
మన నోబెల్ విజేతకు చదువంటే ఇష్టం లేదంట
తనకు చదువంటే అస్సలు ఇష్టం ఉండేది కాదని నోబెల్ బహుమతి విజేత, భారత సంతతికి చెందిన వెంకట్రామన్(వెంకీ) రామకృష్ణన్ అన్నారు.
లండన్: తనకు చదువంటే అస్సలు ఇష్టం ఉండేది కాదని నోబెల్ బహుమతి విజేత, భారత సంతతికి చెందిన వెంకట్రామన్(వెంకీ) రామకృష్ణన్ అన్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తిరిగి చదవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. 2009లో వెంకట్రామన్ కు రసాయన శాస్త్ర విభాగంలో ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. వేల్స్లో నిర్వహిస్తున్న హే ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న సభికుల ముందు ఆయన మాట్లాడుతూ తనకు చదువంటే అసలు ఇష్టం ఉండేది కాదని చెప్పారు.
తాను ఎన్నో పుస్తకాలు చదివానని అయితే, తాను అభ్యసిస్తున్న తరగతికి సంబంధించిన పుస్తకాలు కావని చెప్పారు. తల్లిదండ్రులు తనకు పదేపదే సైన్స్పై మక్కువ పెంచుకోవాలని చెప్పడంతో మెల్లగా దానిని చదవడం అలవాటు చేసుకున్నానని ఆయన చెప్పారు. తమిళనాడులోని చిదంబరంలో జన్మించిన వెంట్రామన్ బరోడాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. మర్చి 2015లో ఆయన రాయ్ సొసైటీ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు.