వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సినీనటి పూర్ణిమ
ప్రముఖ సినీనటి, ముద్దమందారం కథానాయిక పూర్ణిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
విశాఖ : ప్రముఖ సినీనటి, ముద్దమందారం కథానాయిక పూర్ణిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని పార్టీ కార్యాలయంలో నిన్న వైఎస్ఆర్ సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు చాలా అభిమానమన్నారు. రాష్ట్రాభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని తెలిపారు. పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానని పూర్ణిమ వెల్లడించారు.


