సమైక్యాంధ్ర ఉద్యమం విజయవంతమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం విజయవంతమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్జీవోలు సమ్మె విరమించి ఆందోళనలు నిర్వహించుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీపీఐ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమైక్య ఉద్యమం విజయవంతమైందని నారాయణ వ్యాఖ్యానించడం విశేషం. విభజనకు వ్యతిరేకంగా ఎన్జీవోలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.


