థానే: వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ముఠా కేసులో కీలక నిందితుడిని థానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో జయ్ ముఖిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత నెలలో రూ.2 వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచీ అతడు పరారీలో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లో నిందితుడు ఉన్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు కొన్ని గంటలపాటు అన్వేషించి జయ్ ముఖీని అదుపులోకి తీసుకున్నట్లు థానే క్రైమ్ విభాగం డీసీపీ పరాగ్ మనేర్ వెల్లడించారు.
నేపాల్ సరిహద్దు ప్రాంతంలో నిందితుడు తలదాచుకున్నాడని సమాచారం తెలిసినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ పోలీసులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గోరక్ పూర్ నుంచి రైలులో గోరక్ పూర్ వెళ్లడానికి సిద్ధమవుతుండగా సోమవారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో తమ బృందంతో కలిసి వెళ్లి అదుపులోకి తీసుకున్నాం, అనంతరం థానేకు తీసుకొచ్చామని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ లో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే 18.5 టన్నుల నిషేధిత డ్రగ్స్ కేసులో నిందితులను మహారాష్ట్రలోని సోలాపూర్ లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ విచారణలో మరిన్ని వివరాలు బయటకు వస్తాయని డీసీపీ పేర్కొన్నారు.
2వేల కోట్ల డ్రగ్స్ కేసు.. కీలక నిందితుడి అరెస్ట్
Published Tue, May 31 2016 3:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement