రాజకీయాలను కాపాడాలి: పద్మ
చంద్రబాబు పాపం పండిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.
హైదరాబాద్: చంద్రబాబు పాపం పండిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విలువల పతనానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. రాజకీయాలను ధనమయం చేశారని, చంద్రబాబువి కుట్ర రాజకీయాలని విమర్శించారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని ప్రోత్సహించింది చంద్రబాబే అన్నారు. చంద్రబాబు లాంటి కపట నాయకుల నుంచి రాజకీయాలను కాపాడాలని వాసిరెడ్డి పద్మ అన్నారు.


