వ్యాపారిని బైక్‌తో ఢీకొట్టి.. ఘరానా మోసం! | merchant hit by bike and cheated | Sakshi
Sakshi News home page

వ్యాపారిని బైక్‌తో ఢీకొట్టి.. ఘరానా మోసం!

Jun 18 2016 11:53 PM | Updated on Sep 4 2018 5:21 PM

వ్యాపారిని బైక్‌తో ఢీకొట్టి.. ఘరానా మోసం! - Sakshi

వ్యాపారిని బైక్‌తో ఢీకొట్టి.. ఘరానా మోసం!

నగరంలో శనివారం రాత్రి ఘారానా చోరీ జరిగింది.

హైదరాబాద్‌: నగరంలో శనివారం రాత్రి ఘారానా చోరీ జరిగింది. దుకాణం మూసివేసి బైక్‌పై ఇంటికి వెళుతున్న వ్యాపారిని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి.. రూ. 12 లక్షలు దోచుకున్నారు. అంతేకాకుండా వ్యాపారి బైక్‌ ను సైతం తీసుకొని పరారయ్యారు. ఈ ఘటన సుల్తాన్ బజార్‌లో జరిగింది.

సిద్ధి అంబర్ బజార్‌లో రాజధాని టైర్ల దుకాణం యాజమాని దివేష్ ఆదియా శనివారం రాత్రి ఇంటికి వెళుతుండగా ఈ దారుణం జరిగింది. బైక్‌ మీద వచ్చిన ఇద్దరు యువకులు ఆయన బైక్‌ను ఢీకొట్టి.. దృష్టి మరల్చారు. ఈ ప్రమాదం హడావిడిలో ఉండగానే దివేష్ బైక్‌తోపాటు ఆయన వద్ద ఉన్న రూ. 12 లక్షలను దోచుకున్నారు. దీనిపై బాధితుడు సుల్తాన్ బజార్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement