ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ధ్వజం
నాపై అసత్య ప్రచారం చేస్తే ఆమె బండారం బయటపెడతా
పన్నీర్సెల్వం గూటికి చేరిన పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకునేందుకు శశికళ కపట నాటకం ఆడుతున్నారని తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్సెల్వం ధ్వజమెత్తారు. తనపై అసత్య ప్రచారం చేస్తే శశికళ బండారం బయట పెడతానని హెచ్చరించారు. ఆమె శశికళ కాదు కుట్రకళ అని మండిపడ్డారు. ఆయన గురు వారం చెన్నైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పార్టీకి తాను ద్రోహం చేశానం టూ విమర్శిస్తున్నారని, ద్రోహి ఎవరో ప్రజల కు, పార్టీ శ్రేణులకు బాగా తెలుసని అన్నారు. పార్టీ ద్రోహులను గతంలో జయలలితే గుర్తిం చారని చెప్పారు. పార్టీ, ప్రభుత్వ పదవులు కోరుకోనంటూ జయలలిత వద్ద లిఖిత పూర్వకంగా క్షమాపణలు కోరిన శశికళ అందు కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబ ట్టారు. పోయెస్ గార్డెన్లో తన బంధువులకు స్థానం కల్పించడం ద్వారా జయకు శశికళ ద్రోహం చేశారని పన్నీర్ విమర్శించారు.
స్మారక మందిరంగా వేద నిలయం
పోయెస్గార్డెన్లో జయలలిత నివసించిన వేద నిలయంను స్మారక మందిరంగా మార్చనున్న ట్లు పన్నీర్సెల్వం తెలిపారు. ‘అమ్మ’ వినియో గించిన కారు, అన్నిరకాల వస్తు సామగ్రిని స్మారక మందిరం ఆస్తులుగా పరిగణించ నున్నట్లు చెప్పారు. ‘అమ్మ’ నివసించిన ఇల్లు తమ దృష్టిలో దేవాలయమని పేర్కొన్నారు.
శశికళది రౌడీల కూటమి..
శశికళకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ముద్ర పడిన అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధు సూదనన్ గురువారం మధ్యాహ్నం పన్నీర్ సెల్వం ఇంటికి చేరుకున్నారు. ప్రధాన కార్య దర్శిగా, సీఎంగా బాధ్యతలు చేపట్టాలని శశి కళపై ఒత్తిడి తెచ్చిన ప్రముఖ నేతల్లో ఒకరైన మధుసూదనన్ తాజాగా పన్నీర్సెల్వం గూటికి చేరారు. మదుసూధనన్ రాగానే పన్నీర్సెల్వం ఎదురేగి స్వాగతం పలికారు. ఆయన రాకతో తమ బలం మరింత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధుసూదనన్ మీడి యాతో మాట్లాడారు.
ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే ఒక కుటుంబం చేతిలోకి వెళ్లకూ డదనే ఉద్దేశంతో పన్నీర్కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘శశికళది రౌడీల కూటమి. తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పార్టీ వెళ్లడం నాకిష్టం లేదు. దివంగత సీఎం జయలలిత విశ్వాసాన్ని పొందిన వ్యక్తి పన్నీర్. జయ మర ణం విషయంలో నాకు అనుమానాలున్నాయి. శశికళను సీఎంగా చూసేందుకు ప్రజలు అంగీ కరించడం లేదు. అన్నాడీఎంకేను కాపాడు కోవాలి. పార్టీ శ్రేణులంతా పన్నీర్కు మద్దతు గా నిలవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
పన్నీర్ ఇంటికి మద్దతుదారుల క్యూ
అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని ప్రకటించి ధీమాగా ఉన్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్సెల్వం ఇంటికి గురువారం పెద్ద సంఖ్యలో మద్దతుదారులు తరలివ చ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పన్నీర్ను కలిసేందుకు వస్తు న్నారు. వారందరి పేర్లు, ఫోన్ నంబర్లు తదితర వివరాలను నమోదు చేసుకునేం దుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పన్నీర్సెల్వం వెంట ఉన్న ట్లు తెలుస్తోంది. శశికళపై అసంతృప్తితో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు.
శశికళ కాదు కుట్రకళ
Published Fri, Feb 10 2017 3:34 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అంతర్జాతీయ టీ దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
శ్రీలంకలో స్టార్లింక్ సేవలకై చర్చ
బెంగళూరు రేవ్ పార్టీ: ఆ ఇద్దరు నటులు ఎవరు?
ఒడిషాలోని బీచ్ల గురించి తెలిస్తే.. ఇపుడే ‘ఛలో’ అంటారు
బీజేవైఎం నిరసన గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
సీఎం యోగిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు?
సైబర్ కేటుగాళ్లు దోచేశారు.. ఆర్బీఐ ఉద్యోగినికి రూ.24.5లక్షల టోకరా
వరల్డ్ కప్ నే కాళ్ళ కింద పెట్టుకున్న కెప్టెనే ఇలా అంటే..
Vishnu Priya Photos: టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
గాజాలో జరుగుతోంది మారణహోమం కాదు: జో బైడెన్
తప్పక చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
Advertisement