మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన వైఎస్ఆర్సిపి | YSRCP gave once again no-confidence motion Notice | Sakshi
Sakshi News home page

మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన వైఎస్ఆర్సిపి

Feb 12 2014 11:08 AM | Updated on Oct 17 2018 6:22 PM

మేకపాటి రాజమోహన రెడ్డి - Sakshi

మేకపాటి రాజమోహన రెడ్డి

యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్ సిపి మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది.

న్యూఢిల్లీ: యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్ సిపి మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి నోటీస్ను స్పీకర్కు అందజేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఒక్క సభ్యుడు ఇచ్చినా స్పీకర్ స్వీకరిస్తారు. అయితే అవిశ్వాస తీర్మానానికి సభలో కనీసం 55 మంది మద్దతు ఉంటే తప్పనిసరిగా చర్చకు అనుమతిస్తారు.

 గతంలో  మేకపాటి  ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్ను  స్పీకర్ మీరాకుమార్  లోక్సభలో   చదివి వినించారు. సభ సజావుగా లేనందున అవిశ్వాస తీర్మానం చేపట్టలేకపోతున్నట్లు ఆమె తెలిపారు. సభ సజావుగా జరిగితే ఈ రోజు ఇచ్చిన నోటీస్ను మధ్యాహ్నం చర్చకు స్వీకరించే అవకాశం ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement