నీట్‌లో మెరిసిన కల్వకుర్తి వాసి

నీట్‌లో మెరిసిన కల్వకుర్తి వాసి - Sakshi

కల్వకుర్తి ‌: కల్వకుర్తి పట్టణానికి చెందిన చేకూరి మహేశ్వరాచారి శుక్రవారం విడుదలైన నీట్‌ ఫలితాల్లో ఆలిండియా 1280 వ ర్యాంకు సాధించి సత్తాడాటాడు. రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన పాండురంగాచారి, రత్నమాల కుమారుడైన మహేశ్వరాచారి పదో తరగతి కల్వకుర్తిలోనే చదవాడు ఇంటర్‌ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతూ 981 మార్కులు సాధించాడు. నీట్‌ పరీక్షలకు హాజరై 621 మ మార్కులతో 1280 వ ర్యాంకును దక్కించుకున్నారు. 

 

విద్యార్థిని సాక్షి పలకరించగా మంచి ర్యాంకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. 1500 వరకు ర్యాంకు వస్తుందని అంతకంటే మెరుగు రావడం ఇటీవలే 100 వసంతాలు పూర్తిచేసుకున్న ఉస్మానియా కళాశాలలో వైద్య విభాగంలో సీటు లభిస్తుందన్న ఆనందం పట్టలేకపోతున్నా అని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం కృషి పట్టుదలతో మంచి స్థానం సాధించడంతోపాటు వైద్యంలోనూ మంచి విద్యనభ్యసించి వృత్తికి గౌరవం తెస్తానని మహేశ్వరాచారి అన్నారు.

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top