెస్టుల్లో ఆర్ధ శతకం సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. క్రీజులో కరుణ్ నాయర్తో పాటు వాషింగ్టన్ సుందర్(19) ఉన్నారు.
Read More

భారత్ వల్లే ఇదంతా.. పుతిన్ రెచ్చిపోతున్నారు..
భారత్, రష్యా చమురు కొనుగోలు విషయమై అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర భారత్ కొంటున్న చమురుతోనే పుతిన్.. ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. భారత్కు భారీగా ఇంధన అవసరాలున్నాయి. రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్కు చమురు చౌకగా లభిస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే రష్యాలను నిధులు సమకూరుతున్నాయి.
Read More

బంగ్లాదేశీ నటి కోల్కతాలో అరెస్ట్.. కారణం ఇదే..
దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్కు చెందిన మోడల్ శాంతా పాల్(28)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నకిలీ ఆధార్ కార్డులతో కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండు నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, బంగ్లాదేశీ పాస్పోర్టులు ఉన్నట్టు గుర్తించారు. ఆమె పలు సినిమాల్లో నటించినట్లు తెలుస్తున్నది. టీవీ చానల్స్, యాంకర్గా..
Read More

వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై మొదలైన అక్రమ కేసుల పర్వం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనపై అక్రమ కేసుల పర్వం మొదలైంది. వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉండగా నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేశారని మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డితో పాటు మరికొందరిపై దర్గామిట్ట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు.
Read More

సుంకాల మోత మోగించిన ట్రంప్.. ఈసారి ఎంతంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించారు. 70 దేశాలపై తాజాగా సుంకాలను విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. సిరియాపై అత్యధికంగా 41 శాతం విధించగా.. కెనడాపై 25 శాతం నుంచి 35 శాతం, లావోస్, మయన్మార్పై 40 శాతం, స్విట్జల్యాండ్పై 39 శాతం, ఇరాక్, సెర్బియాపై 35 శాతం, భారత్పై 25 శాతం, పాకిస్తాన్పై 19 శాతం, బంగ్లాదేశ్పై 20శాతం, శ్రీలంకపై 20..
Read More

పసిడి ప్రియులకు వరుస ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. నిన్నటి మార్కెట్ సెషన్లో తగ్గిన పసిడి ధరలు ఈరోజు కూడా కాస్త దిగివచ్చాయి. గురువారంతో పోలిస్తే శక్రవారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More

ఎట్టకేలకు ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఫలితాలు విడుదల అయ్యాయి. పోలీస్ శాఖలో తీవ్ర సిబ్బంది కొరత నేపథ్యంలో 2022లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 6,100 పోస్టులకు నియామక ప్రక్రియను ప్రారంభించింది. అయితే న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో ఫలితాల విడుదల జాప్యమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఫలితాలను హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ విడుదల చేశారు.
Read More

ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. ఓటీటీలన్నీ ఫ్రీ..
ఓటీటీ వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలు అనేక ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్లాన్లలో చాలా వరకు ఖరీదైనవి లేదా ఒకటీ రెండు ఓటీటీ సర్వీసులకు మాత్రమే యాక్సెస్ కల్పిస్తాయి. కానీ ఎయిర్టెల్ ఓటీటీ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది ఒకటీ రెండు కాదు నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ సహా రెండు డజన్లకు పైగా ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
Read More

ఊర్వశి రౌతేలా.. మ్యాచ్ కోసం వెళ్తే రూ.70 లక్షలు కొట్టేశారు!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల వింబుల్డన్ టోర్నీ చూసేందుకు లండన్ వెళ్లగా తన ఖరీదైన ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లండన్లోని గాట్విక్ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపింది. దాదాపు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు కలిగిన తన లగ్జరీ సూట్కేస్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానాశ్రయ అధికారులు ఎలాంటి సహాయం చేయలేదని ఊర్వశి నిరాశ వ్యక్తం చేసింది.
Read More

ఓటీటీకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
ప్రస్తుత రోజుల్లో ఓటీటీలు సరికొత్త కంటెంట్తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్కు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. ఓటీటీ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగానే డిఫరెంట్ కంటెంట్తో వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు మరో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
Read More

దేశ ప్రయోజనాలే ముఖ్యం.. ట్రంప్ టారిఫ్ ప్రకటనపై పియూష్ గోయల్
సాక్షి,న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆగస్టు 1 నుంచి భారత వస్తువులపై 25శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై.. లోక్సభలో పీయూష్ గోయల్ మాట్లాడారు.
Read More

పతనమైంది భారత ఆర్థికం కాదు.. మీ రాజకీయ భవిష్యత్తు
సాక్షి,న్యూఢిల్లీ: ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమర్ధించారు. ప్రధాని మోదీ హయాంలో భారత ఆర్ధిక వ్యవస్థను చంపేశారని సంచలన కామెంట్స్ చేశారు.
Read More

ధర్మస్థళ మిస్టరీ.. వెలుగులోకి కీలక ఆధారాలు
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థళ సామూహిక ఖననం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజులుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇవాళ మానవ అవశేషాలు బయటపడ్డాయి.
Read More

పేటీఎంలో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు
రాఖీ, జన్మాష్టమి తదితర పండుగల సందర్భంగా ట్రావెల్ మెగా ఫెస్టివల్ సేల్ కింద ప్రయాణికులకు ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నట్లు పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్) వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా విమాన సర్వీసుల్లో 12%, అంతర్జాతీయ రూట్లలో 10%, బస్ బుకింగ్స్పై 20 % డిస్కౌంటు పొందవచ్చు.
Read More

కాగ్నిజెంట్లో జీతాల పెంపు.. సీఎఫ్వో కీలక ప్రకటన
ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్లో ఉద్యోగుల జీతాల పెంపుపై కీలక ప్రకటన చేశారు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) జతిన్ దలాల్. 2025 ద్వితీయార్థంలో చాలా మంది ఉద్యోగులకు వేతన పెంపును అమలు చేయాలని కంపెనీ యోచిస్తోందని, అయితే స్థూల ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో వేతన పెంపు తేదీని ఇంకా నిర్ణయించలేదని జతిన్ దలాల్ జూలై 31న కంపెనీ క్యూ 2 ఎర్నింగ్ కాల్ సందర్భంగా చెప్పారు.
Read More

ఓఎన్డీసీ, జెమ్ పోర్టల్లో పోస్టల్ సర్వీసులు
ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్ పోర్టల్తో అనుసంధానంపై ఇండియా పోస్ట్ కసరత్తు చేస్తంది. దీనితో పోస్టల్ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రాగలవని, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కంపెనీలతో పోస్టల్ విభాగం పోటీపడేందుకు వీలవుతుంది.
Read More

బిగ్బాస్ వచ్చేస్తున్నాడు.. డేట్ రివీల్ చేసిన ఓటీటీ సంస్థ
బుల్లితెర ప్రియులను అలరించే బిగ్బాస్ రియాలిటీ షోకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే హోస్ట్గా మరోసారి ఆ స్టార్ హీరోనే అలరించనున్నారు. ఈ బిగ్బాస్ షోకు ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఏ భాషలో వచ్చిన ఈ రియాలిటీ షో బుల్లితెర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిందీలో బిగ్బాస్ సీజన్-19కు సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ ప్రకటించింది.
Read More

పీడీఏ స్కూల్స్.. ఎ ఫర్ అఖిలేష్.. డి ఫర్ డింపుల్!
ఎ ఫర్ అఖిలేష్ యాదవ్, డి ఫర్ డింపుల్ యాదవ్, ఎం ఫర్ ముంలాయం సింగ్ యాదవ్.. ఇది ఇప్పుడు యూపీలో సమాజ్వాదీ పార్టీ పీడీఏ పాఠశాలను ఏర్పాటు చేస్తూ పీల్లలకు నేర్పుతున్న ప్రాథమిక పాఠం.
Read More

వామ్మో.. ఇది విధ్వంసమే: ట్రంప్ టారిఫ్పై శశిథరూర్
భారత వస్తువులపై 25 శాతం సుంకాన్ని విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా సీరియస్గా పరిగణించాల్సి ఉందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్..
Read More

2028 ఒలింపిక్స్.. పాక్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
2028 ఒలింపిక్స్లో పాల్గొనే జట్లపై ఐసీసీ తాజాగా ఓ కంక్లూజన్కు వచ్చినట్లు తెలుస్తుంది. రీజియన్ల వారీగా టాప్ ర్యాంక్ జట్లను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ లెక్కన ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, యూరప్ నుంచి ఇంగ్లండ్, ఆతిథ్య దేశంగా అమెరికా క్వాలిఫై అయ్యే అవకాశముంది. ఇదే జరిగితే పాక్ ఒలింపిక్స్కు అర్హత సాధించలేదు.
Read More

IND vs ENG: వాళ్లిద్దరు ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఇంటికి!
చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు మరోసారి మొండిచేయే ఎదురైంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు అతడిని ఎంపిక చేసినా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు యాజమాన్యం. దీంతో ఒక్క టెస్టు ఆడకుండానే కుల్దీప్ ఇంగ్లండ్ పర్యటన ముగిసినట్లయింది. మరోవైపు.. యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ది కూడా ఇదే కథ.
Read More

అవును.. ట్రంప్ నిజమే చెప్పారు
భారత్ అమెరికాకు మిత్రదేశమేనంటూ.. 25 శాతం సుంకాలు విధించారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో రష్యా నుంచి అధిక చమురు దిగుమతి చేసుకున్నందుకే భారత్కు ఇది తప్పదంటూ వ్యాఖ్యానించారు. అయితే తాజాగా రష్యా-భారత్ బంధంపై ట్రంప్ విషం కక్కారు. ఆ రెండు దేశాలు ఎటుపోయినా తనకు సంబంధం లేదంటూ డెడ్ ఎకనమీ అంటూ మాట్లాడారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు..
Read More

బాబు విషబీజాలు.. ఫలితం అనుభవించక తప్పదు
ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా భయపడడమెందుకు? అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి తాను వస్తే.. ఆంక్షలతో జనాలను రాకుండా చేయడం దేనికి సంకేతమని నెల్లూరు పర్యటనలో నిలదీశారాయన. వైఎస్సార్సీపీ మహిళా నేతలపై దారుణమైన రీతిలో మాటలు.. దాడులకు టీడీపీ తెగబడుతోందని, ప్రజలకు ఏం మంచి చేయలేకపోయారు కాబట్టే ఇప్పుడు ఇలా..
Read More

ప్రభుత్వం చెంతకు కాళేశ్వరం నివేదిక
కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలను షీల్డ్ కవర్లో డాక్యుమెంట్ల రూపేణా ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జకు అందజేశారు. 500 పేజీల చొప్పున.. మొత్తం వెయ్యి పేజీలతో కమిషన్ తుది నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అందులో..
Read More

'కింగ్డమ్' రివ్యూ.. హిట్టా? ఫట్టా?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'కింగ్డమ్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. చిన్న చిన్న మైనస్సులు ఉన్నప్పటికీ ఓవరాల్గా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది? విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడా లేదా? అనిరుధ్ సంగీతం ఆకట్టుకుందా? అనేది పూర్తి రివ్యూలో చదివేయండి.
Read More

‘మనల్ని ఎవడ్రా ఆపేది..’ జగన్ కోసం జన సునామీ
మూడు వేల మందికిపైగా పోలీసుల మోహరింపు. ఎటు చూసినా ముళ్ల కంచెలు, బారికేడ్లతో కాపల. వాహనాలు తిరగకుండా రోడ్లు తవ్వేసిన పరిస్థితులు. ఆఖరికి.. ఆర్టీసీ బస్సులను సైతం ఆపేసి జనాల ఫోన్లను తనిఖీలు చేయడం లాంటి పరిస్థితులు గత రెండు రోజులుగా నెల్లూరులో కనిపించాయి. అయితే ఆ ఆంక్షల చెరను తెంచుకుని జగన్ కోసం జనప్రవాహం ఇవాళ తరలి వచ్చింది.
Read More

తెలంగాణ ఫిరాయింపులపై సంచలన తీర్పు
బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ స్పీకర్కు సుప్రీం కోర్టు ఆదేశించింది. కాలపరిమితిని విధించడంతో పాటు హైకోర్టు తీర్పును కొట్టేసిన సీజేఐ బీఆర్ గవాయ్.. ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలే చేశారు.
Read More

ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు ప్రకటన
ఆస్ట్రేలియా పర్యటనకు భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్ ఆయూష్ మాత్రే ఎంపికయ్యాడు. ఈ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకున్నాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్కు సెలక్టర్లు మరోసారి మొండి చేయి చూపించారు. కాగా భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది.
Read More

ఏఐతో సమస్యపై హెచ్చరిక
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, వ్యవస్థలు మార్పుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్గేట్స్ అన్నారు. లేదంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఏఐ ఉత్పాదకతను పెంచే క్రమంలో చాలామంది సిబ్బంది తమ కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
Read More

త్వరలో మడతెట్టే యాపిల్ ఫోన్?
స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఉన్న యాపిల్ మాత్రం ఈ విభాగంలో ఉత్పత్తులను తీసుకురాలేదు. కానీ ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ విభాగంలో యాపిల్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
Read More

ఐటీలో కల్లోల వేళ ఇన్ఫోసిస్ చల్లని కబురు
టీసీఎస్ లేఆఫ్ల ప్రకటన తర్వాత దేశ ఐటీ పరిశ్రమలో కల్లోల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఐటీ ఉద్యోగార్థులకు దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది 20,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ధృవీకరించారు.
Read More

హిట్ అండ్ రన్ కేసులో నటి అరెస్ట్
హిట్ అండ్ రన్ కేసులో అస్సాం నటి నందినీ కశ్యప్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం ఉత్తర గౌహతిలోని రాజధాని థియేటర్ రిహార్సల్ వద్ద ఆమెను అరెస్ట్ చేసి దిస్పూర్లోని మహిళా పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 25న నందినీ తన కారుతో ఓ స్టూడెంట్ను ఢీ కొట్టి, అక్కడ నుంచి పారిపోయారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు నటిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు.
Read More

ఈడీ విచారణ పూర్తి.. ప్రకాశ్ రాజ్ ఏం చెప్పాడంటే?
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగానూ ఈడీ.. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ని తాజాగా విచారించింది. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ విచారణ అనంతరం మీడియాతో ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్ యాప్స్లో ఆడకండి అని, భవిష్యత్తులోనూ ఎప్పుడూ మరోసారి ఇలా చేయానని చెప్పుకొచ్చారు.
Read More

కింగ్డమ్ మూవీ.. విజయ్ దేవరకొండ భారీ కటౌట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా కింగ్డమ్ ఫీవర్ నడుస్తోంది. మాస్ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సారి గట్టిగా కొడుతున్నాం అంటూ ఫ్యాన్స్లో జోష్ నింపారు.
Read More

అంత అర్జెంటుగా కిషోర్ను ఎందుకు అరెస్ట్ చేశారు?: ఏపీ హైకోర్టు
రెంటచింతల పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించారంటూ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తురకా కిషోర్ తరఫున న్యాయవాది రామలక్ష్మణ్ రెడ్డి వాదనను వినిపించారు. తురక కిషోర్పై ఇప్పటికీ 12 అక్రమ కేసులు బనాయించారని ఆయన కోర్టుకు తెలిపారు.
Read More

చంద్రబాబూ.. ఇదేమి పోలీస్ రాజ్యం?
జగన్ వస్తున్నారంటే.. జనం తండోపతండాలుగా తరలి వస్తారు. జనసమీకరణ అనే ఊసే ఉండదు అక్కడ. అలాంటిది జనాల్ని ఆయన పర్యటన వైపు కన్నెత్తి చూడకుండా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని.. ఆంక్షల పేరుతో అభిమానానికి సంకెళ్లు వేయాలని చూస్తోంది. నెల్లూరు పర్యటన కోసం విధించిన షరతులు చూస్తే గనుక..
Read More

బంగారం ధరలు యూటర్న్!
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా గడిచిన ఐదు సెషన్ల నుంచి తగ్గుతున్న పసిడి ధరలు ఈ రోజు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More