భారత ఒలింపిక్ సంఘం ప్రకటన
చెన్నై: ఢిల్లీ 2010 కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో జరిగిన కుంభకోణంలో ఆయన ప్రధాన నిందితుడు. ఇందులో చోటు చేసుకున్న అవినీతిలో భాగం ఉందని ప్రాథమికంగా తేలడంతో పది నెలల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆయన రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొంటే దేశం పరువు పోతుందని హైకోర్టు ఆయనను అడ్డుకుంది. ఇలాంటి నేపథ్యం ఉన్న సురేశ్ కల్మాడీ ఇప్పుడు మరోసారి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో భాగమవుతున్నారు. కల్మాడీని ‘గౌరవ’ హోదాలో తమ జీవితకాల అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది. కల్మాడీతోపాటు గతంలోనే రద్దయిన భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలాను కూడా అదే హోదాలో నియమించారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.
భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఐఏబీఎఫ్)తో మరోసారి చర్చించిన తర్వాతే కొత్తగా ఏర్పడిన భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ)కు గుర్తింపు ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఐఓఏ అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్ వెల్లడించారు. ఇప్పటికే వివాదాల్లో ఉన్న వేర్వేరు క్రీడా సమాఖ్యలు కోర్టులకెక్కకుండా మూడు నెలల్లో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. లేదంటే ఆటగాళ్లను అంతర్జాతీయ టోర్నీలకు పంపించమని ఆయన హెచ్చరించారు. ఈ వివాదాల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ రజత పతక విజేత సింధును సత్కరించిన ఐఓఏ, రూ. 30 లక్షల నగదు పురస్కారాన్ని అందించింది. సాక్షి మలిక్కు రూ. 20 లక్షలు, కోచ్ గోపీచంద్కు కూడా రూ. 15 లక్షలు అందజేశారు.
2021లో ఏపీలో జాతీయ క్రీడలు!
మరోవైపు 2017లో జాతీయ క్రీడలు నిర్వహించాల్సి ఉన్న గోవాకు ఐఓఏ ఆఖరి గడువు ఇచ్చింది. ఇప్పటికి 60 శాతం పనులే జరిగాయని, త్వరలో పూర్తి చేసుకోకపోతే నిర్వాహక హక్కులు తొలగిస్తామని రామచంద్రన్ చెప్పారు. అవసరమైతే నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని కూడా ఆయన అన్నారు. అయితే 2019లో ఛత్తీస్గఢ్ తర్వాత 2021లో జాతీయ క్రీడల నిర్వహణకు ఏపీ, ఉత్తరాఖండ్ పోటీ పడుతున్నాయని ఆయన వెల్లడించారు. 2020లో ఆసియా బీచ్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ఈ ఈవెంట్ జరిగే అవకాశం ఉందని కూడా రామచంద్రన్ స్పష్టం చేశారు.
జీవితకాల అధ్యక్షుడిగా కల్మాడీ
Published Wed, Dec 28 2016 12:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..
బంగారం స్పీడ్కు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!
Sunita Williams: రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు
ఓటు వేశారు.. డైమండ్ రింగ్ గెలుచుకున్నారు!
అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
చంద్రబాబు ఒక శాడిస్ట్: మంత్రి కారుమూరి
Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్ నెక్లెస్ విశేషం ఏంటో తెలుసా?
Shivathmika Rajashekar: అదిరే అందాలతో కవ్విస్తోన్న శివాత్మిక (ఫోటోలు)
చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement