ఎవరి వారసులున్నా వదలం: హోంమంత్రి
హైదరాబాద్: డ్రగ్ మాఫియాపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు సాగిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈ కేసులో టీఆర్ఎస్ వారసులకు లింకులు ఉన్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, ప్రతిపక్షాలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు, డ్రగ్స్ మాఫియా కాంగ్రెస్ పుణ్యమేనని ఆరోపించారు.