న్యూఢిల్లీ: పాకిస్థాన్, భారత్ మధ్య ఎంత వైరం ఉంటుందో దాదాపు చైనాకు భారత్కు మధ్య కూడా అంతే ఉంటుంది. అయితే, అది మాత్రం పైకి కనిపించదు. సైనికపరమైన పోటీ కూడా భారత్, చైనా మధ్య ఎప్పుడూ ఉంటుంది. అలాంటి, భారత్, చైనాలు ఓ నౌకను కాపాడేందుకు కలిసి ముందుకుసాగాయి. బ్రిటన్కు చెందిన ఓ గూడ్స్ నౌకపై సముద్రపు దొంగలు దాడి చేయగా దాని నుంచి రక్షించాయి. చైనా నావికా దళం సమీపంలోనే ఈ దాడి జరిగినా ఆ దేశం కంటే ముందు భారత్ స్పందించి సహాయం చేసినందుకు చైనా ధన్యవాదాలు తెలిపింది.
ఇరు దేశాల మధ్య సముద్ర జలాల్లో పరస్పర సంరక్షణ, సమన్వయం ఇలాగే ఎప్పటికీ ఉండాలని పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్కు చెందిన మారిటైం ట్రేడ్ ఆర్గనైజేషన్(యూకేఎంటీవో) తువాలుకు చెందిన ఎంవీఓఎస్ 35 అనే 21,000 టన్నుల నౌకను పర్యవేక్షిస్తోంది. ఇది మలేషియాలోని కెలాంగ్ నుంచి పోర్ట్ ఆఫ్ ఏడేన్కు వెళుతోంది. ఆ సమయంలో ఈ నౌకపై సముద్రపు దొంగల దాడి జరిగినట్లు యూకేఎంటీంవో నుంచి భారత్కు చెందిన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ ముంబయి, ఐఎన్ఎస్ తర్కాష్లకు అప్రమత్తతో కూడిన సమాచారం వచ్చింది. అదే సముద్రంలో చైనా, ఇటాలియన్, పాకిస్తాన్కు చెందిన నౌకా దళాలు కూడా ఉన్నాయి.
వారికి కూడా సముద్రపు దొంగల అలర్ట్ వెళ్లింది. అయితే, వాటికంటే ముందు స్పందించిన భారత నేవీ వెంటనే ఒక హెలికాప్టర్ నుంచి పంపించి రాత్రికి రాత్రే రక్షణగా నిలిచింది. అప్పటికే ఆ నౌకలోని కెప్టెన్, ఇతర సిబ్బంది తమ ప్రాణాలు రక్షించుకునేందుకు లోపలికి వెళ్లి తాళం వేసుకున్నారు. అయినప్పటికీ ఆ షిప్ కెప్టెన్తో సంప్రదింపులు జరిపి వారికేం భయం లేదని హామీ ఇచ్చింది. ఈ లోగా చైనాకు చెందిన 18మంది నౌకా దళ సైనికులు కూడా అక్కడి చేరుకొని ఆ నౌకకు రక్షణ కల్పించారు. అయితే, భారత్ ఆర్మీ హెలికాప్టర్ను పంపించిన వెంటనే అక్కడి సముద్రపు దొంగలు పారిపోయినట్లు తెలుస్తోంది. శీఘ్రంగా స్పందించిన భారత్కు ఈ సందర్భంగా చైనా కృతజ్ఞతలు తెలిపింది.
భారత్కు థ్యాంక్స్ చెప్పిన చైనా
Published Sun, Apr 9 2017 1:30 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
IPL 2024: ముగిసిన లీగ్ మ్యాచ్లు.. ప్లే ఆఫ్స్కు చేరిన జట్లు ఇవే
రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
కమల్హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్గా! (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
స్పేస్లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (19-05-2024)
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement