Short Stories | Sakshi
1

ఈ శుక్రవారం ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు!

చూస్తుండగానే వీకెండ్‌ వచ్చేస్తోంది. గతవారం లాగే ఈసారి కూడా వరుసగా మూడు రోజులు రావడం సినీ ప్రియులకు పండగే. ఈ వారం థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు కూలీ, వార్‌-2 ఇప్పటికే సందడి చేస్తున్నాయి. ఓకే రోజు రిలీజైన ఈ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వస్తోంది. ఈ వారాంతంలో మూడు రోజుల పాటు సెలవులు రావడం ఈ చిత్రాలకు కలిసొచ్చే అవకాశముంది.
Read More
2

ఆ సీరియల్‌ నటి నన్ను కారుతో ఢీ కొట్టింది: జబర్దస్త్‌ సౌమ్య

సీరియల్‌ నటిగా కెరీర్‌ మొదలుపెట్టిన సౌమ్యరావు జబర్దస్త్‌ షోతో యాంకర్‌గా మారింది. ఆమె మాట్లాడుతూ.. నేను చాలా పేదరికం అనుభవించాను. ఓ రోజు అర్ధరాత్రి అమ్మ, నేను, సోదరుడు.. బస్టాప్‌లో పడుకున్నాం. రెండురోజులదాకా అన్నం తినలేదు. తిరుపతి వెళ్లినప్పుడు దర్శనానికి బదులు నాకు తిండి ఎప్పుడు పెడతారని ఎదురుచూసేదాన్ని. నేను ఓ సీరియల్‌ చేశాను. అందులోని హీరోయిన్‌ కారుతో నన్ను ఢీ కొట్టింది అని చెప్తూ ఎమోషనలైంది.
Read More
3

మీ వల్లే ఇదంతా: సుప్రీం కోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: వీధికుక్కలను దేశరాజధాని రీజియన్‌ నుంచి తరలించాలన్న సుప్రీం కోర్టు తీర్పుపై పునఃపరిశీలన జరుగుతోంది. ఈ క్రమంలో దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. అయితే వీధికుక్కల తరలింపులో అధికారులు వ్యవహరించిన తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఈ పరిస్థితి రావడానికి భాద్యులంటూ..
Read More
4

భారత్‌కు మరిన్ని సుంకాలు తప్పవు

వాషింగ్టన్‌: భారత్‌పై సుంకాల మోత మోగించిన అమెరికా.. మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. వీలైతే సుంకాలు లేకుంటే ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేసింది. రష్యాతో ఆయిల్‌ కొనుగోలు వద్దంటున్నా సరే.. భారత్‌ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 50 శాతం సుంకాలను విధించారు ట్రంప్‌. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఉక్రెయిన్‌ చర్చలకు ముడిపెట్టారు. ఒకవేళ చర్చల్లో..
Read More
5

జీతాల పెరుగుదల.. ఐటీ కంపెనీ శుభవార్త

ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1, 2025 నుంచి అర్హులైన ఉద్యోగుల్లో 80 శాతం మందికి వేతన పెంపును అమలు చేయనుంది. 2025 ద్వితీయార్ధంలో చాలా మంది ఉద్యోగులకు మెరిట్ ఆధారిత వేతన పెంపును అందించే ప్రణాళికలను కంపెనీ తన రెండవ త్రైమాసిక ఆదాయ ప్రకటనలో ధృవీకరించింది.
Read More
6

తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు: పేర్ని నాని

పులివెందులలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు. కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్‌ ప్రకారమే రీపోలింగ్‌ పెట్టింది. సీసీ ఫుటేజీ, వెబ్‌ క్యాస్టింగ్‌ ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి భయమెందుకు?.
Read More
7

'కూలీ' రివ్యూ.. సినిమా ఎలా ఉంది?

సూపర్‌స్టార్ రజినీకాంత్ 'కూలీ' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇంతకీ ఎలా ఉంది? రజినీ హిట్ కొట్టారా? లోకేశ్ కనగరాజ్ తన దర్శకత్వంతో మెప్పించారా? నాగార్జున విలనిజం ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
Read More
8

మినిమమ్ బ్యాలెన్స్: ఏ బ్యాంకులో ఎంత ఉండాలంటే?

భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ.. సేవింగ్స్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో చేసిన ప్రకటనలు చాలామంది ఖాతాదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ వేలరూపాయల్లో ఉంచాలనే బ్యాంకుల నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కథనంలో ఏ బ్యాంకులో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం.
Read More
9

దర్శన్‌.. చట్టానికి అతీతులేం కారు

ఢిల్లీ: అభిమాని హత్య కేసులో అరెస్టై.. బెయిల్‌ మీద బయటకు వచ్చిన కన్నడ స్టార్‌ నటుడు దర్శన్‌కు భారీ షాక్‌ తగిలింది. కర్ణాటక హైకోర్టు ఆయనకు ఇచ్చి న బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. బెయిల్‌ ఇవ్వడానికి ఎలాంటి చట్టపరమైన కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సినిమావాళ్లకు జైళ్లలో వీఐపీ ట్రీట్‌మెంట్‌ అందించడంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More
10

పరదా కోసం రోడ్డెక్కిన స్టార్ హీరోయిన్!

అనుపమ పరమేశ్వరన్ లీడ్‌ రోల్‌లో వస్తోన్న తాజా చిత్రం 'పరదా'. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే పరదా ట్రైలర్‌ రిలీజ్ చేయగా..ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో అనుపమ ఫుల్ బిజీగా ఉంది. ఇవాళ తన మూవీ కోసం రోటీన్‌కు భిన్నంగా ప్రచారం చేసింది. రోడ్డుపై మైక్ పట్టుకుని తన మూవీని చూడాలని ఆడియన్స్‌ను కోరింది.
Read More
11

ముగిసిన మంచు లక్ష్మి ఈడీ విచారణ

టాలీవుడ్‌ నటి మంచు లక్ష్మీ ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి వెళ్లిన మంచు లక్ష్మీని ఈడీ బృందం దాదాపు మూడున్నర గంటల పాటు విచారించింది. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఐదేళ్ల లావాదేవీలను ఈడీ అధికారులకు లక్ష్మీ అందించారు.
12

చరిత్ర సృష్టించిన జేడన్‌ సీల్స్‌

వెస్టిండీస్‌ పేస్‌ సంచలనం జేడన్‌​ సీల్స్‌ (Jayden Seals) సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ (Dale Steyn)పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును సీల్స్‌ బద్దలు కొట్టాడు.
Read More
13

ఏపీ ఓట్ల చోరీపై రాహుల్‌ గాంధీ మాట్లాడరా?

కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీకి వైఎస్‌ జగన్‌ సూటి ప్రశ్నఏపీలో కూటమి పాలనలో ఎన్నో స్కామ్‌లువాటిపై కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు స్పందించడం లేదు? ఏపీలో 2024 జరిగిన ఎన్నికల్లో 48 లక్షల ఓట్లు తేడా వచ్చాయి. ఓట్ల చోరీ గురించి పోరాడతానంటున్న రాహుల్‌ గాంధీ.. ఏపీ గురించి ఎందుకు మాట్లాడరు?
Read More
14

పులివెందులలో జరిగింది ఎన్నికంటారా?

తాడేపల్లి: ఏపీలో పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతలు లేవనడానికి.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా దాడులే నిదర్శనమని అన్నారాయన. సాక్షాత్తూ కలెక్టర్‌ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్..
Read More
15

బీసీసీఐపై హర్భజన్‌ సింగ్‌ ఆగ్రహం.. కారణం ఇదే

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మండిపడ్డాడు. దేశం కంటే మీకు ఆటే ముఖ్యమా అంటూ బోర్డు పెద్దల్ని ప్రశ్నించాడు. క్రికెట్‌ కంటే సైనికుల త్యాగం ఎంతో గొప్పదని.. కాబట్టి ఇప్పటికైనా ఆసియా కప్‌-2025 (Asia Cup) విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.
Read More
16

పోలీసుల కాళ్లు పట్టుకున్న పులివెందుల ఓటర్లు

పులివెందుల: జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా.. బయటి నుంచి వచ్చిన జనాలతో టీడీపీ నేతలు ఇష్టానుసారం ఓట్లు వేయిస్తున్నారు. యధేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. పలు గ్రామాల్లోని సిసలైన ఓటర్లు వినూత్న రీతిలో ధర్నాకు దిగారు. తమను ఓటు హక్కు వినియోగించకుండా అడ్డుకోవద్దంటూ పోలీసుల కాళ్లపై పడ్డారు. ఈ హఠాత్‌ పరిణామంతో పోలీసులు కంగుతిన్నారు. అటుపై..
Read More
17

పులివెందుల: వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌

పులివెందుల: జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. పోలీసులు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఈ ఉదయం ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు.. బలవంతంగా ఈడ్చుకెళ్లి ఆయన్ని వాహనం ఎక్కించారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు లాగి అవతల పడేశారు. బయటి నుంచి జనాలను అనుమతించిన పోలీసులు..
Read More
18

'జడలు ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు'

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ది ప్యారడైజ్'. దసరాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే నాని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్‌లో ఇంతకు ముందెన్నడు కనిపించని విధంగా రెండు జడలతో కనిపించారు. ఈ పోస్టర్‌ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.
Read More
19

మునీర్‌ పిచ్చిప్రేలాపనలకు భారత్‌ కౌంటర్‌

న్యూఢిల్లీ: అమెరికా గడ్డపై పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ రెచ్చిపోయాడు. భారత్‌పై పిచ్చిప్రేలాపలను దిగాడు. ఈ క్రమంలో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ తలాతోకలేని వ్యాఖ్యలు చేశాడు. అయితే భారత్‌ ఆ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించింది. అణ్వాయుధాలను ప్రయోగిస్తామన్న బెదిరింపులను.. అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలని పేర్కొంది. ఈ క్రమంలో అమెరికా అండతోనే..
Read More
20

రతన్‌ టాటా బతికి ఉంటేనా..

న్యూఢిల్లీ: భారత దేశ చరిత్రలోనే అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం అత్యంత విషాద ఘటనగా నిలిచింది. అయితే ఈ ప్రమాదం తర్వాత బాధితుల విషయంలో టాటా గ్రూప్‌ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటి రూపాయల పరిహారమని ప్రకటించి.. అందులో సగం మందికే రూ.25 లక్షలను ఇప్పటిదాకా చెల్లించింది. దీంతో చాలా కుటుంబాలు అవస్థలు పడుతుండగా.. వాళ్ల తరఫున వాదించబోతున్న లాయర్‌..
Read More
21

'ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే'.. బిగ్‌ బాస్‌పై బిగ్‌ ట్విస్ట్‌!

టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో తొమ్మిదో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి రణరంగమే అంటూ నాగార్జున ఇప్పటికే అంచనాలు పెంచేశారు. కామన్ మ్యాన్‌ కేటగిరీలో కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష అంటూ ఇప్పటికే ప్రోమోను రిలీజ్ చేశారు.
Read More
22

అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున బిగ్ సర్‌ప్రైజ్!

అక్కినేని నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన బ్లాక్‌ బస్టర్ మూవీ శివ. 1990లో రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్‌ సినీ చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున సైతం శివ రోజులను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని నాన్న చెప్పారని అన్నారు.
Read More
23

అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్‌ ఓ జోకర్‌!

ఇంగ్లండ్‌ టెస్టు దిగ్గజం జో రూట్‌ (Joe Root)ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) విమర్శలు చేశాడు.ఆస్ట్రేలియా పిచ్‌ల మీద అతడు పెద్దగా బ్యాట్‌ ఝులిపించలేడన్నాడు. ఇందుకు మొయిన్‌ అలీ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. వార్నర్‌ను ఓ జోకర్‌గా అభివర్ణిస్తూ ఘాటుగా విమర్శించాడు.
Read More
24

ట్రంప్‌ టారిఫ్‌కు భారత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌!

న్యూఢిల్లీ: అన్యాయంగా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌ నిర్ణయానికి భారత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తన పర్యటన రద్దు చేసుకున్నారు. అంతేకాదు.. సుమారు 30 వేల కోట్ల విలువైన రక్షణ..
Read More
25

టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోవద్దు జైస్వాల్‌: రోహిత్‌

ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకున్న టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) అనూహ్యంగా యూటర్న్‌ తీసుకున్నాడు. గోవాకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్న ఈ యువ ఆటగాడు తిరిగి ముంబైకే ఆడాలని ఫిక్సయ్యాడు. అయితే, జైసూ తన నిర్ణయం మార్చుకోవడానికి ప్రధాన కారణం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma).
Read More
26

మహేశ్‌బాబుకు నచ్చలేదు.. తీరా సినిమా సూపర్‌ హిట్టు!

మహేశ్‌బాబు (Mahesh Babu) కెరీర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో మురారి ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. 2001లో రిలీజైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మహేశ్‌ నటన, పాటలు సినిమాకే హైలైట్‌. అయితే కృష్ణవంశీ మురారి కథ చెప్పినప్పుడు మహేశ్‌కు అస్సలు నచ్చలేదట. ఈ విషయాన్ని కృష్ణవంశీ స్వయంగా ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో వెల్లడించాడు. He hated it 😀😀😀 https://t.co
Read More
27

ట్రంప్‌ టారిఫ్‌.. మోదీ స్ట్రాంగ్‌ మెసేజ్‌

న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 50 శాతం సుంకం విధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సుంకాలతో అధిక మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుసని, అయినా రాజీపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారాయన. రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం. వాళ్ల కోసం దేనికైనా భారత్‌..
Read More
28

మరోసారి భారత్‌కు వార్నింగ్‌

వాషింగ్టన్‌: భారత్‌పై 50 శాతం సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రష్యాతో ఇకనైనా చమురు వాణిజ్యం ఆపకుంటే.. పరోక్ష ఆంక్షలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. చైనా, ఈయూల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌.. భారత్‌ విషయంలో మాత్రమే ఎందుకిలా చేస్తున్నారనేదానిపైనా..
Read More
29

గ్రాండ్‌గా మధు ప్రియ సిస్టర్‌ పెళ్లి వేడుక

టాలీవుడ్ సింగర్ మధు ప్రియ చెల్లి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఆమె సిస్టర్‌ శృతి ప్రియ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది మధుప్రియ. తన చెల్లి పెళ్లిలో ఫుల్‌ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌ చేసింది సింగర్. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
Read More
30

భారత్‌పై ట్రంప్‌​ టారిఫ్‌ బాంబ్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరోసారి టారిఫ్‌ బాంబ్‌ పేల్చారు. అదనంగా మరో 25 శాతం పెనాల్టీ విధిస్తున్నట్లు ప్రకటించారాయన. దీంతో భారత్‌పై అమెరికా విధించిన సుంకాల మోత 50 శాతానికి చేరింది. ఈ క్రమంలో అధికారిక ఉత్తర్వులపై ఆయన సంతకం చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మిత్ర దేశం అంటూనే రష్యాతో భారత్‌ మైత్రిపై..
Read More
31

పులివెందులలో టీడీపీ దాడులు అందుకే.. వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ జిల్లా: తన సొంత నియోజకవర్గం పులివెందులలో గత రెండ్రోజులుగా జరిగిన పరిణామాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆరా తీశారు. టీడీపీ శ్రేణుల మూక దాడిలో గాయపడిన నలుగురు పార్టీ నేతలనూ బుధవారం సాయంత్రం ఆయన ఫోన్‌ ద్వారా పరామర్శించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న అరాచ ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో..
Read More
32

ఉత్తరాఖండ్‌ క్లౌడ్‌బరస్ట్‌.. వాళ్లంతా ఎక్కడా?

డెహ్రాడూన్‌: దేవభూమి ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో క్లౌడ్‌బరెస్ట్‌ ఘోర విషాదానికి దారి తీసింది. బురదతో కూడిన వరద రెండు గ్రామాలపై విరుచుకుపడి పలువురు గల్లంతు అయ్యారు. ఇప్పటిదాకా ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. అయితే కేరళ నుంచి 28 మంది బృందం ఒకటి ఆచూకీ లేకుండా పోవడంతో ఆందోళన నెలకొంది. వాళ్లంతా..
Read More
33

పులివెందులలో టీడీపీ అరాచకం.. భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ

వైఎస్సార్‌ జిల్లా: పులివెందుల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నారు. తాజాగా పులివెందుల మండలం నల్లగొండువారిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల రాముపై పచ్చ మూకల దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వారికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంది.
Read More
34

Asia Cup 2025: టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి!

ఆసియా కప్‌-2025 నేపథ్యంలో టీమిండియా ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) ఈ మెగా టోర్నీ ఆడతాడా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది. స్పోర్ట్స్‌ హెర్నియాకు సర్జరీ చేయించుకున్న సూర్య.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే, ఆసియా కప్‌ నాటికి అతడు పూర్తి స్థాయిలో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తాడా? లేదా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు..
Read More
35

ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్‌లో సత్తాచాటిన మహ్మద్‌ సిరాజ్‌

ఐసీసీ టెస్టు బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ స‌త్తాచాటాడు. సిరాజ్ త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ ర్యాంక్ సాధించాడు. సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 12 స్ధానాలు ఎగ‌బాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అత‌డితో పాటు మ‌రో ఫాస్ట్ బౌల‌ర్ ప్ర‌సిద్ద్ కృష్ణ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. ప్రసిద్ద్‌ 25 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
Read More
36

'రాజాసాబ్' కొత్త అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత

ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా గురించి నిర్మాత విశ్వప్రసాద్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు. అక్టోబరు కల్లా వర్క్ పూర్తవుతుందని.. కాకపోతే తెలుగు బయ్యర్లు సంక్రాంతికి రమ్మని అడుగుతున్నారని, త్వరలో రిలీజ్ గురించి క్లారిటీ ఇస్తామని అన్నారు. అలానే పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.
Read More
37

నాకు మొదటి ఫోన్‌ గిఫ్ట్‌ ఇచ్చిందే ఆయనే: ఉదయ భాను

టాలీవుడ్ యాంకర్ ఉదయభాను కేవలం యాంకరింగ్‌ మాత్రమే కాదు.. నటిగానూ అభిమానులను మెప్పించింది. పలు చిత్రాల్లో కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఉదయభాను నటిస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్. సత్యరాజ్‌ కీలక పాత్రలో వస్తోన్న ఈ మూవీలో ఉదయభాను ఛాలెంజింగ్‌ రోల్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
Read More
38

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్‌లతో అందరినీ అలరిస్తూ ఉంటారు. జాక్వెలిన్ చేసిన రేస్, రైడ్, వెల్కమ్, హౌస్‌ఫుల్, ఫతే వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక జాక్వెలిన్ త్వరలో వి. జయశంకర్ దర్శకత్వం వహించే మహిళా ప్రధాన చిత్రంలో నటించవచ్చని తెలుస్తోంది. దర్శకుడు జయ శంకర్ గతంలో ‘పేపర్ బాయ్’, ‘అరి’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.
39

సిరాజ్‌ ఎమోషనల్‌.. గిల్‌ రియాక్షన్‌ వైరల్‌

ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook) క్యాచ్‌ మిస్‌ చేయడంపై టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) స్పందించాడు. తాను ఒకవేళ ఆ క్యాచ్‌ సరిగ్గా పట్టి ఉంటే.. ఆట ఐదో రోజుకు చేరి ఉండకపోయేదని అభిప్రాయపడ్డాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా కలిగిన బ్రూక్‌ విషయంలో తాను చేసిన పొరపాటు వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
Read More
40

ఐదో టెస్టులో టీమిండియా సంచలన విజయం

లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో టీమిండియా సమం చేసింది. ఈ విజయంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన సిరాజ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ మొత్తంగా 8 వికెట్లు పడగొట్టాడు.
Read More
41

మా కోడలికి దక్కిన గొప్ప గౌరవం: మెగాస్టార్‌ ట్వీట్‌

కోడలికి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ కో ఛైర్మన్‌గా అవకాశం దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. క్రీడల అభివృద్ధికి ఉపాసన నియామకం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది గొప్ప బాధ్యతతో పాటు మా కోడలికి దక్కిన గౌరవమని ట్వీట్ చేశారు. ఉపాసన నిబద్ధత, అభిరుచి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
Read More
42

కేసీఆర్‌తో బీఆర్‌ఎస్‌ నేతల భేటీ.. కవిత, కాళేశ్వరంపై చర్చ!

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీష్‌ రావు, జగదీష్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌తో పాటుగా కాళేశ్వరం కమిషన్‌ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నట్టు సమాచారం. మరోవైపు.. కాసేపట్లో తెలంగాణ కేబినెట్..
Read More
43

‘లోకేశ్‌కు సీఎం పదవి.. చంద్రబాబు ఇంట్లో గొడవలు’

లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేశ్‌ ఇంట్లో గొడవలు పెడుతున్నాడు. కుటుంబ కలహాలు పెరిగాయి. లోకేశ్‌ను అందుకే చంద్రబాబు పొగుడుతున్నారు. సరిగ్గా చదువుకోని లోకేశ్‌ను మంత్రిని చేశారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు లోకేశ్‌. చంద్రబాబు ప్రతీ విషయంలోనూ డ్రామాలు ఆడుతున్నారు. భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు. ఢిల్లీలో పనిచేసే ఇతర దేశాల విలేకర్లకు నెలవారీ జీతాలు ఇస్తున్నారు. పదే పదే 90
Read More
44

ENG VS IND 5th Test: ఇంగ్లండ్‌ జట్టుకు శుభవార్త

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌ చివరి రోజు ఇంగ్లండ్‌ గెలవాలంటే 35 పరుగులు, భారత్‌ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్‌కు శుభవార్త అందింది. తొలి రోజు ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన క్రిస్‌ వోక్స్‌ అవసరమైతే బ్యాటింగ్‌కు తిరిగి వస్తాడని ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ తెలిపాడు.
Read More
45

గిల్‌, గంభీర్‌ తీరుపై అశ్విన్‌ ఆగ్రహం

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా ఆట తీరుపై భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) విమర్శలు గుప్పించాడు. నాయకత్వ బృందం వ్యూహాలు సరిగ్గాలేవని.. ప్రతి మ్యాచ్‌లోనూ ఆఖరి వరకు పోరాడినా ఓడిపోవడం హర్షించదగ్గ విషయం కాదన్నాడు. ఓవల్‌ టెస్టులోనూ పాత తప్పిదాలే పునరావృతం చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Read More
46

భారత్‌పై ట్రంప్‌ సన్నిహితుడి వివాదాస్పద వ్యాఖ్యలు

డొనాల్డ్ ట్రంప్ కీలక సహాయకుడు స్టీఫెన్ మిల్లర్.. భారత్ వాణిజ్యం కారణంగానే రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తోంది. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ఎంత మాత్రం కరెక్ట్‌ కాదు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే విషయంలో భారత్ దాదాపుగా చైనాతో సమానంగా ఉంది. భారత్‌ చేసుకుంటున్న దిగుమతులు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిధులు సమకూర్చడానికి సాయపడుతున్నాయి. ఇది..
Read More
47

కాళేశ్వరం లీక్స్‌!

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అయితే ఈ తుది నివేదికలోని విషయాలు ఇప్పుడు బయటకు పొక్కాయి. ఈ ప్రాజెక్టులో అవినీతి బాధ్యులంటూ మాజీ సీఎం కేసీఆర్‌ సహా పలువురి పేర్లను కమిషన్‌ ప్రస్తావించింది. అంతేకాదు..
Read More
48

డిషూమ్‌ గురు శిబు సోరెన్‌ కన్నుమూత

జేఎంఎం వ్యవస్థాపకుడు, జార్ఖండ్‌ మాజీ సీఎం శిబు సోరెన్‌ ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ ఉదయం(ఆగష్టు 4న) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ధృవీకరించారు. జార్ఖండ్‌ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమంలో కీలక నేతగా, కేంద్ర మాజీ మంత్రిగా, రాజ్యసభ్యుడిగానూ ఆయన విశేష సేవలందించారు. డిషూమ్‌ గురు అనే పేరు..
Read More
49

ఈ సీఈవో శాలరీ.. ఐటీ కంపెనీల్లోనే టాప్‌

ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌టెక్‌ సీఈవో సి.విజయకుమార్ రికార్డు స్థాయి వేతనం అందుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయన 10.85 మిలియన్ డాలర్లు (సుమారు రూ.94.6 కోట్లు) సంపాదించారు. ఇది భారతీయ ఐటీ రంగంలో ఎగ్జిక్యూటివ్‌లు పొందుతున్న అత్యధిక వేతనంగా నిలిచింది.
Read More
50

యశస్వి జైస్వాల్‌ వరల్డ్‌ రికార్డు

‌టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాలో ఇంత వరకు టెస్టు క్రికెట్‌లో ఏ ఆటగాడికీ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో జైస్వాల్‌ సాధించిన సెంచరీ (వంద పరుగులు)లో 82 పరుగులు బిహైండ్‌ స్క్వేర్‌ పొజిషన్‌ నుంచి వచ్చినవే. ఇలా ఒక ప్రత్యేకమైన ఏరియా నుంచి ఏకంగా 82 పరుగులు సాధించి... శతకం పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా జైస్వాల్‌ ప్రపంచ రికార్డు సాధించాడు.
Read More