అనంత వెంకటరామి రెడ్డి
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో అరాచకం సాగిందని అనంతపురం లోక్సభ సభ్యుడు అనంత వెంకటరామి రెడ్డి అన్నారు.
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో అరాచకం సాగిందని అనంతపురం లోక్సభ సభ్యుడు అనంత వెంకటరామి రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం అన్నారు.
జగన్మోహన రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ సీపీపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. మొదటి నుంచి వైఎస్ఆర్ సీపీది సమైక్యవాదమేనన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు.


